India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘డీజే టిల్లు’కు సీక్వెల్గా వచ్చిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. టాలీవుడ్లో సీక్వెల్ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోవనే ప్రచారాన్ని ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ టిల్లన్న మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్తో బాహుబలి-2, కేజీఎఫ్-2, దృశ్యం-2, హిట్-2, బంగార్రాజు, కార్తికేయ-2 వంటి హిట్ చిత్రాల సరసన నిలిచింది. ఈ సినిమాలు కూడా సీక్వెల్గా వచ్చి విజయం సాధించడం గమనార్హం.

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్ల ఫామ్పై ఆ జట్టు చీఫ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పందించారు. ‘వీలైనంత త్వరగా బ్యాటర్లు ఫామ్లోకి వస్తారు. స్టార్ బ్యాటర్లు ఒక్కసారి పరుగులు రాబట్టడం మొదలుపెడితే భారీ స్కోర్లు చూడొచ్చు. అందులో నాకెలాంటి అనుమానం లేదు’ అని ఫ్లవర్ తెలిపారు. కాగా RCBలో ఇప్పటివరకు బ్యాటింగ్లో కోహ్లీ(181 రన్స్) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. మరోవైపు బౌలర్లూ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు.

AP:గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఈ శనివారంలోగా విడుదలయ్యే ఛాన్సుంది. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో APPSC నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే ఛాన్సుంది. నోటిఫికేషన్ జారీ, ప్రిలిమ్స్ మధ్య సన్నద్ధతకు సమయం లేకపోవడంతో ఒక్కో పోస్టుకు 100 మందిని మెయిన్స్కు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఈ IPL సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. దీంతో హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కెప్టెన్గా వ్యూహాలను అమలు చేయడంతో హార్దిక్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ‘ఇక చాలు హార్దిక్.. రోహిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేయ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేకుంటే ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేమని అభిప్రాయపడుతున్నారు.

AP: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్ఎస్ సెట్-2024, ఏపీఆర్జేసీ, డీసీ సెట్లకు దరఖాస్తు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించారు. 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు 5 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

TG: రైతుబంధు డబ్బుల జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ‘ఐదెకరాల భూమి ఉన్న రైతులకు ఇప్పటివరకు రైతుబంధు అందింది. మిగతా వారికి ఈ నెలాఖరులోగా సాయం అందిస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలుపై ఆర్బీఐతో పాటు బ్యాంకర్లతో చర్చిస్తున్నాం. ఒకేసారి రుణమాఫీ చేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నాం. వచ్చే పంట సీజన్ నుంచి వరిధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తాం’ అని వెల్లడించారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు సొంతగడ్డపై మరో పరీక్ష ఎదుర్కోనుంది. IPL2024లో ఇప్పటి వరకు 14 మ్యాచులు జరగ్గా.. 12 మ్యాచుల్లో హోం టీమ్స్ గెలిచాయి. KKR చేతిలో RCB, నిన్న RR చేతిలో ముంబై మాత్రమే ఓడాయి. దీంతో RCBపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వచ్చాయి. అయితే.. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో RCB మ్యాచ్ ఆడనుంది. LSGపై గెలిచి ఆ ముద్ర చెరిపేసుకుంటుందేమో వేచిచూడాలి.

TG: ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడకుండా చర్యలు ముమ్మరం చేస్తోంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ORS ప్యాకెట్లు, IV ఫ్లూయిడ్స్, ఇతర మందులను పెద్ద మొత్తంలో పంపిణీ చేసింది. ఇవి ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద అందుబాటులో ఉండనున్నాయి.

APలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి(M) కోటపాడుకు చెందిన రవి కోత అస్సాం CSగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన 1993వ బ్యాచ్ అస్సాం-మేఘాలయ కేడర్ IAS అధికారి. అస్సాం CS బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. 1966 ఏప్రిల్ 12న జన్మించిన రవి.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి ఆగ్రానమిలో PhD గోల్డ్ మెడల్ అందుకున్నారు.

పురుషులతో సమానంగా మద్యం తాగే మహిళలు ఇటీవల ఎక్కువయ్యారు. అయితే వారు మితంగా ఆల్కహాల్ సేవించినప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50% పెరుగుతుందని US సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. 18-65 ఏళ్ల వయసున్న 4.32 లక్షల మందిపై సర్వే చేశారు. వారానికి 8 కంటే ఎక్కువసార్లు డ్రింక్స్ తీసుకున్నవారిలో గుండె వ్యాధుల ప్రమాదం 33% నుంచి 51% ఉన్నట్లు వెల్లడైంది. అతిగా మద్యపానం చేసేవారిలో ఈ ప్రమాదం 68% ఉందట.
Sorry, no posts matched your criteria.