India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆస్ట్రేలియాకు చెందిన ఆస్టిన్ అపెల్బీ అనే 13 ఏళ్ల బాలుడు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించాడు. సముద్రంలో 4 గంటలు ఈదాడు. పెడల్ బోటింగ్ చేస్తూ సముద్రంలో చిక్కుకున్న తల్లి, తోబుట్టువులను రక్షించేందుకు 4KM ఈది ఒడ్డుకు చేరుకొని అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో 14KM దూరంలో కొట్టుకుపోయిన వారందరినీ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించింది. లైఫ్ జాకెట్లు ధరించడంతో వారు సురక్షితంగా ఉండగలిగారు.

<

FEB 7న మొదలుకానున్న T20 WCలో దాదాపు 35+ భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. USA సారథి మోనాంక్ పటేల్, కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా, ఒమన్ సారథి జతీందర్ సింగ్లతో పాటు USA పేసర్ సౌరభ్ వంటి ప్లేయర్స్ విదేశీ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు భారత్-అమెరికా జట్ల మధ్య పోరును నెటిజన్లు ‘పాస్పోర్ట్ VS గ్రీన్ కార్డ్’ మ్యాచ్ అని సరదాగా జోకులు పేలుస్తున్నారు.

కర్ణాటలోని బాగల్కోట(D)లో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె జుట్టు పొడుగ్గా ఉందని, అందంగా పూలతో అలంకరించుకుంటూ యువకులను వలలో వేసుకుంటోందని అతను భావించాడు. రాత్రి ఫుల్లుగా తాగి భార్యను కత్తితో బెదిరించి గుండు చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2020-24 మధ్య ఐదేళ్లలో 44,140మంది బాధితులు మరణించారని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది HIV బాధితులు మరణించారని వెల్లడించారు. ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం దీనికి కారణమని తెలుస్తోంది.

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లో రాముడి పాత్ర తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని మహేశ్ బాబు అన్నారు. ‘దేవుడి పాత్రలో గాంభీర్యం కోసం మోడ్రన్ బాడీ లాంగ్వేజ్ను మర్చిపోవాల్సి వచ్చింది. దీనికోసం 3నెలల పాటు ‘కలరిపయట్టు’లో శిక్షణ తీసుకున్నాను. నిలబడే తీరు, నడక మార్చుకోవడానికీ ఇది హెల్ప్ అయ్యింది. రన్నింగ్ స్టైల్ ఛేంజ్ చేయడానికీ ప్రాక్టీస్ చేశాను’ అని Varietyకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ తెలిపారు.

చర్మసౌందర్యాన్ని పెంచుకోవడానికి చాలామంది నల్ల పసుపును వాడుతుంటారు. నల్ల పసుపును మెత్తగా నూరి తేనె కలిపి కూడా చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. వారానికొకసారి ఇలా చేస్తే చర్మంపై ఉండే మచ్చలు పోవడంతో పాటు ముఖం నిగారిస్తుంది. ఎందుకంటే నల్ల పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ చర్మాన్ని మెరిపించడంలో సాయపడతాయి. అలాగే ఈ నల్ల పసుపును ఆహారంలో భాగంగా తీసుకున్నా సరే.. మంచి ఫలితాలు ఉంటాయి.

U19 ప్రపంచకప్లో అజేయంగా దూసుకెళ్తున్న ఆయుష్ మాత్రే సేన సెమీఫైనల్ సమరానికి సిద్ధమైంది. ఈరోజు జరిగే కీలక పోరులో భారత్, అఫ్గాన్ను ఢీకొంటుంది. బ్యాటర్లు అభిజ్ఞాన్, సూర్యవంశీ, విహాన్లు మంచి ఫామ్లో ఉన్నారు. హెనిల్, అంబ్రిష్ల బౌలింగ్ దళం జట్టుకు ప్రధాన బలం. పాక్పై గెలుపుతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఎల్లుండి ఇంగ్లండ్తో ఫైనల్ ఆడుతుంది.

భారత్, చైనాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయికి చేరినట్లు ఆ దేశ దౌత్యవేత్త ఫియాంగ్ వెల్లడించారు. 2025లో $155 బిలియన్ల విలువైన ట్రేడ్ జరిగిందన్నారు. 2024తో పోల్చితే ఇది 12% అధికమన్నారు. పొరుగు దేశాల మధ్య ఆర్థిక సహకారం మెరుగుపడటానికి ఇదొక సంకేతమని చెప్పారు. ‘బ్రిక్స్లో IND నేతృత్వానికి మద్దతు ఇస్తాం. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో ఆయన BJP అభ్యర్థుల విజయానికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నట్లు జనసేన వర్గాలు స్పష్టం చేశాయి.
Sorry, no posts matched your criteria.