news

News February 11, 2026

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉంటే పిల్లలు పుట్టరా?

image

ప్రస్తుతకాలంలో చిన్నవయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ చికిత్స వల్ల అండాశయాలు బలహీనమై పిల్లలు పుట్టడం కష్టమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్‌ చేయాలని సూచిస్తున్నారు. అండాశయ బాహ్యపొరలో ఉండే అపరిపక్వ అండాలను తీసి ఫ్రీజ్‌ అండ్‌ ప్రిజర్వ్‌ చేస్తారు. తర్వాత తిరిగి బాడీలో ఇంప్లాంట్ చేస్తే గర్భం దాల్చే అవకాశముంటుంది.

News February 11, 2026

సూపర్ ఓవర్: సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

image

టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య సూపర్ ఓవర్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన AFG సూపర్ ఓవర్‌లో 17 రన్స్ చేసింది. సౌతాఫ్రికా టార్గెట్ 18 పరుగులు.

సూపర్ ఓవర్‌లో రన్స్ ఇలా.. 4, 6, 1, 1, 4, 1

News February 11, 2026

1pm వరకు 48.54% పోలింగ్

image

TG: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 51.66%, కార్పొరేషన్లలో 40.96% ఓటింగ్ నమోదైంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవమని, నల్గొండ, కరీంనగర్‌లో జరిగినవి చిన్న గొడవలే అని తెలిపారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందన్నారు.

News February 11, 2026

మరో కేసులో అంబటి రాంబాబుకు బెయిల్

image

AP: వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ రాగా, తాజాగా మెడికల్ కాలేజీల PPP విధానంపై ఆందోళనల కేసులో బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.

News February 11, 2026

ఆయిల్ పామ్: నత్రజని లోపం ఇలా గుర్తించండి

image

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.

News February 11, 2026

హంసలదీవి వేణుగోపాలస్వామి క్షేత్రం

image

కృష్ణాజిల్లా హంసలదీవిలోని వేణుగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనది. పుట్టలో ఉన్న స్వామికి ఆవులు పాలు కార్చడం చూసి, గోపాలురు నిప్పు పెట్టగా స్వామి విగ్రహం భిన్నమైందని జనశృతి. ఆ విగ్రహం పక్కనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి, సాగర సంగమంలో స్నానమాచరిస్తే సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఆలయం 1977 ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి వేలాది మందిని కాపాడింది.

News February 11, 2026

పట్నా ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

బిహార్ పట్నాలోని <>ESIC <<>>మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌ 16 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో MD/MS/DNB అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 27న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. బేసిక్ పే రూ.67,700. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 11, 2026

వైసీపీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: పవన్

image

AP: వైసీపీ కుట్రలపై మూడు పార్టీలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభాపక్షం భేటీ అయింది. వైసీపీ విధ్వంస కుట్రలపై సభలో చర్చించాలని పవన్ పేర్కొన్నారు. ఆ పార్టీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

News February 11, 2026

AIతో సెకన్లలో బ్రెయిన్ MRI రిపోర్ట్.. 97.5% కచ్చితత్వంతో!

image

మెదడు వ్యాధులను గుర్తించడంలో AI సంచలనం సృష్టిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తలు Prima అనే AI మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇది బ్రెయిన్ MRI స్కాన్‌లను సెకన్లలోనే విశ్లేషించి 97.5% కచ్చితత్వంతో ఫలితాలిస్తుంది. సుమారు 2.2లక్షల స్కాన్‌లతో ట్రైన్ అయిన ఈ మోడల్.. బ్రెయిన్ ట్యూమర్స్, స్ట్రోక్స్ వంటి 50కి పైగా సమస్యలను గుర్తించగలదు. వైద్య నిపుణులు లేని ప్రాంతాల్లో ఇది ప్రయోజనకరంగా మారనుంది.

News February 11, 2026

శాస్త్ర రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు

image

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం అందించడం కోసం ఓ రోజు ఉండాలని యునెస్కో నిర్ణయించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్‌&టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.