India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

★ అరుణాచల్ప్రదేశ్: 38.73%
★ అస్సాం: 45.12%
★ బిహార్: 32.41
★ ఛత్తీస్గఢ్: 42.57
★ మధ్యప్రదేశ్: 44.43
★ మణిపుర్: 46.92
★ రాజస్థాన్: 33.73
★ తమిళనాడు: 39.51
★ పశ్చిమబెంగాల్: 50.96
★ మహారాష్ట్ర: 32.36

TG: హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న సెలవు ప్రకటించాలని తెలంగాణ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని గుర్తు చేశారు. ఆరోజు గౌలిగూడ శ్రీరామ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు భారీ ర్యాలీ చేస్తామని, ఈ నేపథ్యంలో అధికారికంగా సెలవు ప్రకటించాలని కోరారు.

ఏపీ సీఎం జగన్, పీసీసీ చీఫ్ షర్మిల తమ తల్లి విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే అమ్మ! అని జగన్ ట్వీట్ చేశారు. ‘చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ’ అని షర్మిల పోస్ట్ చేశారు.

AP: తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. పార్వేట మండపం, శ్రీగంధం వనం ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ అలుముకుంది. వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీ ఎండల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లే గార్డ్నర్ తన స్నేహితురాలు మోనికా రైట్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను యాష్లే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. 2017 నుంచి వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. యాష్లే ఆసీస్ బౌలింగ్ ఆల్రౌండర్.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈరోజు ఉదయం ఇరాన్లో పేలుడు సంభవించడమే దీనిక్కారణం. కచ్చితంగా ఇది ఇజ్రాయెల్ పనేనంటూ టెహ్రాన్ ఆరోపిస్తోంది. రాజధానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక శిబిరాలు, అణుస్థావరాలపై దాడి జరిగింది. అయితే ఇజ్రాయెల్ ఈ విషయంపై స్పందించలేదు. ఇరాన్పై ప్రతీకార దాడులు చేస్తామని కొన్ని రోజుల క్రితం ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే.

AP: ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీనియర్ అధికారులపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీ దీనిపై దృష్టి సారించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సలహాదారులకు సైతం ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పారు.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చెన్నైలో తమిళ స్టార్ హీరోలు విజయ్, సూర్య సాధారణ ప్రజలతోపాటు క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ‘మేం ఓటేశాం.. మీరూ ఓటు వేయండి’ అంటూ పిలుపునిచ్చారు.

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు నడిచి వెళ్లిన 9మంది అధికారులు ఆయనతో ఓటు వేయించారు. ఓటేసిన శివలింగం సంతోషంతో కన్నీటిపర్యంతం కావడం గమనార్హం. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక్క ఓటైనా కీలకమే!

TG: BRSకు వైరా మాజీ MLA లావుడ్యా రాములు నాయక్ రాజీనామా చేశారు. ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్ఠానం నన్ను అవమానించింది. మళ్లీ ఓడిపోయిన వ్యక్తికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అందుకే BRSకు రాజీనామా చేస్తున్నా’ అని ఆయన పార్టీ చీఫ్ కేసీఆర్కు లేఖ రాశారు.
Sorry, no posts matched your criteria.