India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కరీంనగర్లో దారుణం వెలుగు చూసింది. జగిత్యాల జిల్లాకు చెందిన యువతి జ్వరమొచ్చిందని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు సమాచారం. ఆస్పత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్న వ్యక్తి ఆమె నిద్రపోతున్నప్పుడు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
AP: గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటిగ్రేటేడ్ టెర్మినల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 6 ఎయిరో బ్రిడ్జిలు, ILBHS(inline Bagage handling system), ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ప్రత్యేకంగా నిలవనున్నాయి. అరైవల్, డిపార్చర్ ప్యాసింజర్ల కోసం వేర్వేరుగా ఎయిరోబ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తున్నారు. ILBHS వల్ల లగేజ్ వెంటనే స్కాన్ చేసుకోవచ్చు. నూతన టెర్మినల్ పనులు 70% పూర్తి కాగా, సంక్రాంతి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది.
స్విగ్గీ, జొమాటో <<17604591>>ఇప్పటికే<<>> డెలివరీ ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేసేవారిపై మరింత భారం పడనుంది. జీఎస్టీ వల్ల జొమాటో కస్టమర్ల నుంచి ఆర్డరుకు రూ.2, స్విగ్గీ కొనుగోలుదార్ల నుంచి రూ.2.6 చొప్పున అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది.
నిన్న రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం <<17644262>>కనువిందు<<>> చేసింది. అయితే రెండు వారాల తర్వాత మరో గ్రహణం ఏర్పడనుంది. ఈనెల 21న(ఆదివారం) సూర్యగ్రహణం సంభవిస్తుంది. రాత్రి 11 గంటల నుంచి 22వ తేదీ తెల్లవారుజామున 3.23 గంటల వరకు ఇది కొనసాగుతుంది. కానీ దీని ప్రభావం మన దేశంలో అంతగా ఉండదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.
TG: రాష్ట్రంలో BC కాన్సెప్ట్తో 2 కొత్త పార్టీలు ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ నెల 17న పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని ప్రకటించి జెండా, ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి వీరిద్దరూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
AP: ఉపాధి హామీ శ్రామికుల వేతన బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,668కోట్లు విడుదల చేసింది. 4రోజుల్లోగా శ్రామికుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నిధులతో మే 15 – ఆగస్టు 15 వరకు చెల్లించాల్సిన బకాయిలు తీరిపోతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మిగిలిన చెల్లింపుల కోసం దాదాపు రూ.140 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. బకాయిల చెల్లించాలని కేంద్రానికి రాష్ట్ర అధికారులు లేఖలు రాయగా నిధులు విడుదల చేసింది.
సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అర్ధరాత్రి చంద్రగ్రహణం <<17644262>>సందర్భంగా<<>> చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారాడు. దీన్నే ‘బ్లడ్ మూన్’ అంటారు. భూమి అడ్డుకోగా మిగిలిన సూర్యకిరణాలు వాతావరణం గుండా ప్రసరించి చంద్రుడిని చేరుతాయి. సప్తవర్ణాల్లోని నీలిరంగు తేలిపోగా ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే చందమామపై పడతాయి. దీంతో చంద్రుడు ఎరుపెక్కుతాడు.
TG: ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కో ఇందిరమ్మ ఇంటికి PM ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.72వేలు ఇస్తోంది. ఇకపై ఉపాధి హామీ ద్వారా రూ.27వేలు చెల్లించనుంది. లబ్ధిదారుకు జాబ్ కార్డు ఉంటే ఇంటి పని కింద 90రోజులు పనిచేసినందుకు రోజుకు రూ.300 చెల్లించనుంది. స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మరో రూ.12వేలు ఇవ్వనుంది. మొత్తం రూ.5 లక్షల్లో కేంద్రం రూ.1.11లక్షలు మంజూరు చేస్తుండగా మిగతా రూ.3.89లక్షలు రాష్ట్రం భరించనుంది.
ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. TGలో కిలోకు రూ.5-16 మాత్రమే దక్కుతోంది. వినియోగదారులకు మాత్రం రూ.25-45 మధ్య లభిస్తోంది. ఫలితంగా మధ్యవర్తులే లాభపడుతున్నారు. APలో క్వింటా కనిష్ఠంగా రూ.501, గరిష్ఠంగా రూ.1,249 పలుకుతోంది. రైతుకు కేజీకి రూ.5-12 మధ్యే దక్కుతోంది. కొన్ని మార్కెట్లలో ఉల్లి నిల్వలు పేరుకుపోయి కొనుగోళ్లూ నిలిచిపోయాయి. ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) 9 MMTPA గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ&పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(ToR) ప్రిపరేషన్కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. నెల్లూరు(D) చేవూరులో ₹1.03లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పబ్లిక్ హియరింగ్ నిర్వహించి, ఇతర వివరాలతో నివేదిక సమర్పించాలని BPCLకు నిపుణుల అంచనా కమిటీ సూచించింది.
Sorry, no posts matched your criteria.