news

News April 20, 2025

IPL: టాస్ గెలిచిన ముంబై

image

వాంఖడేలో MIvsCSK మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో గత నెల 23న ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. దీంతో ఈరోజు పోరు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఐపీఎల్ ప్రియుల్లో నెలకొంది.

జట్లు:
CSK: రషీద్, రచిన్, మాత్రే, శంకర్, దూబే, జడ్డూ, ఓవర్టన్, ధోనీ, నూర్, ఖలీల్, పతిరణ
MI: రికిల్‌టన్, జాక్స్, సూర్య, తిలక్, పాండ్య, నమన్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా, అశ్వని

News April 20, 2025

ఆ సినిమాల్లో యాక్టింగ్ చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది: సామ్

image

తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు పెద్ద పీట వేస్తారని హీరోయిన్ సమంత అన్నారు. తాను నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమాలో అంతా కొత్తవారే నటించారని చెప్పారు. నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సమయంలో యాక్టింగ్ గురించి పెద్దగా తెలియదన్నారు. తాను నటించిన మొదటి రెండు చిత్రాల్లో యాక్టింగ్ చూస్తే ఇప్పటికీ సిగ్గుగా అనిపిస్తుందని సామ్ తెలిపారు. కాగా ‘ఏమాయ చేసావె’తో ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

News April 20, 2025

కుంభమేళాను రాజకీయంగా వాడుకున్నారు: అఖిలేశ్ యాదవ్

image

యూపీలో జరిగిన మహాకుంభమేళాను సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ కుంభ్‌గా మార్చారని SPచీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. బీజేపీ తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థిగా యోగిని ప్రకటించడానికి కుంభమేళాను రాజకీయంగా వాడుకునే ప్లాన్ చేశారన్నారు. ఆ సమయంలో యోగిని PM అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా దాని వెనక బీజేపీ పాత్ర ఉంటుందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

News April 20, 2025

IPL: చరిత్ర సృష్టించిన కోహ్లీ

image

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 50+ స్కోర్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు. మొత్తం 252 ఇన్నింగ్స్‌ల్లో 67 సార్లు 50+ స్కోర్స్ చేశారు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌(66)ను విరాట్ అధిగమించారు. వార్నర్ తర్వాతి స్థానాల్లో ధవన్(53), రోహిత్(45) ఉన్నారు.

News April 20, 2025

హిందువులు కుల వివక్ష వీడాలి: RSS చీఫ్

image

హిందువులు కుల వివక్షకు స్వస్తి పలకాలని RSS చీఫ్ మోహన్ భాగవత్ సూచించారు. ‘ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం’ నియమాన్ని అనుసరిస్తూ సమాజహితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. UPలోని అలీగఢ్‌లో ఆయన మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు పాటిస్తూ మెరుగైన హిందూ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. స్వయం సేవకులు ప్రతి ఇంటికి వెళ్లి ఐక్యత, మూలాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

News April 20, 2025

SM BUZZ: ధోనీపై రోహిత్ పైచేయి!

image

IPL: వాంఖడేలో ఇవాళ ముంబై, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో సోషల్ మీడియా బజ్‌పై స్టార్ స్పోర్ట్స్ పోస్టర్స్ రిలీజ్ చేసింది. ముంబైకి 36%, చెన్నైకి 64% మంది సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ప్లేయర్ల పరంగా చూస్తే పర్సెంటేజ్ ఇందుకు భిన్నంగా ఉంది. MI ఓపెనర్ రోహిత్‌కు 51%, CSK కెప్టెన్ ధోనీకి 49% మంది మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంది. మరి మీ సపోర్ట్ ఎవరికి? COMMENT

News April 20, 2025

‘పబ్జీ’తో కనెక్షన్స్.. భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

image

AFG, PAK నుంచి భారత్‌కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఢిల్లీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో భాగంగా J&K శ్రీనగర్‌కు చెందిన ఫహీమ్ ఫరూఖ్‌ను ట్రాప్ చేసి గ్యాంగ్‌ను ట్రాక్ చేశారు. 1667గ్రా. హెరాయిన్ సహా, ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 10మందిని అరెస్ట్ చేశారు. పబ్జీ గేమ్ ద్వారా కనెక్షన్స్ పెంచుకుని డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.

News April 20, 2025

ఆంటీ పాత్ర పోషించడమే బెస్ట్: సిమ్రన్

image

పెద్దగా ప్రాధాన్యత లేని డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ, అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమమని సినీ నటి సిమ్రన్ అన్నారు. ఆంటీ, అమ్మ పాత్రలలో నటించడం కొంతమంది చులకనగా భావిస్తారని, అది సరికాదని అన్నారు. మనం ఏ పని చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు. కాగా ఇటీవల విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో సిమ్రన్ అతిథి పాత్రలో నటించారు.

News April 20, 2025

రేపటి నుంచి UAEలో IAF సైనిక విన్యాసాలు

image

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ‘డెజర్ట్ ఫ్లాగ్ 10’ పేరిట నిర్వహించే మల్టీ నేషనల్ సైనిక విన్యాసాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) పాల్గొననున్నట్లు డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. మిగ్-2, జాగ్వర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను IAF పంపనుంది. US, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతర్, సౌదీ, సౌత్ కొరియా, టర్కీ, UK ఎయిర్‌ఫోర్సెస్ పాల్గొనే ఈ విన్యాసాలు మే 8 వరకు జరగనున్నాయి.

News April 20, 2025

మెగా DSC.. వారికి ఫీజు నుంచి మినహాయింపు

image

AP: ప్రభుత్వం రిలీజ్ చేసిన <<16157650>>మెగా డీఎస్సీకి<<>> దరఖాస్తుల సమయంలో ఫీజు కట్టే విషయంలో కొందరు అభ్యర్థులకు గందరగోళం నెలకొంది. గత ఏడాది వైసీపీ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కేవలం అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాలి. గతంలో కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే పోస్టుకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.