India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సుమారు 35 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలు, బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ తదితర అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.

TG: హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. ‘ఉపాధి’కి గాంధీ పేరు తొలగింపుపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై చర్చించనున్నారు. ఇతర అంశాలూ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కోల్కతా సాల్ట్ లేక్లోని IPAC ఆఫీసు, సంస్థ కో ఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ED దాడులు చేస్తోంది. కోల్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కేసులో TMC జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీని ED, CBI అధికారులు పలుమార్లు విచారించారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి IPAC, TMC కలిసి పనిచేస్తున్నాయి. కొన్ని నెలల్లో WBలో ఎన్నికలు జరగనున్నందున రైడ్స్కు ప్రాధాన్యం ఏర్పడింది.

AP: భోగాపురం ఎయిర్పోర్టు అంశంలో కూటమి నేతలు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘ఎయిర్పోర్టు పేరుతో కూటమి నాయకులు 15K ఎకరాల భూదోపిడీకి పాల్పడాలని చూశారు. ఏకంగా 130 కేసులు వేశారు. మేం వచ్చాక వాటన్నింటినీ పరిష్కరించాం. 2,700 ఎకరాల భూసేకరణ పూర్తిచేశాం. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చాం. రూ.920 కోట్లు ఖర్చు చేశాం. 3 గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం’ అని పేర్కొన్నారు.

మాస శివరాత్రి రోజున పరమశివుడిని ఆరాధించడం ద్వారా మీ సంకల్పం నెరవేరడానికి, సకల పాపాలు తొలగడానికి సువర్ణవకాశం లభిస్తుంది. పూర్వ కర్మ దోషాలు, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగి, దుష్ట శక్తులు నుంచి శివుని కవచం రక్షణగా లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శివునికి అత్యంత ప్రియమైన ఈ పవిత్ర రోజున మీ పేరు, గోత్రంతో <

పాక్ ఆర్మీని ఉద్దేశిస్తూ USలో Ph.D చేస్తున్న జోరైన్ నిజామనీ రాసిన ‘It Is Over’ అనే ఆర్టికల్ ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారింది. దేశభక్తిని బలవంతంగా రుద్దలేమని, సమాన అవకాశాలు కల్పించినప్పుడే అది సాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. పాతతరం నాయకుల పప్పులు ప్రస్తుత Gen-Z దగ్గర ఉడకవని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్లో రాశారు. అయితే సైన్యం ఒత్తిడితో ఈ వ్యాసాన్ని తొలగించటంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.

ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<

AP: తనకు మంచి పేరు వస్తుందనే రాయలసీమ ఎత్తిపోతలను అర్ధాంతరంగా ఆపేశారని జగన్ విమర్శించారు. ‘శ్రీశైలం నుంచి 800అడుగుల్లోనే AP 3TMCల నీళ్లు తీసుకునేలా ప్రాజెక్ట్ చేపట్టాం. రూ.వెయ్యి కోట్లు వెచ్చించి పనులు స్పీడప్ చేశాం. ప్రాజెక్ట్ పూర్తయితే నాకు మంచి పేరు వస్తుందని TGలో TDP కార్యకర్తలతో CBN కేసులు వేయించారు. అయినా పనులు కొనసాగించాం. ప్రభుత్వం మారగానే ఎత్తిపోతలకు చంద్రగ్రహణం పట్టింది’ అని మండిపడ్డారు.

AP: ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరకడం వల్లే నీళ్ల విషయంలో CBN నోరు మెదపడం లేదని జగన్ ఆరోపించారు. ‘శ్రీశైలంలో 800 అడుగులలోపే 2 TMCల నీళ్లు తీసుకునేందుకు TG పాలమూరు-RR నిర్మిస్తోంది. SLBCతో 45 TMCలు తరలించాలని చూస్తోంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల పవర్ హౌస్లు తెలంగాణే ఆపరేట్ చేస్తోంది. ఇష్టారీతిన నీళ్లు తరలిస్తోంది’ అని మండిపడ్డారు. CBN చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

అవకాడోలను సాధారణంగా విత్తనాల నుంచి ప్రవర్ధనం చేస్తారు. అయితే అధిక దిగుబడినిచ్చే మొక్కల నుంచి అంటుకట్టడం మరియు మొగ్గ తొడగడం అనే రెండు పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కల నుంచి అధిక దిగుబడులు వస్తాయి. విత్తనాలను నేరుగా మట్టిలో నాటవచ్చు లేదా రబ్బర్, ప్లాస్టిక్ సంచులలో నర్సరీ మిశ్రమంలో 2 నుంచి 3 గింజలను నాటాలి. తోటలలో నాటడానికి ముందు 2 నుంచి 3 నెలల వరకు గ్రీన్హౌస్లలో అవకాడో మొక్కలను పెంచడం మంచిది.
Sorry, no posts matched your criteria.