India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చరిత్రలో ఎన్నో దేశాలు రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. వాటిల్లో నేపాల్ ఒకటి. కానీ మళ్లీ రాచరిక పాలనే కావాలని కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. చివరి హిందూ రాజు జ్ఞానేంద్ర షా తప్పుకోవడంతో 2008లో నేపాల్ సెక్యులర్ దేశంగా అవతరించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వ అవినీతి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం జనాగ్రహానికి దారితీశాయి.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 7 గంటల సమయం పడుతోంది. అటు రెండో జ్యోతిర్లింగం శ్రీశైలంలోనూ భక్తులు కిటకిటలాడుతున్నారు. లాంగ్ వీకెండ్కు నేడు సోమవారం తోడు కావడంతో మల్లన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో అధికారులు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు తాత్కాలికంగా రద్దు చేసి స్పర్శ దర్శనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. స్వామిని చూడాలంటే క్యూలైన్లలో మూడు గంటలు పడుతోంది.
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో వివేక్ అనే కీలక మావో నేత కూడా మరణించారు. అతడిపై రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనాస్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ జట్టు కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ను ‘నాడా’ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు తెలుగు అథ్లెట్లు శ్రీనివాస్, ప్రత్యూష సహా మొత్తం ఏడుగురిపై వేటు వేసింది. క్రీడాకారులు డోపింగ్ టెస్టులకు శాంపిల్స్ ఇవ్వకుండా రమేశ్ సహకరించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విచారణ అనంతరం నాడా ఈ చర్యలు చేపట్టింది. తాను ఏ తప్పూ చేయలేదని, తప్పు చేసేవారిని ప్రోత్సహించలేదని రమేశ్ తెలిపారు.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘HIT-3’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే USAలో బుకింగ్స్ ప్రారంభం కాగా ఇప్పటివరకు $75K వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుండగా, 10 రోజుల ముందే ఈ ఫీట్ను సాధించింది. దీంతో నాని కెరీర్లో అత్యంత వేగంగా $75K మార్కును చేరుకున్న సినిమాగా నిలిచింది. అలాగే ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ రికార్డునూ సాధించనుంది.
TG: మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గిపోయాయి. HYD మలక్పేట్ మార్కెట్లో క్వింటాల్ ₹1200 ఉండగా, కనిష్ఠంగా ₹500 వరకూ పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో గత నెలలో కిలో ₹40 వరకు ఉన్న ధర ఇప్పుడు ₹15కు పడిపోయింది. యాసంగి దిగుబడి మరింతగా పెరగడంతో ఈ నెలాఖరుకు మరింత ధర తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు తమకు ఆదాయం లేక నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో ధర ఎంత ఉంది?
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఈ వారంలో శాంతి ఒప్పందం కుదిరి యుద్ధానికి ముగింపు పలకొచ్చని US ప్రెసిడెంట్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన SM ప్లాట్ఫామ్ ట్రూత్సోషల్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. యుద్ధం ఆగితే రెండు దేశాలు USతో భారీ స్థాయిలో బిజినెస్ చేసే అవకాశం ఉంటుందన్నారు. కాల్పుల విరమణ, ఉక్రెయిన్లోని క్రిమియా ప్రాంతాన్ని రష్యాకు అప్పగించడం తదితర అంశాలను శాంతి ఒప్పందంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
కర్ణాటక మాజీ DGP ఓమ్ ప్రకాశ్(68) <<16162944>>హత్య <<>>కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ‘‘ప్రకాశ్, ఆయన భార్య పల్లవి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయి. నిన్న ఆయనను ఆమె పొడిచి చంపింది. ఆ తర్వాత తన ఫ్రెండ్, Ex IPS అధికారి భార్యకు కాల్ చేసి ‘ఆ రాక్షసుణ్ని చంపేశాను’ అని చెప్పింది. పల్లవిని, ఆమె కూతురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.
TG: ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి 3 రోజులు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సా.4 గంటల నుంచి బుధవారం సా.6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. అలాగే కౌంటింగ్ జరిగే ఈ నెల 25న కూడా వైన్స్ క్లోజ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గౌతమ్ రావు, MIM నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీలో ఉన్నారు.
పౌర సేవల దినోత్సవం సందర్భంగా సివిల్ ఉద్యోగులతో ప్రధాని మోదీ ఈరోజు భేటీ కానున్నారు. పలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అద్భుతమైన కృషి చేసిన ఉద్యోగులను పురస్కారాలతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు పుస్తకాలను మోదీ ఆవిష్కరిస్తారు.
Sorry, no posts matched your criteria.