news

News April 22, 2025

పోలీసు కస్టడీకి గోరంట్ల మాధవ్

image

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రెండ్రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు 5 రోజులు కోరగా.. కోర్టు రెండ్రోజులు అనుమతించింది. గోరంట్లను ఈ నెల 23, 24 తేదీల్లో పోలీసులు విచారించనున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై గోరంట్ల దాడికి యత్నించారని కేసు నమోదైంది. ప్రస్తుతం గోరంట్ల రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News April 22, 2025

MI ఆటగాళ్లలో స్ఫూర్తినింపిన పొలార్డ్!

image

నిన్న రాత్రి CSKపై మ్యాచ్‌కు ముందు MI ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేలా స్పీచ్ ఇచ్చినట్లు పొలార్డ్ తెలిపారు. ‘ఆటగాళ్లతో మాట్లాడేందుకు మహేల నాకు ఛాన్స్ ఇచ్చారు. గడచిన రెండేళ్లుగా చెన్నై ఆటగాళ్లకు ‘బాగా ఆడారు’ అని చెప్పడమే సరిపోయింది. ఈసారి అలా ఉండకూడదు అని అన్నాను. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడి విజయాన్ని అందించారు’ అని చెప్పుకొచ్చారు. స్పిన్నర్లను ఆడేందుకే సూర్యను 3వ స్థానంలో పంపించినట్లు ఆయన వివరించారు.

News April 22, 2025

DSC.. ప్రభుత్వం కీలక ప్రకటన

image

AP: డీఎస్సీ-2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటిపేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు. ఒక అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

News April 22, 2025

48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

image

TG: రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.81వేల కోట్లు వెచ్చించినా ఏమీ సాధించలేదని దుయ్యబట్టారు.

News April 22, 2025

అద్భుతం.. 10Gbps వేగంతో డౌన్‌లోడ్

image

చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటగా 10Gbps వేగంతో పనిచేసే 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. బీజింగ్ సమీపంలోని హెబీ ప్రావిన్స్‌లో టెస్టు చేయగా 9834 Mbps గరిష్ఠ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. ఈ వేగంతో రెండు ఫుల్ 4k క్వాలిటీ సినిమాలను ఒక్క సెకన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ రంగాలకు ఇది ఎంతో మేలు చేయనుంది.

News April 21, 2025

ఆ చైనా యాప్ తీసేయండి.. గూగుల్‌కు భారత్ సూచన

image

చైనాకు చెందిన వీడియో చాటింగ్ యాప్ ‘యాబ్లో’(Ablo)ను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్‌కు భారత ప్రభుత్వం సూచించింది. అందులో భారత భూభాగాల్ని తప్పుగా చూపించడమే దీనికి కారణం. జమ్మూకశ్మీర్, లద్దాక్‌ను భారత భూభాగాలుగా చూపించని ఆ యాప్, లక్షద్వీప్‌ను మొత్తానికే మ్యాప్‌ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే భారత సార్వభౌమత్వాన్ని గౌరవించని ఆ యాప్‌ను తొలగించాలని గూగుల్‌కు భారత్ తేల్చిచెప్పింది.

News April 21, 2025

బాబా సిద్దిఖీ కుమారుడిని చంపేస్తామని వార్నింగ్

image

గతేడాది ముంబైలో హత్యకు గురైన బాబా సిద్దిఖీ కుమారుడు, NCP నేత (అజిత్ పవార్ వర్గం) జీషన్ సిద్దిఖీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. ‘నిన్నూ మీ నాన్న లాగే చంపేస్తాం. రూ.10కోట్లు ఇవ్వు. ప్రతి 6 గంటలకు ఓసారి ఇలాంటి మెయిల్ పంపుతూనే ఉంటాం’ అని వార్నింగ్ ఇచ్చారని ముంబై పోలీసులు వెల్లడించారు. కాగా సిద్ధిఖీని గతేడాది అక్టోబర్ 12న కాల్చి చంపారు. దీనికి తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.

News April 21, 2025

పురుషులు ఈ పదార్థాలు తింటే..

image

పురుషులు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే అది వారి సంతాన సాఫల్యతపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తింటే శుక్రకణాల నాణ్యత తగ్గుతుందని తెలిపారు. రోజూ విపరీతంగా మద్యం సేవిస్తే వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న క్రీమ్, చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

News April 21, 2025

ఏఐ రాకతో ఉద్యోగాలు గల్లంతే: ఒబామా, బిల్ గేట్స్

image

ఏఐ వినియోగంతో భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోతామని USమాజీ అధ్యక్షుడు ఒబామా, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఏఐతో లభించే మెడికల్ , టీచింగ్ సలహాలు అందరికీ నచ్చుతాయని, కానీ ఉద్యోగాల పరిస్థితేంటని బిల్ గేట్స్ ప్రశ్నించారు. సాప్ట్‌వేర్ డెవలపర్స్ చేసే 70శాతం పనులను ఏఐ చేయగలదని, దీని వాడకం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతేనని, 100 ఏళ్లలో చూడని పరిస్థితి రావచ్చని ఒబామా అభిప్రాయపడ్డారు.

News April 21, 2025

నీరవ్ మోదీ బ్యాంకింగ్ స్కామ్‌పై మూవీ!

image

వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ జీవితాన్ని సినిమాగా తీయబోతున్నారని తెలుస్తోంది. విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కుతుందని ‘పింక్‌విల్లా’ వెల్లడించింది. ‘గుల్లాక్’ సిరీస్ ఫేమ్ డైరెక్టర్ పలాష్ వాస్వానీ దర్శకత్వం వహిస్తారట. వజ్రాల వ్యాపారిగా ఎదగడం, స్కామ్, జైలు వరకు అన్నీ విషయాలు ఈ మూవీలో ఉంటాయని చెబుతున్నారు. 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.