news

News April 22, 2025

కేసీఆర్, హరీశ్ రావులకు క్రాస్ ఎగ్జామినేషన్!

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వచ్చే వారం కేసీఆర్, హరీశ్ రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన సమయంలోనే ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2023లో ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు వచ్చాయి. ఈ కమిషన్ ఇప్పటికే ENCలు, మాజీ ENCలను ప్రశ్నించింది.

News April 22, 2025

‘డ్రాగన్’ కోసం 18 కిలోలు తగ్గిన ఎన్టీఆర్?

image

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తాను నటిస్తున్న ‘డ్రాగన్’ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా 18 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. 5 నెలల్లోనే ఆయన ఎలాంటి ఇంజెక్షన్లు వాడకుండా సహజ సిద్ధంగా బరువు తగ్గినట్లు సమాచారం. కఠినమైన వర్కౌట్లు, డైట్ కారణంగానే ఆయన లుక్‌లో మార్పులు వచ్చినట్లు టాక్. కాగా ఎన్టీఆర్ ఇవాళ ‘డ్రాగన్’ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

News April 22, 2025

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై RR స్పందన

image

IPLలో RR <<16176362>>ఫిక్సింగ్‌<<>>కు పాల్పడినట్లు RCA అడ్‌హక్ కమిటీ కన్వీనర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ జట్టు సీనియర్ అధికారి దీప్ రాయ్ స్పందించారు. ఈ ఆరోపణలను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇవి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన అసత్య, అర్థరహిత వ్యాఖ్యలన్నారు. దీనిపై రాజస్థాన్ CM, క్రీడా మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు RR, BCCI పట్ల ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తాయని చెప్పారు.

News April 22, 2025

జపాన్‌లో ‘జయజయహే తెలంగాణ’

image

TG: సీఎం రేవంత్ జపాన్‌లో బిజీబిజీగా ఉన్నారు. హీరోషిమా బాధితులకు నివాళులర్పించిన సందర్భంగా అక్కడ భారత్‌కు చెందిన హర్షిణి, హరిణి అనే విద్యార్థులు జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. వీరిద్దరూ కలిసి గీసిన సీఎం చిత్రపటాన్ని రేవంత్‌కు అందించారు. ఆ తర్వాత పరిశ్రమలు, టెక్నాలజీ, పర్యావరణం, విద్య, పర్యాటక రంగాల్లో సహకారంపై అక్కడి అధికారులతో ఆయన చర్చించారు.

News April 22, 2025

తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్ ఈ అమ్మాయే..

image

TG: UPSC సివిల్స్ ఫలితాల్లో వరంగల్ నగరానికి చెందిన ఈటబోయిన సాయి శివాని ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించారు. ఈమె తండ్రి రాజు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. ఈ సరస్వతీ పుత్రిక TGPSC గ్రూప్స్ పరీక్షల్లోనూ సత్తా చాటారు. ఈమె తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కింద అందజేసిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పొందారు. ఆ డబ్బుతోనే సివిల్స్ పరీక్షలకు ప్రిపేరై రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చారు.

News April 22, 2025

J&Kలో ఉగ్రదాడి.. ఇందుకేనా?

image

*కశ్మీర్ లోయలో పర్యాటక రంగాన్ని దెబ్బతీయడం
*ప్రధాని మోదీ సౌదీ పర్యటనలో, అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ భారత్ పర్యటనలో ఉన్నప్పుడు దాడి చేస్తే కశ్మీర్ అంశం అంతర్జాతీయంగా వార్తల్లోకి వస్తుందనే కుట్ర.
*పాకిస్థాన్‌లో అశాంతి, బలూచిస్థాన్ గొడవను పక్కదారి పట్టించేందుకు..
*ఉగ్రవాద నియామకాల్లో, చొరబాట్లలో జోరు పెంచడం..

News April 22, 2025

రాహుల్ గాంధీ ఆరోపణలకు ఈసీ వివరణ

image

మహారాష్ట్ర ఎన్నికల్లో ఆఖరి 2 గంటల్లో ఓట్ల సంఖ్య ఎక్కువ ఉందని, BJPకి ఈసీ సహకరించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు EC సమాధానమిచ్చింది. ‘మహారాష్ట్ర ఎన్నికల్లో 6.4 కోట్లమందికి గాను ఉ. 7 నుంచి సా. 6గంటల వరకు గంటకు సగటున 58లక్షలమంది ఓటేశారు. అంటే ఆఖరి రెండు గంటల్లో 116లక్షలమంది ఓట్లు వేసి ఉండాలి. కానీ 65 లక్షల ఓట్లే నమోదయ్యాయి. ఇది సగటుకంటే చాలా తక్కువ’ అని వివరించింది.

News April 22, 2025

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై?

image

AP: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై బీజేపీ హైకమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఇవాళ ఢిల్లీలో సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో అమిత్ షా దీనిపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటును అన్నామలైకు కేటాయించనున్నట్లు సమాచారం.

News April 22, 2025

ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

TG: ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన HYDలోని నాగోల్ PS పరిధిలో జరిగింది. BiPC చదువుతున్న అరుంధతి(17) ఇవాళ రిలీజైన ఫలితాల్లో బోటనీలో ఫెయిల్ అయింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కాసేపటికి కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పరీక్షలో ఫెయిల్ అయిన మనస్తాపంతోనే ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 22, 2025

ఉగ్రదాడిపై స్పందించిన మోదీ, షా, రాహుల్

image

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్య వెనుక ఉన్నవారిని వదిలిపెట్టేది లేదని మోదీ స్పష్టం చేయగా, ఉగ్రవాదులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని అమిత్ షా తేల్చిచెప్పారు. ఈ ఉగ్ర ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, మున్ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.