India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

WBలో 2 నిఫా కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. దీనిపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో WHO స్పందించింది. ఇండియాలోని నిఫా కేసుల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని స్పష్టం చేసింది. బాధితులతో కాంటాక్ట్లోకి వచ్చిన 196 మందినీ గుర్తించి ఐసోలేట్ చేసినట్లు తెలిపింది. ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఇప్పుడు SMలో ట్రోల్స్కు గురవుతోంది. ఆస్ట్రేలియా ‘B’ టీమ్పై గెలిస్తేనే ప్రపంచకప్ గెలిచినంతగా PCB ఛైర్మన్ను ఆకాశానికెత్తడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక WC గెలిస్తే ఏం చేస్తారో అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇది అతిగా ఉందన్నారు.

మధ్యాహ్నం పూట చిన్న నిద్ర (Nap) వల్ల రాత్రి నిద్రతో సమానమైన ఎఫెక్ట్ ఉంటుందని రీసెర్చర్స్ తేల్చారు. వాళ్ల స్టడీ ప్రకారం.. రోజంతా పనులు, ఆలోచనల వల్ల బ్రెయిన్లోని నెర్వ్ సెల్స్ బాగా అలసిపోతాయి. ఇలాంటి టైమ్లో ఒక చిన్న కునుకు తీస్తే బ్రెయిన్ కనెక్షన్స్ మళ్లీ రీ-ఆర్గనైజ్ అవుతాయి. బ్రెయిన్పై లోడ్ తగ్గి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఇన్ఫర్మేషన్ మరింత ఎఫెక్టివ్గా స్టోర్ అవుతుంది.

రైలులో వెళ్లే సమయాన్ని చదివేందుకు కేటాయించి BARC శాస్త్రవేత్తగా ఎదిగిన వేలుమణి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కోయంబత్తూర్ రామకృష్ణ మిషన్ విద్యాలయంలో చదువుకోగా పేదరికంతో హాస్టల్లో ఉండలేక రోజూ రైలులో ప్రయాణించేవారు. ఈ జర్నీలో రోజుకు 6 గంటల ఖాళీ టైమ్ దొరికేది. ఈ సమయంలో గణితం, ఫిజిక్స్ చదువుకున్నానని వేలుమణి ట్వీట్ చేశారు. ఆయన స్థాపించిన థైరోకేర్ టెక్నాలజీస్ నెట్వర్త్ రూ.5వేల కోట్లు.

<

మహిళలను ఎక్కువగా వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వీటిని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. పాలలో పసుపు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసినట్లైతే రోమాలన్నీ తొలగిపోతాయి. ఒక అరటిపండు గుజ్జు, రెండు స్పూన్ల ఓట్ మీల్ కలిపి ముఖానికి పట్టించాలి, కాసేపు మర్దనా చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఫేస్కు పసుపు రాసి కడుక్కుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.

AP: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అబద్ధపు ఆరోపణలు చేశారంటూ YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు అబద్ధమని 2 ల్యాబ్ రిపోర్టులు తేల్చాయని చెప్పారు. ‘భక్తుల మనోభావాలను దెబ్బతీసిన పాపం చంద్రబాబుదే. తప్పు చేశామని ఒప్పుకునే విచక్షణ ఆయనకు లేదు. ఆరోపణలకు ఆధారాలు లేక వైసీపీపై దాడి చేస్తున్నారు. చంద్రబాబును ప్రజాక్షేత్రంలో నిలదీయాలి’ అని మీడియా సమావేశంలో అన్నారు.

AP: HYD కన్నా మెరుగైన సిటీగా అమరావతిని అభివృద్ధి చేస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘HYDలో సైబరాబాద్ నిర్మించా. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నా. 182KM ORRతో గుంటూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంతాలతో మహా నగరంగా ఇది మారుతుంది. మరో 15ఏళ్లలో డిఫరెంట్ ప్లేస్ అవుతుంది’ అని వివరించారు. ఒకప్పుడు కరెంటు కష్టాలుండేవని రిఫార్మ్స్తో అవి తీరాయన్నారు. ఇప్పుడు ప్రొజ్యూమర్ కాన్సెప్ట్ తెస్తున్నామని చెప్పారు.

ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక T20I మ్యాచ్లు(160) ఆడిన ప్లేయర్గా నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(159 M) రికార్డును బ్రేక్ చేశారు. 3, 4, 5 స్థానాల్లో జార్జ్ డాక్రెల్(ఐర్లాండ్-153 M), మహ్మద్ నబీ(అఫ్ఘాన్-148 M), జోస్ బట్లర్(ఇంగ్లండ్-144 M) ఉన్నారు. కాగా స్టిర్లింగ్ T20Iలలో 3,874 రన్స్, 20 వికెట్లు తీశారు.

కంద దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, తక్కువ కాలపరిమితి కలిగిన నువ్వు, మినుము, చిరుధాన్యాలు మొదలైన పంటలను అంతర పంటలుగా ఆయా ప్రాంతాలకు, కాలానికి తగిన విధంగా ఎంపిక చేసి సాగు చేసుకోవచ్చు. అలాగే పసుపులో మిశ్రమ పంటగా కందను వేసుకోవచ్చు. అరటి, కొబ్బరిలో అంతర పంటగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. పసుపులో కూడా కందను అంతర పంటగా వేసి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.