news

News April 22, 2025

పెళ్లి రోజే ఆడబిడ్డకు జన్మనిచ్చిన బ్యాడ్మింటన్ స్టార్

image

బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి రోజునే పాప పుట్టడం చాలా ఆనందంగా ఉందని జ్వాల-విశాల్ సోషల్ మీడియాలో అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమిళ నటుడు విష్ణు విశాల్‌తో జ్వాలకు 2021 ఏప్రిల్ 22న వివాహం జరిగింది. మొదటి భార్య రజినీ నాయర్‌తో ఆయనకు ఇప్పటికే ఓ కొడుకు (ఆర్యన్) ఉన్నాడు. కాగా విశాల్-రజినీ 2010లో పెళ్లి చేసుకుని 2018లో విడిపోయారు.

News April 22, 2025

ఎమినిటీస్‌కు రూ.4 లక్షలు.. పూర్తయ్యాయా?

image

TG: హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనే సమయంలో ఎమినిటీస్ పేరుతో రూ.3 నుంచి రూ.4లక్షలు వసూలు చేస్తుంటారు. దీంట్లో చిల్డ్రన్స్ పార్క్‌తో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని బిల్డర్లు కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుంటారు. అయితే, చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేయట్లేదని ఆరోపణలున్నాయి. వీటిని అమలు చేయాట్లేదని, డబ్బులూ తిరిగివ్వడం లేదని GHMC అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవట్లేదని ప్రజలు వాపోతున్నారు. మీ కామెంట్?

News April 22, 2025

రేపే టెన్త్ ఫలితాలు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైంది. రేపు ఉ.10 గంటలకు రిజల్ట్స్‌ను విద్యాశాఖ ప్రకటించనుంది. MAR 17 నుంచి APR 1 వరకు జరిగిన పరీక్షలకు 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. Way2News యాప్ ద్వారా వేగంగా, సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్క్స్ లిస్ట్ వస్తుంది. దాన్ని ఈజీగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
విద్యార్థులందరికీ Best Of Luck

News April 22, 2025

Inter రిజల్ట్స్: ఎంత మంది పాసయ్యారంటే?

image

TG: ఇంటర్ పరీక్షల్లో ఫస్టియర్‌ రెగ్యులర్‌లో 66.89%, వొకేషనల్‌లో 57.68% మంది పాసైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సెకండ్ ఇయర్ రెగ్యులర్ 71.37%, వొకేషనల్‌లో 67.44% విద్యార్థులు పాసయ్యారని చెప్పారు. మొదటి సంవత్సరంలో బాలికల్లో 73.83, బాలురులో 57.83 శాతం పాసవ్వగా, ద్వితీయ సంవత్సరంలో బాలికల్లో 74.21, బాలురులో 57.31 శాతం మంది పాసయ్యారని వెల్లడించారు.

News April 22, 2025

గంట వ్యవధిలోనే మళ్లీ పెరిగిన బంగారం ధర!

image

లైవ్ మార్కెట్‌లో బంగారం ధరలు నిమిష-నిమిషానికి మారుతూ ఆల్ టైమ్ రికార్డును చేరుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్షకు చేరగా గంట తేడాలోనే మరోసారి భారీగా పెరిగింది. ఇవాళ ఏకంగా రూ.3వేలు పెరిగి రూ.1,01,350కు చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 పెరిగి రూ.92,900కు చేరింది.

News April 22, 2025

RESULTS: ఆ గ్రూప్ విద్యార్థులకు షాక్

image

TG: ఇంటర్ ఫలితాల్లో HEC, CEC గ్రూప్ విద్యార్థులు నిరాశపరిచారు. ఫస్టియర్ HECలో 8959 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 3092 మందే (34.51%) పాసయ్యారు. CECలో 92745 మంది హాజరైతే 42259 మంది (45.56%) ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్ HECలో 9031 మంది రాస్తే 4178 మంది (46.26%), CECలో 103713 మంది హాజరైతే 48658 మంది (46.92%) పాస్ అయ్యారు.

News April 22, 2025

రాహుల్ లెటర్‌పై స్పందించిన రేవంత్

image

TG: రాష్ట్రంలో వేముల రోహిత్ యాక్ట్ తీసుకురావాలన్న కాంగ్రెస్ అగ్రనేత<<16168187>> రాహుల్ గాంధీ<<>> విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హిరోషిమాలో రాహుల్ లేఖను చదివినట్లు పేర్కొన్నారు. చట్టం తీసుకురావాలని కోరడం స్ఫూర్తిదాయకమైన పిలుపు అన్నారు. ఆయన ఆలోచనలు, భావాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

News April 22, 2025

తప్పడం తప్పు కాదు.. తొందరపడొద్దు..!

image

ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. పాసైనవాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఫెయిలయ్యామని, మార్కులు తక్కువొచ్చాయని కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు భావించకండి. ఇప్పుడు తప్పితే.. సప్లీ అనే సెకండ్ ఆప్షన్ ఉంది. కానీ, తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. మీరే ప్రాణంగా బతికే మీ వాళ్ల జీవితకాలపు కన్నీళ్లకు కారకులవుతారు. తప్పడం తప్పు కాదని గ్రహించి.. సప్లీలో పాసై కాలర్ ఎగరేయండి. All The Best

News April 22, 2025

ఆరోగ్యం కోసం ఈ 5 మొక్కలు ఇంట్లో నాటండి!

image

కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ 5 మొక్కలు మీ ఇంట్లో గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
*కలబంద- స్కిన్ హెల్త్, జుట్టు పెరుగుదల.
*తులసి- ఇమ్యూనిటీ బూస్టర్, దగ్గు, జలుబును తగ్గిస్తుంది.
*తిప్పతీగ- ఇమ్యూనిటీ బూస్టర్, బాడీని డీటాక్సిఫై చేస్తుంది.
*అశ్వగంధ- ఇమ్యూనిటీ బూస్టర్, ఒత్తిడి తగ్గిస్తుంది.
*స్నేక్ ప్లాంట్- నైట్ ఆక్సిజన్ విడుదల చేస్తుంది.

News April 22, 2025

మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

image

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీతో పాటు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా పక్కా ప్రణాళికతో ఎక్కడా పొరపాట్లు జరగకుండా వ్యాల్యుయేషన్ జరిగిందని బోర్డు పేర్కొంది.