news

News September 7, 2025

ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

image

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

News September 7, 2025

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్?

image

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు <<17630461>>ఇండియా-ఏ<<>> కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పినట్లు సమాచారం. అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో విఫలమైన కరుణ్ నాయర్ స్థానంలో శ్రేయస్‌ను ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్‌తో అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా టీమ్‌ఇండియా రెండు టెస్టులు ఆడనుంది.

News September 7, 2025

తిరుపతి లడ్డూ హైదరాబాద్‌లో

image

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు అందజేసే పవిత్రమైన లడ్డూ ప్రసాదం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈ మహా ప్రసాదం హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉంటుందని చాలామందికి తెలియదు. హిమాయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లోని TTD ఆలయాల్లో 9AM నుంచి 5PM వరకు వీటిని విక్రయిస్తారు. ఒక్కో లడ్డూ ధర ₹50. ఒకరు ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. వివిధ కారణాలతో తిరుమల వెళ్లలేని వారికి ఇక్కడే లడ్డూ లభించడం ఎంతో ఆనందాన్నిస్తోంది.

News September 7, 2025

బంధం బలంగా మారాలంటే..

image

ఆలుమగల బంధంలో మాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది భాగస్వామితో ఎన్నో చెప్పాలనుకుంటారు. కానీ వాళ్లు అపార్థం చేసుకుంటారేమోనని చెప్పరు. లోలోపలే సతమతం అవుతుంటారు. దీంతో నిస్తేజం ఆవరిస్తుంది. మనసులోని మాటను చెబితేనే అసంతృప్తికి దూరంగా ఉండవచ్చు. అలాగే కొందరు మాటలతోనే భాగస్వామిని గాయపరుస్తుంటారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం మరింత పెరుగుతుంది. కాబట్టి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం చాలా ముఖ్యం.

News September 7, 2025

వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఇలా

image

* హెవీ మేకప్‌ కాకుండా తేలికపాటి, వాటర్‌ ప్రూఫ్‌ లైట్‌ మేకప్‌ ఎంచుకోవాలి.
* ఫౌండేషన్, కన్సీలర్‌ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్‌.
* జిడ్డు చర్మం ఉంటే కాఫీ, చార్‌కోల్, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్‌లు ఉన్న టోనర్ ఉపయోగించడం మంచిది.
* తాజా పండ్లు, ఆకుకూరలు, తగినన్ని నీరు తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. కనీసం వ్యాయామం చేయాలి.

News September 7, 2025

వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఇలా

image

* మేఘావృతమైన రోజుల్లోనూ సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ఉపయోగించాలి.
* వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ని వాడాలి.
* సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోండి.
* మొటిమలను నివారించడానికి ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

News September 7, 2025

రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా: దుర్గేశ్

image

AP: త్వరలో నంది అవార్డులు అందించేందుకు CM చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. పాలకొల్లులో నిర్వహించిన 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘రాష్ట్రంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్థాపనకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది రాష్ట్ర కళాకారులకు గొప్ప అవకాశం. నవంబర్‌లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించబోతున్నాం’ అని తెలిపారు.

News September 7, 2025

సీక్రెట్ వెకేషన్‌లో రాహుల్: అమిత్ మాల్వీయ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మలేషియాలో సీక్రెట్ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారని BJP IT సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వీయ ఆరోపించారు. ‘రాహుల్ మరోసారి మాయమయ్యారు. ఈసారి మలేషియాకు వెళ్లారు. బిహార్‌ రాజకీయ వేడి నుంచి కాంగ్రెస్ యువరాజు బ్రేక్ కోరుకున్నారేమో. లేదా ఎవరికీ తెలియకూడని సీక్రెట్ మీటింగ్‌కు వెళ్లి ఉండొచ్చు. ప్రజలు సమస్యల్లో ఉంటే ఆయన మాత్రం సెలవుల్లో ఉన్నారు’ అంటూ ఓ ఫొటో షేర్ చేశారు.

News September 7, 2025

షిప్పింగ్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాలో 75పోస్టులు

image

<>షిప్పింగ్ <<>>కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 75 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 55 ఉండగా.. ఎగ్జిక్యూటివ్ పోస్టులు 20 ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి వివిధ అర్హతలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి.

News September 7, 2025

నుదుటిన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

image

బొట్టు పెట్టుకోవడం అలంకరణలో భాగం మాత్రమే కాదని, దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. ‘అజ్ఞా చక్రంపై బొట్టు పెట్టుకుంటే శాంతి, శక్తి, ఏకాగ్రత లభిస్తాయి. లక్ష్మీదేవికి ప్రతీకైన తిలకాన్ని ధరిస్తే.. ఆమెను ఇంట్లోకి ఆహ్వానించిట్లే’ అని పురాణాలు సూచిస్తున్నాయి. యోగ శాస్త్రం ప్రకారం.. 3 నాడీ వ్యవస్థలు ఒకేచోట కలిసే నుదుటిపై బొట్టు పెట్టుకుంటే సోమరితనం తగ్గి, ఓపిక పెరుగుతుందని ప్రతీతి.