India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇవాళ రూ.లక్ష <<16177121>>మార్క్<<>> దాటిన విషయం తెలిసిందే. అయితే ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కరెక్షన్ జరిగినా 10%కు మించి తగ్గకపోవచ్చంటున్నారు. ఆర్థిక మాంద్యం, గ్లోబల్ ఎకానమీలో ఒడుదొడుకుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ను సేఫ్ ఆప్షన్గా భావిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ధరలు భారీగా పెరిగే అవకాశముంది.
TG: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వచ్చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో రిజల్ట్స్ స్క్రీన్లో ఫలితాలు పొందవచ్చు. అందులో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం గం.12కు రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటికే షెడ్యూల్ అయిన కార్యక్రమాల వల్ల ఆయన ఇంకా ఇంటర్ బోర్డుకు చేరుకోలేదు. కాసేపట్లో భట్టి వస్తారని తెలుస్తోంది.
Stay Tuned..
AP: అరెస్టుల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. తాజాగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులును అరెస్టు చేసింది. గత ప్రభుత్వంలో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆంజనేయులుపై పలు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు మద్యం కేసులో రాజ్ కసిరెడ్డిని సిట్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు రీఓపెన్ చేశారు.
పిల్లల పెళ్లి విషయంలో సమయాన్ని, డబ్బును ఆదా చేసేందుకు ఇద్దరు అన్నదమ్ములు వినూత్నంగా ఆలోచించారు. తమకున్న ఆరుగురు పిల్లలకు ఒకేసారి పెళ్లి చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ ఘటన హరియాణాలోని హిసార్ జిల్లా గవాద్ గ్రామంలో జరిగింది. ఇద్దరు కుమారులది ఈనెల 18న, నలుగురు కుమార్తెల వివాహం 19న చేశారు. సామాన్యులంతా ఇలాగే చేసి సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఆ ఊరి వారంటున్నారు.
గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ పెయిర్ గిల్-సాయి సుదర్శన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మెగా టోర్నీలో 6సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన భారత జోడీగా నిలిచింది. వీరిద్దరూ సీజన్లోనే రెండుసార్లు సెంచరీ పార్ట్నర్షిప్స్ అందించారు. అంతకుముందు రాహుల్-మయాంక్, గంభీర్-ఉతప్ప 5సార్లు సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేశారు. ఓవరాల్గా కోహ్లీ-డివిలియర్స్(10) అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ఉంది.
సూపర్ స్టార్ మహేశ్బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారన్న విషయం తెలిసిందే. దీంతోపాటు మహిళలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ కూడా అందిస్తోందీ ఫౌండేషన్. ఇవాళ సెకండ్ ఫేజ్ వ్యాక్సినేషన్ పూర్తయినట్లు MB ఫౌండేషన్ ట్వీట్ చేసింది. యువతులకు HPV వ్యాక్సిన్ను అందించినట్లు తెలిపింది. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్లను నిరోధించగలదు.
మావోయిస్టులే లక్ష్యంగా ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టపై భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులు, CRPF బలగాలు సంయుక్తంగా గుట్టను చుట్టుముట్టి కాల్పులతో చొచ్చుకెళ్తున్నాయి. అక్కడ భారీగా మావోలు ఉంటారనే సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. కాగా కర్రెగుట్ట చుట్టూ బాంబులు పెట్టామని, ఎవరూ రావొద్దని ఇటీవలే మావోలు ప్రకటించారు. తాజా ఘటనతో ఏం జరుగుతుందోనని స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
AP: ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూకేటాయింపుల ప్రక్రియను <<16177186>>కేశినేని నాని<<>> తప్పుబట్టడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వేలకోట్లు ఎగ్గొట్టిన వారు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఏ పరిశ్రమలు తీసుకురావాలో బాగా తెలుసని, నాని ఉపన్యాసాలు వినే తీరిక ఆయనకు లేదన్నారు. ఉనికి కోసమే ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు.
భారత స్మార్ట్ టీవీ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) చెక్ పెట్టింది. ఆపరేటింగ్ సిస్టమ్(OS), ప్లే స్టోర్(PS) తదితర యాప్లను డీఫాల్ట్గా ఇన్స్టాల్ చేయొద్దని ఆదేశించింది. దీంతో సెటిల్మెంట్లో భాగంగా రూ.20.24 కోట్లు చెల్లించేందుకు గూగుల్ అంగీకరించింది. ఇకపై టీవీల్లో ఇతర OS, PSలూ ఉండే అవకాశాలున్నాయి. మీరు కొనుగోలు చేసే టీవీలో ఏవి ఇన్స్టాల్ చేశారో చెక్ చేసుకోండి.
Sorry, no posts matched your criteria.