India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లక్నోలో LSGvsDC మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్లో డీసీ 2వ స్థానంలో, లక్నో ఐదో స్థానంలో ఉన్నాయి.
జట్లు:
DC: పోరెల్, నాయర్, కేఎల్, అక్షర్, స్టబ్స్, అశుతోశ్, విప్రాజ్, స్టార్క్, చమీర, ముకేశ్, కుల్దీప్
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, సమద్, మిల్లర్, దిగ్వేశ్, బిష్ణోయ్, అవేశ్, శార్దూల్, ప్రిన్స్
AP: ఉర్సా కస్టర్స్కు భూకేటాయింపులపై <<16177186>>ఆరోపణల<<>> నేపథ్యంలో TDP స్పందించింది. ఎకరం రూ.99 పైసలకే ఇచ్చేశారనేది ఫేక్ ప్రచారమని, కాపులుప్పాడలో ఎకరం రూ.50లక్షలు, మధురవాడలో రూ.కోటి చొప్పున ప్రభుత్వం కేటాయించినట్లు ట్వీట్ చేసింది. తమ హయాంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే జగన్ చేతకానితనం కన్పిస్తోందని చెప్పింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే YCP బురద జల్లుతోందని పేర్కొంది.
తన ‘లేడీ సూపర్స్టార్’ ట్యాగ్ను కొందరు హీరోయిన్లు తీసుకున్నారని నటి విజయశాంతి అన్నారు. వాళ్లు కూడా బతకాలి కదా అని తాను పట్టించుకోలేదని చెప్పారు. ‘హీరోలను మీరు అని సంబోధిస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం నువ్వు అని అంటారు. నాకు ఇది చాలా బాధ కలిగిస్తుంది. ఇకపై హీరోయిన్లను కూడా మీరు అనే పిలవండి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోయిన్లను మీరు అని పిలిచేవారు’ అని ఆమె గుర్తు చేశారు.
వారికి కొత్తగా పెళ్లైంది. వైవాహిక జీవితంపై ఎన్నో కలలు. హనీమూన్కి సరదాగా పహల్గాం(కశ్మీర్) వచ్చారు. అదే వారిని విడదీస్తుందని అప్పటికి వారికి తెలీదు. చేయీ చేయీ పట్టుకుని కబుర్లు చెప్పుకుంటుండగా ఉన్నట్టుండి ఉగ్రవాదులు దాడి చేశారు. భర్తను పాయింట్ బ్లాంక్లో కాల్చిచంపారు. కళ్లముందే కట్టుకున్నవాడిని కోల్పోయిన నవ వధువు నోట మాట రాక భర్త చెంతే కుప్పకూలి నిశ్చేష్టురాలైంది. ఆ ఫొటో గుండెల్ని మెలిపెడుతోంది.
* అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై డీపీఆర్ తయారీకి ADCL నిర్ణయం
* వచ్చే నెల 6 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
* మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి
* ఈ నెల 28న గుంటూరు మేయర్, కుప్పం, తుని, పాలకొండ మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు.. వేర్వేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ
* బోరుగడ్డ అనిల్పై అనంతపురంలో కేసు.. ఈ నెల 30కి విచారణ వాయిదా
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 2 గంటల్లో మెదక్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వాన పడుతుందని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాల్లో ఇవాళ రాత్రి వేడి, ఉక్కపోత నెలకొంటుందని తెలిపింది.
J&Kలో ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టూరిస్ట్ సీజన్ కావడం, జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న సమయంలో ఈ కుట్రకు పాల్పడ్డారు. పహల్గామ్ సమీపంలోని బైసరీన్ వ్యాలీలో పెద్దఎత్తున టూరిస్టులు ఉండగా అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేదు. గుర్రాలపైనే వెళ్లాల్సి ఉంటుంది. కేంద్రమంత్రి అమిత్ షా హుటాహుటిన అక్కడికి బయల్దేరారు.
అన్ని ఫార్మాట్లు ఆడే వారికే BCCI A+ కేటగిరీ కాంట్రాక్టు కట్టబెడుతుంది. కానీ గతేడాది కోహ్లీ, రోహిత్, జడేజాలు టీ20లకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వారు వన్డేలు, టెస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిపై క్రికెట్ అభిమానుల్లో సందేహం నెలకొంది. అయితే, వీరు అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు. దీంతో వీరికి A+ కేటగిరీ కాంట్రాక్టు లభించింది.
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న PM నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాలని అమిత్ షాను PM ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిలో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాలో ఆర్సీబీ ఫ్రాంచైజీ మరో మైలురాయి చేరుకుంది. అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ టీమ్కు 19 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత CSK (18.3M), MI(17M), KKR(7.3M), SRH (5.4M), RR(4.9M), GT (4.7M), DC (4.5M), PBKS(4M), LSG (3.6M) ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.