India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆచమనం అంటే తినేముందు నీటిని సేవించడం. ఇది మనస్సును, శరీరాన్ని పవిత్రం చేస్తుంది. ఎడమచేతితో ఉద్ధరణెతో నీటిని తీసుకోవాలి. కుడిచేతి అరచేతిని ‘గోకర్ణాకృతి’లో ఉంచి చప్పుడు కాకుండా జలాన్ని స్వీకరించాలి. ఈ సమయంలో జలం మీసాలకు, గడ్డానికి తగలకూడదు. కేశవ, నారాయణ, మాధవ నామాలతో చేసే ఈ ప్రక్రియ చేయాలి. తద్వారా పంచేంద్రియాలు శుద్ధి చెందుతాయి. ఆచమనంతో ఏకాగ్రత, సాత్విక శక్తి పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, BJP నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, BRS నుంచి కేటీఆర్, హరీశ్ రావు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు కావడంతో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. మొత్తం 2,982 వార్డులకు 11న పోలింగ్ జరగనుండగా 13 కౌంటింగ్ నిర్వహించనున్నారు.

పూజా ద్రవ్యాలను గౌరవించాలి. అందులో ఉపయోగించే గంట, శంఖం, తమలపాకులతో పాటు ఏ వస్తువులనూ నేరుగా నేలపై ఉంచకూడదు. వీటిని పీఠంపై లేదా ఓ పళ్లెంలో ఉంచాలి. అలాగే, భగవంతునికి సమర్పించే పువ్వుల రెక్కలను విడదీసి పూజించడం నిషిద్ధం. పువ్వును వికసించిన రూపంలోనే అర్పించాలి. పూజా సమయంలో శక్తివంచన ఉండకూడదు. ఎడమ చేతిని అస్సలు ఉపయోగించకూడదు. కేవలం కుడిచేతితోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలి.

క్యారెట్ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్-A కంటిచూపును, విటమిన్-C రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చి, విటమిన్-K ఎముకలను ధృడంగా చేస్తుంది. వీటిని పచ్చిగా, ఉడికించి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

మార్చి 31(మహావీర్ జయంతి)న బ్యాంకుల సెలవు రద్దు చేస్తూ RBI ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం హాలీడే ఉన్నా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆ రోజున పనివేళలు కొనసాగించాలని తెలిపింది. 2025-26 FYలోపే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పరిగణనలోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సాధారణ కార్యకలపాలపై కస్టమర్లు బ్రాంచ్ను ధ్రువీకరించుకోవడం ఉత్తమం.

నైజీరియాలోని కానోలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 30 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ దేశంలో రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలు అమలు చేయడంలో వైఫల్యం వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్’ మూవీ నుంచి నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా నుంచి ఆయన వైదొలిగినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు దీపికా పదుకొణే తప్పుకోగా ఆమె స్థానంలో హీరోయిన్గా తృప్తి దిమ్రిని తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది.

TG: అసంపూర్తిగా ఉన్న బెడ్ రూం ఇళ్లను పూర్తి చేసి అర్హత కలిగిన వారికి ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. KNRలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున ఇచ్చామని తెలిపారు. దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అటు ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

♦︎ 1966: బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ జననం ♦︎ 1969: బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు ♦︎ 1975: సినీ నటుడు సుమంత్ జననం (ఫొటోలో) ♦︎ 2008: సంఘ సేవకుడు, పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత మురళీధర్ దేవదాస్ ఆమ్టే మరణం ♦︎ 2012: సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మరణం.

T20WCలో ఇంగ్లండ్తో మ్యాచులో దాదాపు గెలిచినంత పనిచేసిన <<19085895>>నేపాల్<<>>పై మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైతే తన సేవలు నేపాల్కు అందించేందుకు సిద్ధమని సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ ట్వీట్ చేశారు. మరోవైపు చివరి బంతివరకు పోరాడిన నేపాల్ పట్ల మరింత గౌరవం పెరిగిందని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ Xలో రాసుకొచ్చారు. ప్రపంచమంతా నేపాల్ ఎదుగుదలను గమనిస్తోందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.