news

News September 8, 2025

వీసా రూల్స్ మార్చిన US.. భారతీయులకు మరిన్ని కష్టాలు!

image

అమెరికా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(NIV)ల కోసం స్వదేశంలోనే అప్లై చేసుకోవాలని స్పష్టం చేసింది. అంటే గతంలో మాదిరిగా థాయ్‌లాండ్, సింగపూర్ వంటి ఇతర దేశాల ఎంబసీల్లో ఇంటర్వ్యూకు హాజరవ్వలేరు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా ఎంబసీల్లోనే షెడ్యూలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో US వెళ్లాలనుకున్న, షార్ట్ టర్మ్ వీసాతో ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పవు.

News September 8, 2025

DRDO-CHESSలో 25 పోస్టులు

image

హైదరాబాద్‌లోని DRDOకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్(CHESS)లో 25 అప్రెంటిస్ పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా పాసై ఉండాలి. అభ్యర్థుల మార్కుల శాతం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఈ నెల 22 చివరి తేదీ. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9వేలు, టెక్నీషియన్అప్రెంటిస్‌లకు రూ.8వేలు స్టైఫండ్ ఇస్తారు. వెబ్‌సైట్: drdo.gov.in

News September 8, 2025

LIC హౌసింగ్‌లో 192 ఖాళీలు

image

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 192 అప్రెంటిస్ ఖాళీలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 20-25 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.12వేలు స్టైఫండ్ అందుతుంది.
వెబ్‌సైట్: <>www.lichousing.com<<>>

News September 8, 2025

భారత్‌పై అమెరికా టారిఫ్స్ సరైనవే: జెలె‌న్‌స్కీ

image

భారత్‌పై అమెరికా సుంకాలు విధించడం సరైనదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రష్యాతో డీల్ కొనసాగిస్తున్న దేశంపై టారిఫ్స్ విధించడం మంచి ఐడియానే’ అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ ముగింపునకు ఇతర దేశాలతో కలిసి కృషి చేస్తున్న భారత్‌పై జెలెన్‌స్కీ తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఆయనతో పలుమార్లు ఫోన్‌లో <<17582171>>మాట్లాడిన<<>> విషయం తెలిసిందే.

News September 8, 2025

ఫుడ్ డెలివరీ యాప్స్‌లో అధిక ధరలు.. నెట్టింట చర్చ!

image

రెస్టారెంట్‌ ధరలు, ఫుడ్ డెలివరీ యాప్ ధరలకు భారీ వ్యత్యాసం ఉండటంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ వ్యక్తి తన ఇంటికి దగ్గర్లోని రెస్టారెంట్ నుంచి స్విగ్గీలో ఆహారాన్ని బుక్ చేయాలనుకున్నాడు. అందులో రూ.1,473 ఛార్జ్ చేయడం చూసి అతడే స్వయంగా రెస్టారెంట్‌కు వెళ్లి రూ.810కే తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని Xలో లేవనెత్తడంతో తామూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నామని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. మీకూ ఇలానే జరిగిందా?

News September 8, 2025

మధ్యాహ్నం 2గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రకటించనున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

News September 8, 2025

అధికారిక మీటింగ్‌లో సీఎం భర్త.. మండిపడ్డ ఆప్

image

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనీశ్ గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని విమర్శించింది. అధికారిక మీటింగ్‌లో సీఎం పక్క ఛైర్‌లో ఆమె భర్త కూర్చున్న ఫొటోను Xలో షేర్ చేసింది. ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది.

News September 8, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,08,380కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.99,350 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 తగ్గి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 8, 2025

విశాఖలో మూగ బాలికపై అత్యాచారం!

image

AP: విశాఖలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై CP శంఖబ్రత బాగ్చీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే పూర్తి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. మద్యం మత్తులో యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

News September 8, 2025

జమ్మూకశ్మీర్‌లో భీకర కాల్పులు

image

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఇద్దరు పారా మిలిటరీ జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ, J&K పోలీసులు, శ్రీనగర్ CRPF దళం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.