India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. నిరాశ్రయులు తలదాచుకున్న స్కూల్పై జరిపిన దాడిలో 28 మంది మరణించారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతోనే ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ హమాస్ ఉగ్రవాదులు పౌర మౌలిక సదుపాయాలను దుర్వినియోగం చేస్తున్నారంది. అయితే ఇజ్రాయెల్ ప్రకటనను పాలస్తీనా ఖండించింది.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆసుపత్రుల్లో పర్యవేక్షణ లోపాన్ని సవరించాలని ఆదేశించారు. ఈ బాధ్యతను వైద్యారోగ్యశాఖ HODలకు అప్పగించారు. పనివేళలు పాటించని సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. హాజరు నమోదు యాప్ను పటిష్టం చేయాలని సూచించారు.

తేది: అక్టోబర్ 11, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:19 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:57 గంటలకు
ఇష: రాత్రి 7.09 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

తేది: అక్టోబర్ 11, శుక్రవారం
అష్టమి: మధ్యాహ్నం 12.06 గంటలకు
ఉత్తరాషాఢ: తెల్లవారుజామున 5.25 గంటలకు
వర్జ్యం: మధ్యాహ్నం 1.35-3.10 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8.22-9.08 గంటల వరకు తిరిగి
మధ్యాహ్నం 12.17-1.04 గంటల వరకు

✒ రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి
✒ హరియాణా ఫలితాలపై ECకి కాంగ్రెస్ ఫిర్యాదు
✒ నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: CBN
✒ పవన్ కళ్యాణ్కు మళ్లీ అస్వస్థత
✒ CBN మాదిరి అబద్ధాలు చెప్పి ఉంటే CMగా ఉండేవాడినేమో: జగన్
✒ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి.. AP ప్రభుత్వం ఉత్తర్వులు
✒ TGవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
✒ APకి వెళ్లాల్సిందే.. TGలోని 11 మంది IASలకు కేంద్రం ఆదేశం
✒ కొండా సురేఖకు హైకోర్టు నోటీసులు

పోటీలో వెనుకబడినందుకు తమను క్షమించాలని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వినియోగదారుల్ని కోరింది. ఈ ఏడాది మూడో త్రైమాసిక ఆదాయ వివరాల సందర్భంగా ఆ లేఖను విడుదల చేసిందని ‘ది వెర్జ్’ మ్యాగజైన్ తెలిపింది. స్మార్ట్ఫోన్, సెమీకండక్టర్ విభాగాల్లో కొత్త ఆవిష్కరణలుండటం లేదన్న విమర్శల్ని శామ్సంగ్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే సంస్థ కొత్త ఉపాధ్యక్షుడు జియోన్ యంగ్-హ్యూన్ ఈ లేఖ రాశారని ‘ది వెర్జ్’ పేర్కొంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాన్ క్రీమిలేయర్ పరిమితిని పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం ఉన్న₹8 లక్షల పరిమితిని ₹15 లక్షలకు పెంచాలని క్యాబినెట్ ప్రతిపాదించింది. హరియాణా ఎన్నికలకు ముందు కూడా BJP క్రీమిలేయర్ను ₹6 లక్షల నుంచి ₹8 లక్షలకు పెంచింది. ఇది బీజేపీకి ఎన్నికల్లో లాభం చేయడంతో మహారాష్ట్రలో కూడా అదే ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.

ఢిల్లీలో మరోసారి ₹వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. తాజాగా నమ్కిన్ ప్యాకెట్ల మాటున సరఫరా చేస్తున్న ₹2 వేల కోట్లు విలువచేసే 200 కేజీల కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల ఢిల్లీలో పట్టుబడిన ₹5,620 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా ముఠాకు తాజాగా ఘటనతో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు లండన్ పరారైనట్టు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.