news

News April 22, 2025

3 రోజులు భగభగ.. బయటకు వెళ్లొద్దు!

image

TG: నేటి నుంచి మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ 45 డిగ్రీలను టచ్ చేస్తుందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో 42-44 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 41-42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావొచ్చని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని సూచించారు.

News April 22, 2025

జూన్ 14న గద్దర్ అవార్డుల ప్రదానం: దిల్ రాజు

image

TG: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని TGFDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. HICC వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగుతో పాటు ఉర్దూ చిత్రాలను ఎంకరేజ్ చేస్తామన్నారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటలతో గద్దర్ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.

News April 22, 2025

కాసేపట్లో ఫలితాలు..

image

TG: విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపట్లో విడుదల కాబోతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ.12 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే Way2Newsలో చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే బాక్సులో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్డ్ మార్క్స్ లిస్ట్ వస్తుంది. దాన్ని ఈజీగా మీ స్నేహితులకు షేర్ చేయవచ్చు.

News April 22, 2025

లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్: VSR

image

AP: లిక్కర్ స్కామ్‌లో తాను ఒక్క రూపాయీ ముట్టలేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్(సమాచారాన్ని బహిర్గతం చేసే వ్యక్తి). దొరికిన దొంగలు, దొరకని దొంగలు తప్పించుకునేందుకే నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’ అని తెలిపారు.

News April 22, 2025

హిందీ ఇంపోజిషన్‌: ఫడణవీస్ వ్యాఖ్యలపై స్టాలిన్ సెటైర్లు

image

హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ ఇంపోజిషన్‌పై తీవ్ర వ్యతిరేకతను చూసి మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ భయపడ్డారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఎద్దేవా చేశారు. అందుకే మహారాష్ట్రలో కేవలం మరాఠీ తప్పనిసరంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయనకు అధికారికంగా చెప్పిందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే మూడో భాషా బోధన తప్పనిసరి కాదంటూ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.

News April 22, 2025

ఒక్కరోజే రూ.2,750 పెరిగిన తులం బంగారం

image

బంగారం ధరలు సరికొత్త మైలురాయి చేరాయి. హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ₹1649 పెరిగి ₹1,00,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి కూడా 10గ్రాములకు ₹2,750 పెరిగి తొలిసారి ₹92,900కు చేరింది. అటు KG వెండి ₹1,11,000గా ఉంది. విజయవాడ, విశాఖ సహా రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరల ధగధగకు ప్రధాన కారణాలు.

News April 22, 2025

అది చిన్ని బినామీ కంపెనీ: కేశినేని నాని

image

AP: విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎకరాలు కేటాయించడాన్ని విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినాని నాని తప్పుబట్టారు. అది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బినామీ కంపెనీ అని ఆరోపించారు. రూ.5,728 కోట్ల ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే అనుభవం, క్రెడిబిలిటీ ఆ సంస్థకు లేదన్నారు. వెంటనే భూ కేటాయింపులు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబును కోరారు.

News April 22, 2025

విషాదం.. వడదెబ్బతో 9 మంది మృతి

image

TG: రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరి కొన్ని చోట్ల ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వడదెబ్బతో 9 మంది మరణించారు. ఖమ్మం, KNR, నాగర్ కర్నూల్‌లో ముగ్గురు, ఉమ్మడి ADLBలో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 22, 2025

‘రాజాసాబ్’ టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ Xలో ట్రెండవుతోంది. ఈ చిత్ర టీజర్ మేలో రాబోతున్నట్లు సినీవర్గాలు పేర్కొనడంతో అభిమానులు దీనిపై ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ సినిమాలో ఇంతవరకూ చూడని విజువల్స్, VFXను టీజర్‌లో చూపించారని వార్తలొస్తున్నాయి. అయితే, టీజర్ కట్, సీజీ పనులు పూర్తయ్యాయని, ప్రభాస్ డబ్బింగ్ చెప్పడమే మిగిలి ఉందని సమాచారం.

News April 22, 2025

నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌కు పాక్ అథ్లెట్!

image

ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెలలో బెంగళూరులో JSW స్పోర్ట్స్ ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేయబోతోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ జావెలిన్ క్రీడాకారులను ఆహ్వానిస్తున్నారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ని కూడా ఆహ్వానించినట్లు నీరజ్ తెలిపారు. కోచ్‌తో మాట్లాడి కన్ఫార్మ్ చేస్తానని ఆయన చెప్పారని పేర్కొన్నారు.