news

News April 7, 2024

బెదరగొట్టేలా ముంబై లైనప్.. కానీ..!

image

ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్‌లో ఢిల్లీతో ముంబై తలపడుతోంది. సూర్యకుమార్ సహా రోహిత్, ఇషాన్, తిలక్, పాండ్య, డేవిడ్, నబీ, షెపర్డ్‌తో కూడిన ముంబై బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. అయితే, ఇలాంటి లైనప్‌తోనే ముంబై పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉండటం గమనార్హం. క్రికెట్‌ను టీమ్ గేమ్ అనేది ఇందుకేనని, స్టార్లు ఎంతమంది ఉన్నా కలసికట్టుగా ఆడితేనే గెలుపు సాధ్యమని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

News April 7, 2024

డబ్బుల కోసం పవన్ డాన్సులు: అంబటి

image

డబ్బుల కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డాన్సులు వేస్తున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘చంద్రబాబు ఓ పొలిటికల్ డాన్సర్. అన్ని పార్టీలతోనూ ఆయన స్టెప్పులు వేస్తారు. డబ్బుల కోసం పవన్ కూడా డాన్స్ వేస్తున్నారు. చంద్రబాబును నేను విమర్శించాను తప్ప తిట్టలేదు. తిట్టినవారంతా ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. కేవలం బాబు అసమర్థత వల్లే పోలవరం పూర్తికాలేదు’ అని వ్యాఖ్యలు చేశారు.

News April 7, 2024

తల్లయిన హీరోయిన్ ఆర్తి చబ్రియా

image

హీరోయిన్ ఆర్తి చబ్రియా 41 ఏళ్ల వయసులో తల్లి అయ్యారు. గత నెల 4న బాబుకు జన్మనిచ్చినట్లు ఆమె తెలిపారు. బాబుకు యువాన్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. గతంలో తాను ప్రెగ్నెన్సీని కోల్పోయానని, అందుకే ఈసారి బాబు పుట్టే వరకు ఈ విషయాన్ని వెల్లడించలేదని పేర్కొన్నారు. ఆమె 2019లో చార్టెడ్ అకౌంటెంట్ విశారద్‌ను పెళ్లాడారు. ఆర్తి తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి వంటి సినిమాల్లో నటించారు.

News April 7, 2024

ఆప్ నేతల సామూహిక నిరాహార దీక్షలు

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ నేతలు ఇవాళ జంతర్‌మంతర్ వేదికగా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. అమెరికాలోని హార్వర్డ్ స్క్వేర్, హాలీవుడ్ సైన్, భారత రాయబార కార్యాలయం, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, లండన్, మెల్‌బోర్న్‌లోనూ తమ మద్దతుదారులు దీక్షలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దీక్షలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి.

News April 7, 2024

సుశాంత్ సింగ్ ఇంటిని నేను కొనలేదు: ఆదా శర్మ

image

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని తాను కొనుగోలు చేసినట్లు వస్తోన్న వార్తలను హీరోయిన్ ఆదా శర్మ ఖండించారు. ‘నేను ఆయన ఇంటిని కొనలేదు. కేవలం చూడటానికే అక్కడికి వెళ్లాను. సుశాంత్ గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్రస్తుతం నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా. అందుకు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

News April 7, 2024

సుజనా చరిత్రను బయటపెడతా: కేశినేని నాని

image

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చరిత్రను బయటపెడతానని కేశినేని నాని హెచ్చరించారు. ‘సుజనా పదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్నా విజయవాడ కోసం రూపాయైనా ఖర్చుపెట్టారా? ఏ అర్హత ఉందని పోటీ చేస్తున్నారు? అతడి చరిత్రను బయటపెడతా. నా సవాలును స్వీకరించేందుకు సుజనా సిద్ధమా?’ అని ప్రశ్నించారు. కాగా.. విజయవాడకు నాని ఏం చేశారంటూ కేశినేని చిన్ని విమర్శించారు. తాను బయటపెట్టిన నాని చరిత్రపై ఆయన జవాబివ్వాలని డిమాండ్ చేశారు.

News April 7, 2024

వివాదంలో మంత్రి పొంగులేటి కుమారుడు!

image

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఖరీదైన ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్‌ వాచ్‌లను ఆయన స్మగ్లర్ ముబిన్ ద్వారా తెప్పించినట్లు సమాచారం. ఒక్కో వాచ్ విలువ ₹1.75 కోట్లు ఉంటుందట. అతడిని చెన్నై కస్టమ్స్ అధికారులు ప్రశ్నించడంతో హర్షారెడ్డి పేరు బయటికి వచ్చింది. దీంతో APR 4న విచారణకు రావాలని ఆదేశించగా, తాను 27వ తేదీన హాజరవుతానని రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది.

News April 7, 2024

BIG BREAKING: సీఎం జగన్‌కు ఈసీ నోటీసులు

image

AP: సీఎం జగన్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ చేసిన ఫిర్యాదుతో 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్‌కు సీఈవో మీనా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 3న పూతలపట్టు సిద్ధం సభలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

News April 7, 2024

టాస్ గెలిచిన ఢిల్లీ.. టీమ్‌లోకి కొత్త ప్లేయర్లు

image

ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ ప్లేయర్లు రిచర్డ్‌సన్, కుమార్ కుషాగ్రా ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశారు.
MI: రోహిత్, కిషన్, సూర్య, తిలక్, హార్దిక్, డేవిడ్, నబీ, షెపర్డ్, చావ్లా, కోయెట్జీ, బుమ్రా
DC: వార్నర్, పృథ్వీ, అభిషేక్, పంత్, స్టబ్స్, అక్షర్, లలిత్ యాదవ్, రిచర్డ్‌సన్, నార్ట్జే, ఇషాంత్, ఖలీల్

News April 7, 2024

మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం: లోకేశ్

image

AP: పాత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ చెప్పారు. బైక్ మెకానిక్‌లు, కార్మికులతో మాట్లాడుతూ.. ‘జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులే. పనుల్లేక వందల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మేం అధికారంలోకి రాగానే మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. బైక్ మెకానిక్‌లకు అధునాతన వాహనాలపై శిక్షణ ఇప్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.