India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సీరియల్, సినిమా నటి జయవాహిని (పద్మక్క) కన్నుమూశారు. కొంతకాలంగా రొమ్ము <<18545877>>క్యాన్సర్తో<<>> బాధపడుతున్న ఆమె నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. ఆమెను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నం చేశామని తెలిపారు. రఘుపతి వెంకయ్య నాయుడు, బహిర్భూమి, పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాలతో పాటు పలు సీరియళ్లలో ఆమె నటించారు.

T20 వరల్డ్ కప్లో ఈ ఏడాది యువ క్రికెటర్లతో పాటు సీనియర్లూ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. 2009 T20 WCలో ఆడిన పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్), అదిల్ రషీద్(ఇంగ్లండ్), వాన్డెర్ మెర్వ్ (సౌతాఫ్రికా-2009, నెదర్లాండ్స్-2026) తాజా ఎడిషన్లోనూ ఆడబోతున్నారు. కాగా 2009లో టీమ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇప్పుడు ఎవరూ టీమ్లో లేరు. కానీ అప్పుడు ప్లేయర్గా ఆడిన గంభీర్ ఇప్పుడు హెడ్ కోచ్గా ఉన్నారు.

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్ రేటు రూ.20,000 తగ్గి రూ.3 లక్షలకు చేరింది. ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు నిన్న పెరిగిన విషయం తెలిసిందే. ఒక్కరోజులోనే మళ్లీ రేట్లు పతనమయ్యాయి.

ఆహారపు అలవాట్లు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. దంపతులు ఒకే ప్లేట్లో భోజనం చేయకూడదు. దీనివల్ల కుటుంబంలోని ఇతర సభ్యుల పట్ల వివక్ష, అసూయ పెరిగే ఛాన్సుందని పండితులు చెబుతున్నారు. మంచం మీద కూర్చుని తింటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందట. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం. నేలపై కూర్చుని తింటే సుఖసంతోషాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ సుమారు 250 పాయింట్లు తగ్గి 83,571కు చేరగా, నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 25,689 వద్ద ట్రేడ్ అయ్యింది. గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పాటు టెక్ షేర్ల నష్టాలు మార్కెట్పై ప్రభావం చూపాయి. రియల్టీ, ఫార్మా షేర్లు నష్టాల్లో ఉండగా, ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్ షేర్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.

స్టేటస్ అప్డేట్స్కు సంబంధించి వాట్సాప్లో ‘custom lists’ ఫీచర్ త్వరలో రానుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలా వేర్వేరు లిస్టులు క్రియేట్ చేసుకొని, వాటిలో మీకు కావాల్సిన లిస్టుకు స్టేటస్ షేర్ చేయవచ్చు. ప్రస్తుతం ‘మై కాంటాక్ట్స్, ఆల్ కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్, ఓన్లీ షేర్ విత్’ ఆప్షన్లు ఉండగా, స్టేటస్ పెట్టే టైమ్లో సెట్టింగ్స్ తరచుగా మార్చాల్సి వస్తోంది. ఈ కొత్త ఫీచర్ వస్తే ఇక ఆ ఇబ్బంది ఉండదు.

శారీరక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన వేధింపులకు అనుమతి ఇచ్చినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో నిందితుడి బెయిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో సంబంధం కొనసాగిందన్న వాదనను తోసిపుచ్చింది. అంగీకారం ఉన్నా లైంగిక దాడులు నేరమేనని తెలిపింది. ఏకాంత వీడియోలు తీసి బలవంతం చేయడం ఏకాభిప్రాయం కిందకు రాదని తేల్చి చెప్పింది.

బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో ఫ్యూయల్ స్విచ్ సమస్యలు లేవని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. లండన్ నుంచి భారత్కు వచ్చిన ఓ ఫ్లైట్లో స్విచ్ లోపం ఉందని వస్తున్న వార్తలపై బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వివరణ కోరింది. దీనిపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. కాగా ఈ నెల 2న పైలట్ ఫ్యూయల్ స్విచ్ సరిగా లాక్ కాకపోవడంతో విమానాన్ని బెంగళూరులో నిలిపివేశారు. తనిఖీలు చేయగా లోపాలేవీ లేవని ఎయిర్ ఇండియా తెలిపింది.

ముఖంపై పిగ్మెంటేషన్ను తగ్గించడానికి చాలామంది విటమిన్ E క్యాప్య్సూల్స్ వాడుతుంటారు. అయితే వీటిని నేరుగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వీటిని ముఖంపై డైరెక్ట్గా వాడితే అలర్జీ, ర్యాషెస్ రావొచ్చంటున్నారు. ఈ క్యాప్య్సూల్స్ నోటి ద్వారా తీసుకోవడానికి ఉద్దేశించినవని చెబుతున్నారు. కచ్చితంగా వీటిని వాడాలనుకుంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.