news

News January 23, 2026

నిన్న విజయసాయి రెడ్డి.. మిథున్ రెడ్డి

image

AP: మద్యం కుంభకోణం కేసులో ED విచారణకు YCP MP మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ED కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని.. మిథున్ రెడ్డి కోరిక మేరకు ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశానని నిన్న విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.

News January 23, 2026

న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం!

image

T20 WCకు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ ఆడమ్ మిల్నే టోర్నీకి దూరమయ్యారు. SA20లో ఆడుతుండగా ఎడమ తొడ కండరాలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్థానంలో కైల్ జేమీసన్‌ను NZ రీప్లేస్ చేసింది. ఓరూర్కీ, టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సీర్స్ ఇప్పటికే గాయపడ్డారు. ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ పెటర్నిటీ లీవ్స్‌ కారణంగా WCలో కొన్ని మ్యాచులకు దూరమయ్యే అవకాశముంది.

News January 23, 2026

మరణం లేని యోధుడు నేతాజీ!

image

మాటలతో కాకుండా పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని నమ్మిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అంటూ దేశాన్ని కదిలించారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’తో బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటుచేశారు. 1945 ఆగస్టు 18న బోస్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. ఇవాళ నేతాజీ జయంతి.

News January 23, 2026

నారా లోకేశ్‌కు Jr.NTR బర్త్‌డే విషెస్

image

AP: మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది లోకేశ్‌కు అద్భుతంగా సాగాలని హీరో Jr.NTR ఆకాంక్షించారు. ఆయనకు మరింత శక్తి, సుఖసంతోషాలు కలగాలని Dy.CM పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నేత అంటూ హోంమంత్రి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు ప్రముఖులు లోకేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.

News January 23, 2026

147పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్<>(SAMEER<<>>)లో 147 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 25) ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://sameer.gov.in/

News January 23, 2026

పూజ చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్

image

పూజ భక్తి మాత్రమే కాదు. గొప్ప మానసిక ప్రక్రియ కూడా. పూజలో వాడే గంటల శబ్దం మెదడులోని రెండు భాగాలను ఏకం చేసి ఏకాగ్రతను పెంచుతుంది. దీపపు కాంతి కంటి చూపును మెరుగుపరుస్తుంది. కర్పూరం, ధూపం గాలిలోని సూక్ష్మక్రిములను సంహరించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. మంత్రోచ్ఛారణ తరంగాలు రక్తపోటును తగ్గిస్తాయి. మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. పంచేంద్రియాలను ఉత్తేజపరిచి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

News January 23, 2026

రాహుల్, థరూర్ మధ్య ముదిరిన విభేదాలు?

image

రాహుల్ గాంధీపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొచ్చిలో జరిగిన సమావేశంలో వేదికపై తన పేరును రాహుల్ కావాలనే ప్రస్తావించలేదని థరూర్ నొచ్చుకున్నట్లు సమాచారం. దీంతో కేరళ ఎన్నికల సన్నద్ధతపై నేడు నిర్వహించనున్న కీలక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో PM మోదీని పొగిడారనే కారణంతో పార్టీ నాయకత్వం థరూర్‌ను పక్కన పెడుతోందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

News January 23, 2026

వంటింటి చిట్కాలు

image

* పూరీలు తెల్లగా ఉండాలంటే వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికల పిండిలో పాలు పోస్తే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.

News January 23, 2026

859 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తులు

image

TG: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి(24వ తేదీ) నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr.అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్ తదితర పోస్టులకు ఏడో తరగతి-డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. 18-46 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tshc.gov.in

News January 23, 2026

దక్షిణ కోస్తా రైల్వే జోన్ చుట్టూ వివాదం!

image

AP: విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ బౌండరీస్ చుట్టూ వివాదం రాజుకుంటోంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం, జూరిడిక్షన్ అంశం చర్చనీయాంశమైంది. వాల్తేర్ డివిజన్ ఆదాయానికి కీలకమైన కొత్తవలస-కిరండల్ లైన్‌ను ఒడిశా పరిధికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. దీంతో స్వయం సమృద్ధి కలిగిన రైల్వే జోన్ కావాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.