India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గతేడాది BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్తో తిరిగి రిటైనర్షిప్ దక్కించుకున్నారు. CTలో IND తరఫున అత్యధిక రన్స్ చేయడంతో పాటు KKRకు IPL ట్రోఫీ అందించారు. డొమెస్టిక్ క్రికెట్లోనూ పరుగుల వరద పారించారు. దీంతో BCCI అతడిని B కేటగిరీలో చేర్చింది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘనలతో గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్పై BCCI కరుణ చూపింది. అతడిని C కేటగిరీలో చేర్చింది.
IPLలో మేటి జట్లను చిత్తు చేసిన CSK ఈసారి వరుస పరాజయాలు చవిచూస్తోంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. అయితే ఇప్పటికీ CSK ప్లేఆఫ్స్కి వెళ్లొచ్చు. ప్రస్తుతం 8 మ్యాచుల్లో 2 నెగ్గి 4 పాయింట్లతో ఉన్న ఆ జట్టు.. మిగతా 6 మ్యాచుల్లోనూ భారీ విజయాలు సాధించాలి. నెట్ రన్రేట్ కూడా పెంచుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే. మరి CSK ప్లేఆఫ్స్కు వెళ్తుందని మీరు భావిస్తున్నారా?
భారత్లో దశాబ్దాలుగా మధ్య తరగతివారికి ఆర్థికంగా అండగా నిలిచిన శాలరీ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరభ్ ముఖర్జియా అభిప్రాయపడ్డారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ‘ఇండియా నూతన ఆర్థిక యుగంలోకి ప్రవేశిస్తోంది. జీతం కోసం కాకుండా ప్రయోజనాల కోసం పనిచేసే రోజులు రానున్నాయి. చదువు ఒక్కటే సరిపోదు. వందలాది మంది చేసే పనిని AI క్షణాల్లో చేసేస్తోంది. ఎవరికీ గ్యారంటీ లేదు’ అని వివరించారు.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపించారు. ఫలితాల జాబితాను షేర్ చేస్తూ.. ఇందులో కొందరికి 2 మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో 90శాతం మందికి 150+ మార్కులు రాగా ఇద్దరికి 2 మార్కులొచ్చాయి. ప్రిలిమ్స్లో సత్తా చాటిన వారికి మెయిన్స్లో ఇంత తక్కువ మార్కులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా దీనిపై TGPSC ఎలా స్పందిస్తో చూడాల్సి ఉంది.
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే IPL మ్యాచులకు హర్షా బోగ్లే, సైమన్ డౌల్ను అనుమతించొద్దని BCCIకి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లేఖ రాసింది. పిచ్ తయారీలో క్యురేటర్ BCCI రూల్ బుక్నే ఫాలో అయ్యారని, ఆయన తప్పేం లేదని పేర్కొంది. దీంతో నేడు KKRvsGT మ్యాచులో హర్ష, డౌల్ కనిపించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. KKR బౌలర్లకు సూట్ అయ్యేలా పిచ్ లేదని, ఆ జట్టు హోమ్ గ్రౌండ్ను మార్చుకోవాలని వీరు కామెంట్ చేశారు.
TG: వచ్చే విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ ఫీజులు 20-50% వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు ₹2లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కాలేజీల నుంచి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) ప్రతిపాదనలను స్వీకరించింది. అధికారులు సమావేశమై వీటిపై చర్చిస్తారు. అనంతరం ప్రభుత్వ ఆమోదంతో ఫీజులు ఖరారు కానున్నట్లు సమాచారం.
TG: జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీంతో భారత్ నుంచి ఈ ఎక్స్పోలో పాల్గొన్న తొలి రాష్ట్రంగా TG నిలిచింది. రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంపై రేవంత్ బృందం దృష్టి సారించింది.
AP: YCP నేత వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ ఈ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అటు లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని CIDని ఆదేశించిన HC, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
అమెరికన్ నటి క్రిస్టెన్ స్టీవర్ట్, తన ప్రేయసి డైలాన్ మేయర్ పెళ్లి చేసుకున్నారు. లాస్ ఏంజెలిస్లోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. 2013లో ఓ సినిమా సెట్లో వీరికి పరిచయం ఏర్పడింది. రెండేళ్ల డేటింగ్ అనంతరం 2021లో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ట్విలైట్ ఫ్రాంచైజీ సినిమాలతో క్రిస్టెన్ పాపులయ్యారు. డైలాన్ మేయర్ నటిగా, రచయితగా పలు సినిమాలకు పనిచేశారు.
TG: యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా, ఆపైన ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం రూ.4వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.