India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయనున్నారు. అధికార LDPలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ NHK తెలిపింది. దీనిపై ఇవాళ సాయంత్రం 6 గంటలకు PM ప్రెస్మీట్ నిర్వహిస్తారని పేర్కొంది. జులైలో జరిగిన హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ (అప్పర్ హౌస్) ఎన్నికల్లో LDP, మిత్రపక్షం కొమైటో మెజారిటీ కోల్పోయింది. దీంతో ఆయనపై వ్యతిరేకత పెరిగింది.
*బీట్ రూట్ తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది
*జామ పండ్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*క్యారెట్లు కంటి చూపు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి
*కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ వెంట్రుకలకు మేలు చేస్తాయి
*పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది
*కరివేపాకుతో రక్తహీనత తగ్గుతుంది
*అల్లంతో కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి.
SHARE IT
AP: యూరియా కొరతపై ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి వల్లే ఈ సమస్య వచ్చిందని ఫైరయ్యారు. అటు ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదని ఆరోపించారు.
AP: అనంతపురం (D) గుంతకల్లుకు చెందిన సాయి సాకేత్ అమెరికాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం సాధించారు. తొలుత 10 వారాల పాటు ఇంటర్న్షిప్ కోసం రూ.కోటి ఆఫర్ చేసినట్లు అతడి పేరెంట్స్ రమేశ్, వాసవి తెలిపారు. అది పూర్తయ్యాక పెర్ఫార్మెన్స్ను బట్టి ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని చెప్పారు. వీరు పదేళ్ల క్రితం USకు వెళ్లి సెటిల్ అయ్యారు. సాకేత్ ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు.
‘భారత్ తమ లాభాల కోసం రష్యా ఆయిల్ కొంటోంది’ అన్న US ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవరో వ్యాఖ్యలను ‘X’ ఖండించింది. ‘ఇంధన భద్రత కోసమే భారత్ రష్యా ఆయిల్ కొంటోంది. ఎలాంటి ఆంక్షలు ఉల్లంఘించట్లేదు. రష్యా నుంచి యురేనియం కొంటున్న US.. భారత్ని టార్గెట్ చేయడం ద్వంద్వ వైఖరే’ అని పేర్కొంది. దీంతో నవరో ‘X’ అధినేత ఎలాన్ మస్క్పై మండిపడ్డారు. వారి ఫ్యాక్ట్ చెక్ ఓ చెత్త అని కొట్టి పారేశారు.
సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత ఆర్చర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. కాంపౌండ్ మెన్స్ టీమ్ విభాగంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. ఫైనల్లో ఫ్రెంచ్ పెయిర్పై రిషభ్, ప్రతమేశ్, అమన్తో కూడిన భారత జట్టు 235-233 తేడాతో విజయం సాధించింది. దీంతో దేశం తరఫున మొట్టమొదటి బంగారు పతకం కైవసం చేసుకుంది. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ ఫైనల్లో జ్యోతిసురేఖ జోడీ ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
TG: తాను BRSలోనే ఉన్నానని, వేరే ఏ పార్టీ కండువా కప్పుకోలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. స్పీకర్ నోటీస్కు సమాధానం ఇచ్చానని, సీఎంను కలిసిన వివరాలు పొందుపరిచానని పేర్కొన్నారు. కాగా BRS నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్కు సూచించిన విషయం తెలిసిందే.
✰ గ్రహణాలు ఏర్పడినపుడు సూర్య, చంద్రుల నుంచి విడుదలయ్యే ప్రతికూల శక్తి దేవాలయాల్లోని విగ్రహాల శక్తిని కోల్పోయేలా చేస్తుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. అందుకే ఆలయంలోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా తలుపులు మూసివేస్తారు.
✰ గ్రహణ సమయంలో వంట చేయొద్దని, వండిన ఆహారం విషంగా మారుతుందని, దానిని తినవద్దనే అపోహ ఉంది. అయితే ఇందులో నిజం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.
AP: రాజధాని అమరావతిలో భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. IAS అధికారుల టవర్లు త్వరలోనే పూర్తవుతాయన్నారు. రోడ్లు, కాలువల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి మునిగిపోయిందని, పనులు జరగట్లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇక్కడకు వచ్చి చూస్తే ఎంత మంది, ఎన్ని కంపెనీలు పని చేస్తున్నాయో తెలుస్తుందన్నారు.
ఈరోజు రాత్రి చంద్ర గ్రహణం సంభవించనుంది. ఈ సమయంలో ‘ఓం శ్రాం శ్రీం సః చంద్రమసే నమః’ అనే మంత్రాన్ని జపిస్తే చంద్రుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘మహా మృత్యుంజయ మంత్రం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. శివారాధన చాలా శక్తిమంతమైనది. ఓం నమః శివాయ అనే మంత్రం రాహు-కేతువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గం గణపతయే నమః మంత్రాలు కూడా ప్రతికూల శక్తులను తొలగిస్తాయి’ అని అంటున్నారు.
Sorry, no posts matched your criteria.