news

News January 5, 2026

OTTలోకి ‘ధురంధర్’.. ఎప్పుడంటే?

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండియాలో రూ.800కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలొచ్చాయి.

News January 5, 2026

మహిళా ఆఫీసర్లకు మంత్రి వేధింపులు: BRS

image

TG: రాష్ట్ర మంత్రి ఒకరు మహిళా ఆఫీసర్లను వేధిస్తున్నారని BRS ఆరోపించింది. “ఎవరా అమాత్యుడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా అధికారులకు రక్షణ ఎక్కడ? ఒక మంత్రి స్థాయి వ్యక్తి మహిళా అధికారులను వేధింపులకు గురిచేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇదేనా మీరు గొప్పగా చెప్పుకునే ‘ఇందిరమ్మ రాజ్యం’? వెంటనే సదరు మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి” అని డిమాండ్ చేస్తూ ఓ <>వీడియోను<<>> Xలో షేర్ చేసింది.

News January 5, 2026

ఇంటర్వ్యూతో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL) 8 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. MSc (కెమిస్ట్రీ) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 7న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వయసు 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.70,000 చెల్లిస్తారు. మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com

News January 5, 2026

ఢిల్లీ అల్లర్లు.. అసలు అప్పుడు ఏం జరిగింది?

image

2020 ఫిబ్రవరిలో CAA చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు ఈశాన్య ఢిల్లీలో తీవ్ర హింసకు దారితీశాయి. ఐదు రోజుల పాటు సాగిన ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సమయంలో దేశ పరువు తీయడానికి పక్కా ప్లాన్‌తో చేసిన కుట్ర ఇదని పోలీసులు ఛార్జ్‌షీట్ వేశారు. దీని వెనుక ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ ఉన్నారని ఆరోపిస్తూ వారిపై UAPA కింద కేసు పెట్టారు.

News January 5, 2026

గార్డెన్‌లో మొక్కలకు చీడలు తగ్గాలంటే..

image

చలికాలంలో సరైన ఎండ లేకపోవడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలకు చీడలు ఎక్కువగా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే నాలుగు చెంచాల వంటసోడా, ఎక్కువ గాఢతలేని సోప్ పౌడర్ ఓ చెంచా తీసుకుని అయిదులీటర్ల నీటిలో వేసి కరిగించాలి. ఈ మిశ్రమాన్ని మొక్కలపై చల్లితే తిరిగి ఆరోగ్యంగా ఎదుగుతుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌ను నాలుగు లీటర్ల నీటిలో కలిపి చల్లితే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.

News January 5, 2026

ఆధారాల్లేవ్.. ఆ డివైజ్‌ కొనొద్దు: AIIMS డాక్టర్

image

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ధరించిన బ్రెయిన్ మ్యాపింగ్ డివైజ్‌ వల్ల ఎలాంటి యూజ్ ఉండదని AIIMS వైద్యుడు దత్తా అభిప్రాయపడ్డారు. బిలియనీర్లు డబ్బు వృథా చేసే ఇలాంటి ఖరీదైన బొమ్మలను కొనొద్దని సూచించారు. ఇది హార్ట్ ఎటాక్స్‌ను ముందే గుర్తిస్తుందని శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కేవలం ‘cfPWV’ మార్కర్ ద్వారానే గుండె సంబంధిత మరణాలను శాస్త్రీయంగా అంచనా వేయగలమని స్పష్టం చేశారు.

News January 5, 2026

పొద్దు తిరుగుడులో బోరాన్ లోపం – నివారణ

image

పొద్దుతిరుగుడు పంటకు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలను అందించాలి. పంట పూత దశలో బోరాన్ చాలా ముఖ్యం. ఇది లోపిస్తే మొక్కల లేత మరియు మధ్య ఆకులలో చివర్లు గుండ్రంగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. అందుకే ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 5, 2026

ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. హరీశ్‌కు ఊరట

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మాజీ DCP రాధాకిషన్ రావును విచారించేందుకు అనుమతివ్వాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. గతంలో హరీశ్, రాధాకిషన్‌పై FIR నమోదు కాగా హైకోర్టు దాన్ని క్వాష్ చేసింది. దీంతో ప్రభుత్వం SCని ఆశ్రయించింది. అయితే HC ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని SC తాజాగా స్పష్టం చేసింది.

News January 5, 2026

ఢిల్లీ అల్లర్ల కేసు.. ప్రధాన నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత!

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు SCలో చుక్కెదురైంది. నిందితులపై ఉన్న ఆరోపణలు నిజమని నమ్మడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. UAPA కింద రూల్స్ కఠినంగా ఉంటాయని, కేవలం ట్రయల్ లేట్ అవుతోందన్న కారణంతో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. మరో ఐదుగురిపై ఉన్న ఆరోపణల తీవ్రత తక్కువ ఉన్న దృష్ట్యా వారికి మాత్రం బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

News January 5, 2026

IT షేర్ల పతనం.. కారణమిదే!

image

IT కంపెనీల ఫలితాల సీజన్ మొదలవనున్న తరుణంలో ఆ రంగంలోని సంస్థల షేర్లు కుప్పకూలాయి. నేడు Nifty IT ఇండెక్స్ ఏకంగా 2.5% పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం థర్డ్ క్వార్టర్‌లో IT కంపెనీల గ్రోత్ చాలా తక్కువగా ఉంటుందన్న అంచనాలే దీనికి కారణం. అమెరికా, యూరప్ దేశాల్లో సెలవుల వల్ల బిజినెస్ తగ్గడం, కొత్త డీల్స్ రాకపోవడం IT సెక్టార్‌పై ఒత్తిడి పెంచుతోంది.