news

News April 21, 2025

రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం.

News April 21, 2025

KTRకు హైకోర్టులో ఊరట

image

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పీఎస్‌లో ఆయనపై నమోదైన FIRను న్యాయస్థానం కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రూ.25వేల కోట్ల స్కామ్ చేసినట్లు KTR ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్‌లో ఆయనపై కేసు నమోదైంది.

News April 21, 2025

మతోన్మాద పార్టీతో INC, BRS దోస్తీనా?.. కిషన్ రెడ్డి మండిపాటు

image

TG: HYD స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో MIMకు మేలు చేసేలా INC, BRS వ్యవహరిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లీస్ పచ్చి మతోన్మాద, రజాకార్ల పార్టీ అని దుయ్యబట్టారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్‌కు దోస్తీనా అని నిలదీశారు. మజ్లీస్‌ను గెలిపించాలని సొంత పార్టీ కార్పొరేటర్లను BRS బెదిరిస్తోందని మండిపడ్డారు. BRSకు బాస్ KCR అయినా సూపర్ బాస్ అసదుద్దీన్ ఒవైసీ అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

News April 21, 2025

రేపు ఫలితాలు విడుదల?

image

UPSC సివిల్స్ తుది ఫలితాలు ఇవాళ లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. 1,056 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, 2024 జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 20-29 వరకు మెయిన్స్, 2025 జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. దీంతో ఫలితాల విడుదలకు UPSC కసరత్తు చేస్తోంది.

News April 21, 2025

బంగారం ధర ALL TIME RECORD

image

బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగి తొలిసారి రూ.90,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.770 పెరిగి రూ.98,350 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరగడంతో రూ.1,11,000గా ఉంది.

News April 21, 2025

USతో ఒప్పందం చేసుకునే దేశాలకు చైనా వార్నింగ్

image

అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో ఇతర దేశాలకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశానికి నష్టం కలిగించేలా యూఎ‌స్‌తో ఎవరు ఒప్పందం చేసుకున్నా తీవ్రంగా పరిగణిస్తామని చైనా ప్రకటించింది. ప్రతీకార చర్యలకు వెనుకాడబోమని తేల్చి చెప్పింది. బీజింగ్‌తో ఆర్థిక సంబంధాలు తెంచుకుంటే టారిఫ్స్ నుంచి ఉపశమనం కల్పిస్తామని పలు దేశాలను యూఎస్ ప్రోత్సహిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా ఘాటుగా స్పందించింది.

News April 21, 2025

తిరుమలలో పనిచేయని సిఫార్సు లేఖలు!

image

AP: వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, IAS, IPS, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫార్సు లేఖలను TTD తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో లేఖలతో వచ్చిన భక్తుల పరిస్థితి అయోమయంగా మారింది. ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించరు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో భక్తులు లేఖలతో శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్నారు.

News April 21, 2025

ఎన్నికల కమిషన్ రాజీపడింది: రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. USలోని బోస్టన్‌లో పర్యటిస్తున్న ఆయన అక్కడ ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. ‘భారత ఎన్నికల కమిషన్ రాజీపడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. రాష్ట్రంలో 18ఏళ్లు నిండినవారి కంటే పోలైన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. అది అసాధ్యం. పోలింగ్ కేంద్రాల్లోని వీడియో ఫుటేజ్ చూసే వీల్లేకుండా చట్టాన్ని కూడా మార్చేశారు’ అని వ్యాఖ్యానించారు.

News April 21, 2025

భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 518 పాయింట్ల లాభంతో 79,071, నిఫ్టీ 138 పాయింట్ల ప్లస్‌లో 23,989 వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ లాభాల్లో ట్రేడవుతోంది. ఒరాకిల్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, హిండ్ కాపర్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్.

News April 21, 2025

నితిన్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?

image

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులై 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్‌గా, లయ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాగా ఈ మూవీ విడుదల తేది ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.