India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
J&K పహల్గామ్లో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #WeWantRevenge ట్రెండింగ్ చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను త్వరగా పట్టుకుని చంపేయాలని కోరుతున్నారు. ఇలాంటి వారికి భూమిపై జీవించే హక్కు లేదని పేర్కొంటున్నారు.
✒ పహల్గామ్ దాడికి బాధ్యులైన వారు మూల్యం చెల్లించకతప్పదు: గంభీర్
✒ దాడి గురించి వినగానే నా గుండె పగిలింది. వయలెన్స్కు దేశంలో చోటు లేదు: గిల్
✒ అమాయకులపై ఉగ్రదాడి ఎంతో బాధను కలిగిస్తోంది: సెహ్వాగ్
✒ బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఈ దాడిని ఊహించడానికే కష్టంగా ఉంది: ఆకాశ్ చోప్రా
✒ బాధితుల కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా: యువరాజ్
దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 6.5-7.5% పెరగొచ్చని CRISIL అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే అంచనాలతో గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం ఊపందుకుంటుందని తెలిపింది. అలాగే మౌలిక సదుపాయాల వ్యయం పెరగడంతో సిమెంట్ డిమాండ్ అధికమవుతుందని వెల్లడించింది. మొత్తం డిమాండ్లో 12 రాష్ట్రాల వాటా 63-65 శాతం ఉండొచ్చని వివరించింది. దీనివల్ల సిమెంట్ ధరలు 2-4% పెరగొచ్చని పేర్కొంది.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసెన్ గిలెస్పీ పాకిస్థాన్ జట్టుకు గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కోచ్గా పనిచేశారు. తనకు ఇవ్వాల్సిన జీతాన్ని పాకిస్థాన్ బకాయి పెట్టిందని ఆయన తాజాగా ఆరోపించారు. దానిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన కాంట్రాక్టును ఉల్లంఘించి నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకొన్నారని, తామేమీ బకాయిపడలేదని పీసీబీ తెలిపింది.
AP: జమ్మూకశ్మీర్ పహల్గామ్లోని బైసరీన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో విశాఖ వాసి గల్లంతైనట్లు సమాచారం. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల అక్కడికి టూర్ వెళ్లారు. అయితే దాడి తర్వాత ఆయనకు బంధువులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో చంద్రమౌళి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదానీ డేటా నెట్వర్క్స్ 26GHz బ్యాండ్లోని 400 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ను వాడుకునేందుకు ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.212 కోట్లు చెల్లించింది. గుజరాత్, ముంబై, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులోని స్పెక్ట్రమ్ను ఎయిర్టెల్ వినియోగించుకుంటుంది. దీనివల్ల 5G వేగం, నెట్వర్క్ కెపాసిటీ పెరగనుంది. యూజర్లకు నాణ్యమైన సేవలు అందుతాయి.
J&K పహల్గామ్లో జరిగిన పాశవిక <<16183726>>ఉగ్రదాడి<<>> వెనుక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)’ ఉన్నట్లు సమాచారం. ఇది పాక్కు చెందిన లష్కర్ ఏ తొయిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 AUGలో ఏర్పాటైంది. దీనికి షేక్ సాజిద్ కమాండర్, బాసిత్ అహ్మద్ ఆపరేషనల్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. దీన్ని కేంద్రం 2023లో ఉగ్రసంస్థగా ప్రకటించింది. కాగా నిన్న జరిగిన దాడిలో దాదాపు 30 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.
✒ 1616: ప్రఖ్యాత నాటక రచయిత షేక్స్పియర్ మరణం
✒ 1791: అమెరికా మాజీ అధ్యక్షుడు బుకానన్ జననం
✒ 1891: రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
✒ 1938: ప్రముఖ సింగర్ ఎస్.జానకి జననం
✒ 1969: నటుడు మనోజ్ బాజ్పాయ్ జననం
✒ 1992: సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం
✒ 2020: ప్రముఖ రంగస్థల నటి ఉషా గంగూలీ మరణం
✒ ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం
✒ నేడు ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం
AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో కసిరెడ్డి రాజశేఖర్కు ఏసీబీ కోర్టు మే 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో మొత్తం 29 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. A1గా రాజశేఖర్ను పేర్కొంది. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేసింది.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.