India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతి ఏటా ఏప్రిల్ 22న ఇంటర్నేషనల్ ఎర్త్ డే నిర్వహిస్తారు. 1970లో ఇదే రోజున USAలో దాదాపు 2 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పర్యావరణానికి జరుగుతున్న హానిపై నిరసన తెలిపారు. అప్పటి నుంచి ఎర్త్ డేను నిర్వహిస్తున్నారు. ‘భూమి మానవుడిది మాత్రమే కాదు. సకల జీవరాశులకు నిలయమని గుర్తుంచుకుందాం. అభివృద్ధి పేరుతో కాంక్రీట్ జంగిల్స్లా మార్చేసి జంతువుల గూడును చెరపొద్దు’ అని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు.
98వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలను 2026లో మార్చి 15న నిర్వహించనున్నట్లు అకాడమీ తెలిపింది. ఎలిజిబిలిటీ గైడ్లైన్స్, నామినేషన్స్, ఓటింగ్లో నిబంధనలు సవరించినట్లు పేర్కొంది. ఇక నుంచి ఓట్ వేయాలంటే నామినేట్ అయిన సినిమాను అకాడమీ సభ్యులు కచ్చితంగా వీక్షించాలి. ఫైనల్ బ్యాలెట్లో నామినీలందరినీ చూపిస్తారు. AIని వాడిన మూవీస్నూ అనుమతించనున్నారు. అయితే హ్యూమన్ క్రియేటివిటీకే ప్రాధాన్యమిస్తామని తెలిపారు.
TG: భూసమస్యలు పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే నెలలోనే 10,954 మంది గ్రామ పాలనా అధికారుల(GPO)ను నియమిస్తామని వెల్లడించారు. మరో 6వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లనూ నియమిస్తామని ప్రకటించారు. దీంతో మొత్తం 16,954 పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుంది. గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభుత్వం GPOగా పేరు పెట్టిన విషయం తెలిసిందే.
AP: కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఈ వారంలో సమావేశమై తుది నివేదికను సిద్ధం చేయనుంది. దాన్ని పరిశీలించిన అనంతరం జులైలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని కేటగిరీలకు కలిపి దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. అలాగే దాదాపు 90వేల మందికి స్పౌజ్ పింఛన్లను జూన్ 1 నుంచి అందించనున్నట్లు సమాచారం.
AP: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు IPS ఆఫీసర్ సీతారామాంజనేయులు (PSR ఆంజనేయులు)ను అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీతారామాంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. కూటమి ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్లో పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో వ్యాపారవేత్త విద్యాసాగర్ అరెస్టైన సంగతి తెలిసిందే.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
అమెరికాలో జననాల రేటు భారీగా తగ్గుతోంది. దీంతో పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ ఐడియాస్ సేకరిస్తున్నారట. వాటిలో తొలి బిడ్డను కంటే బేబీ బోనస్గా 5 వేల డాలర్లు, రెండో బిడ్డను కంటే ట్యాక్స్ క్రెడిట్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. బర్త్ కంట్రోల్ అవసరం లేకుండానే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది.
TG: కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పనిదినాలకు తగ్గించింది. గత ఏడాది రాష్ట్రానికి 8 కోట్ల వర్క్ డేస్ కేటాయించగా ఈ సారి 6.5 కోట్లకే పరిమితం చేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం కోసం రూ.2,708.3 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో రూ.1,625 కోట్లు వేతనాలు, రూ.1,083 కోట్లు మెటీరియల్ కోసం కేటాయించనున్నారు. కాగా పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని కాసేపట్లో సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. నిన్న ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటు నుంచి విజయవాడకు తరలించిన అధికారులు తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కుంభకోణంలో కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశముంది.
పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు వాటికన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్ట్లో పేర్కొన్నారు. చనిపోయేముందు ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. కాగా శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలో పూడ్చాలని, ఇన్స్క్రిప్షన్పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ఆయన ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.