India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాబోయే రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 47 పనులు కొనసాగుతున్నాయి. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో కొన్నిటికి భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయి. బెంగళూరు-కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులు సాధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత మహిళల జట్టు 227 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా కెప్టెన్ మంధాన(5) విఫలమయ్యారు. హసబ్నిస్(42), దీప్తి శర్మ(41), యస్తిక(37), షఫాలీ(33) ఫర్వాలేదనిపించడంతో మోస్తరు స్కోరు చేసింది. న్యూజిలాండ్ టార్గెట్ 228.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నారు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ ఆయన డకౌటయ్యారు. ఈ సిరీస్లో ఆడిన మూడు ఇన్నింగ్స్ల్లోనూ హిట్మ్యాన్ క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగారు. గత 4 టెస్టుల రన్స్ అన్నీ కలిపి కూడా 100లోపే ఉండటం ఫ్యాన్స్ను ఆందోళనకు గురి చేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆడుతున్న ఈ సిరీస్లో రాణించాలని వారు కోరుతున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిన TV షోగా ‘The Lord of the Rings: The Rings of Power’ నిలిచింది. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయ్యింది. దీని మేకింగ్కు ₹3,800cr ఖర్చవగా, రైట్స్, ప్రమోషన్స్తో కలిపి మొత్తం ఖర్చు ₹8,300crకు చేరింది. ఒక్కో ఎపిసోడ్ తీయడానికి ₹480cr పెట్టారు. కల్కి, RRR, ఆదిపురుష్(₹588cr-₹630cr) బడ్జెట్తో పోల్చితే ఈ సిరీస్ బడ్జెట్ 15రెట్లు అధికం.

Jio సినిమాస్, Hotstar విలీనాన్ని ముందే ఊహించిన ఓ యాప్ డెవలపర్ <

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి నిన్న మోషన్ పోస్టర్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే దీనికి 8.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రికార్డ్స్ & ప్రభాస్ ఒకే పేజీలో ఉంటారని, యూట్యూబ్లో ఈ వీడియో ట్రెండింగ్లో ఉందని పేర్కొన్నారు.

వరుస నష్టాలతో డీలాపడిన దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. 80,170 వద్ద బలమైన రెసిస్టెన్స్ను దాటలేకపోయిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల నష్టంతో 80,065 వద్ద స్థిరపడింది. ఉదయం అరగంట నష్టాలను 24,350 వద్ద సపోర్ట్ తీసుకొని అధిగమించిన నిఫ్టీ చివరకు 36 పాయింట్లు కోల్పోయి 24,399 వద్ద నిలిచింది. Ultratech 2.66% లాభపడగా, HindUnilvr 5.8% నష్టపోయింది.

TG: ఒక్కో కార్మికుడికి దీపావళి బోనస్గా సింగరేణి యాజమాన్యం రూ.93,750 ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యాజమాన్యం బోనస్ అమౌంట్ రూ.358 కోట్లు రిలీజ్ చేసింది. అంతకుముందు లాభాల వాటా రూ.796 కోట్లను కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. పీబీజీతో జరిగిన మ్యాచులో జెట్ జట్టు భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన PBG 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది. ఛేదనలో జెట్ 18.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. జెట్ బ్యాటర్లలో దివ్యాంగ్(49 బంతుల్లో 93*), రోహిత్ పాటిల్(30 బంతుల్లో 80) పరుగులు చేశారు.

బెంగళూరులో డ్రైనేజీ, ట్రాఫిక్ ఐటీ కంపెనీల విస్తరణకు ఆటంకాలుగా మారాయని పారిశ్రామికవేత్త మోహన్దాస్ పాయ్ చేసిన ట్వీట్కు మంత్రి లోకేశ్ స్పందించారు. బెంగళూరును వదిలి APకి రావాలని, పెట్టుబడులు పెట్టే వారి కోసం 6 పాలసీలు సిద్ధం చేశామని తెలిపారు. ‘జగన్ ప్రభుత్వంలో పెట్టుబడిదారులు కంపెనీలు స్థాపించేందుకు భయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినా, ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది’ అని మోహన్ అన్నారు.
Sorry, no posts matched your criteria.