India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బిగ్బాస్ సీజన్-9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీ కోటాలో తనూజ(ముద్ద మందారం), నటి ఆశా సైనీ, కమెడియన్లు సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రఫర్ శ్రష్ఠి వర్మ, సీరియల్ నటుడు భరణి శంకర్, రీతూ చౌదరీ, నటి సంజనా గల్రానీ, ఫోక్ డాన్సర్ రాము రాథోడ్, సామాన్యుల నుంచి సోల్జర్ పవన్, మాస్క్ మ్యాన్ హరీశ్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీశ్ లోనికి వెళ్లారు.
నిర్మాత అల్లు అరవింద్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు(76) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం నాగరాజు అంత్యక్రియలు HYDలో జరిగాయి. అంతకుముందు దర్శకుడు రవిరాజా పినిశెట్టి, బన్నీ వాసు, బండ్ల గణేశ్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు. కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే.
చంద్ర గ్రహణం తర్వాత ఉదయం లేచాక ఇంటిని శుభ్రం చేయాలని, వస్తువులపై పవిత్ర నది జలాలను చల్లి శుద్ధి చేయాలని పండితులు చెబుతున్నారు. రాత్రి మిగిలిన ఆహారాన్ని పడవేయడంతో పాటు తల స్నానం చేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు పేదలకు దుస్తులు, ఆహారం, పాలు, బియ్యం, చక్కెర వంటివి దానం చేస్తే మేలని చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి 2.25గంటల తర్వాత వీడనుంది.
AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. అపెక్స్, ఎక్స్పర్ట్ కమిటీల విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని డీప్టెక్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ ఏఐ కంప్యూటింగ్, డిఫెన్స్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని చూస్తోంది.
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో SA ఘోర పరాజయం పాలైంది. 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ బ్యాటర్లు 72 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టు బ్యాటర్లలో టాప్ స్కోరర్ బాష్(20) అంటేనే వాళ్ల ఆట ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్చర్ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా టాపార్డర్ను పడగొట్టారు. దీంతో 342 పరుగుల తేడాతో SA ఓడింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడా ఓటమి ఇదే కావడం గమనార్హం.
AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
కవయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని కాళోజీ పురస్కారం వరించింది. ఈ మేరకు అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ ఆమెను ఎంపిక చేసింది. ఈనెల 9న కాళోజీ జయంతి రోజున ఆమెకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికైనందుకు రమాదేవికి సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
TG: రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీసీ యునైటెడ్ ఫ్రంట్(BCUF) పేరుతో MLC తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడమే దీని లక్ష్యమని తెలుస్తోంది. ఈ నెల 17న విధివిధానాలు ప్రకటించి, జెండా ఆవిష్కరణ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సంపూర్ణ చంద్రగ్రహణం ప్రక్రియ ప్రారంభమైంది. వెలుగులు ప్రసరిస్తూ ప్రకాశవంతంగా మెరిసిపోతున్న చందమామను మెల్లగా చీకటి కమ్మేస్తోంది. 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మొత్తం 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే దేశ ప్రజలు ధగధగా మెరుస్తున్న చంద్రుడిని చూస్తూ పులకరిస్తున్నారు. మరి మీరు చందమామను చూశారా?
AP: విజయవాడ, విశాఖ మెట్రో టెండర్ల గడువు పొడిగించినట్లు AP మెట్రో రైల్ కార్పొరేషన్ MD రామకృష్ణారెడ్డి తెలిపారు. VJA మెట్రో టెండర్ల గడువు అక్టోబరు 14, విశాఖకు సంబంధించి అక్టోబరు 7వరకు పొడిగించామన్నారు. టెండర్ల ప్రీబిడ్ సమావేశంలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వినతులు రాగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖ మెట్రో ఫేజ్-1 కింద 46.23KM, VJA మెట్రో ఫేజ్-1లో 38KM నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.