India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండడం మంచిది. అది వీలుకాకపోతే దేవుడిపై మనసు లగ్నం చేస్తూ మితంగా ఆహారం తీసుకోవచ్చు. వాయుపురాణం ప్రకారం.. పెసరపప్పు-బియ్యం కలిపి వండిన పదార్థాన్ని ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. సహజ ఫలాలు, నువ్వులు-బెల్లం ఉండలు, పంచామృతం, తులసినీరు వంటివి కూడా స్వీకరించవచ్చు. అయితే, ఏ ఆహారాన్నైనా ఒకసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. మాటిమాటికి వద్దు’ అని పండితులు సూచిస్తున్నారు.

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.

మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఇన్నర్ గాడెస్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది అనన్య పరేఖ్. చెన్నైకు చెందిన అనన్య ఇంజనీరింగ్ తర్వాత మహిళల హక్కులు, సాధికారతపై దృష్టి పెట్టింది. వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు వర్క్షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ ఎందరికో దారి చూపుతున్నారు.

AP: గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ‘సాస్కి’ పథకం ద్వారా సమకూర్చిన రూ.2 వేల కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘రహదారుల నాణ్యతలో రాజీపడొద్దు. అధికార యంత్రాంగానిదే బాధ్యత. ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నారో లేదో తనిఖీ చేయాలి. నేను, నిపుణులు క్షేత్రస్థాయిలో క్వాలిటీ చెక్ చేస్తాం’ అని చెప్పారు. రోడ్ల విషయంలో గత ప్రభుత్వం అలక్ష్యంతో వ్యవహరించిందని ఆరోపించారు.

ఇంజినీరింగ్ పూర్తైన, చివరి సంవత్సరం చదువుతున్నవారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)లో చేరేందుకు ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ మార్కుల మెరిట్తో ఎంపిక చేస్తారు. ఏడాది శిక్షణలో రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత మొదటి నెల నుంచే రూ.లక్ష వరకు శాలరీ ఉంటుంది. పెళ్లికాని 20-27ఏళ్ల మధ్య ఉన్న పురుషులు అర్హులు. ఇక్కడ <

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మూవీ టీమ్ ఖండించింది. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 519 పాయింట్ల నష్టంతో 83459 వద్ద ముగియగా, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 25597 వద్ద సెటిలైంది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్. టైటాన్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎం&ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభపడ్డాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం మినహా తక్కిన సెక్టార్ల స్టాక్స్ అన్నీ ఎరుపెక్కాయి.

హిందూజా గ్రూప్ ఛైర్మన్, ఇండియన్-బ్రిటిష్ బిలియనీర్ గోపీచంద్ హిందూజా (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ రామీ రేంజర్ వెల్లడించారు. గోపీచంద్ మరణంతో ఒక శకం ముగిసిందని, ఆయన సమాజ శ్రేయోభిలాషి, మార్గదర్శక శక్తి అని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన లండన్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇతర మాసాలతో పోల్చితే సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అందువల్ల దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. ఆ చీకటి నిస్సత్తువకు కారణమవుతుంది. అందుకే ఆ చీకటిని పాలద్రోలడానికి, మనలో శక్తిని పెంపొందించుకోవడానికి కార్తీకంలో ప్రతి గుమ్మం ముందు, గుళ్లలో దీపాలు పెడతారు.

హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్(<
Sorry, no posts matched your criteria.