India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో నిరుద్యోగం ఎంతలా పెరిగిపోయిందో ఈ ఒక్క ఘటనను చూస్తే అర్థమవుతుంది. రాజస్థాన్లో 53,749 ప్యూన్ పోస్టులకు ఏకంగా 24.76 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క ఉద్యోగానికి 46 మంది పోటీ పడుతున్నారు. దీనికి అప్లై చేసిన వారిలో PhD, MBA, LLB చేసినవాళ్లు, సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న వారు కూడా ఉన్నారు. అర్హత కంటే తక్కువ స్థాయి ఉద్యోగమైనా వస్తే చాలనే స్థితిలో నిరుద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎస్కే స్టార్ ప్లేయర్ కాన్వే తండ్రి డెంటాన్ మరణించినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తాజాగా ట్వీట్ చేసింది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి మద్దతుగా ఉంటామని పేర్కొంది. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. కాన్వే తండ్రి మృతికి సంతాపంగా నిన్నటి మ్యాచులో సీఎస్కే ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ధరించారు. కాన్వే ఏప్రిల్ 11న సీఎస్కే తరఫున చివరి మ్యాచ్ ఆడారు.
ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గిల్(90), సాయి సుదర్శన్(52) అర్ధ సెంచరీలతో రాణించారు. కోల్కతా బౌలర్లలో వైభవ్, రసెల్, హర్షిత్కు తలో వికెట్ దక్కింది. KKR విజయలక్ష్యం 199 పరుగులు.
ఏపీలో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యంలోని 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి రూరల్లో 42.1 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, విజయనగరంలో 41.5 డిగ్రీలు, నెల్లూరు దగదర్తిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. ఎల్లుండి కూడా 12 మండలాల్లో తీవ్ర, 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వచ్చే పదేళ్లపాటు ఏడాదికి 80 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ తెలిపారు. కొలంబో ఇండియా సమ్మిట్ 2025లో ఆయన ప్రసంగించారు. తయారీ రంగంలో GDPమరింత పెంచేలా ఉత్పాదకత సాధించాలని, దేశంలోని SMEలను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా అభివృద్ధి ప్రక్రియ ఉండాలన్నారు.
AP: మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం వద్దకు 3.20 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 1.2 కి.మీ పొడవున రోడ్డు షో నిర్వహిస్తారు. 3.35 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. 3.45 గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సా.5 గంటలకు ప్రధాని తిరిగి ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు.
గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఈ సీజన్లోనూ మంచి ఫామ్ను కొనసాగిస్తున్నారు. KKRతో జరుగుతున్న మ్యాచుతో అర్ధసెంచరీ చేసిన ఆయన IPL 2025లో 400కి పైగా పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 8 మ్యాచుల్లో వరుసగా 74, 63, 49, 5, 82, 56, 36, 52 పరుగులు చేశారు.
పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాతి పోప్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు..
* లూయిస్ టగ్లే(ఫిలిప్పీన్స్)
* పియెట్రో పారోలిన్(ఇటలీ)
* జీన్-మార్క్ అవెలీన్(ఫ్రాన్స్)
* విలెమ్ ఐజ్క్(నెదర్లాండ్స్)
* మాల్కమ్ రంజిత్(శ్రీలంక)
AP: గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచే హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 25 నుంచి NETFLIXలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుందని నెట్ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Sorry, no posts matched your criteria.