India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంగళూరు ఎయిర్పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతున్నాయి. అధిక వేడి కారణంగా కొందరు వడదెబ్బకు గురై అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ తగిలిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారంతోపాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలో మార్పులు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ఏపీ సీఎం చంద్రబాబుకు KCR జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు BRS ట్వీట్ చేసింది. ‘నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని KCR ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కేసీఆర్ కోరుకున్నారు’ అని పేర్కొంది. అటు విజయసాయిరెడ్డి కూడా CBNకు విషెస్ చెప్పారు.
ఈ లక్షణాలుంటే మీ పార్ట్నర్కు మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టేనని, జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ఏ విషయాన్నీ డిస్కస్ చేయకపోవడం
*పాజిటివ్ విషయాలకూ చిరాకు పడటం
*ఫ్యూచర్ గురించి పట్టించుకోకపోవడం
*ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకపోవడం
*మీతో కాకుండా ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడుకోవడం
*కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా దగ్గరకి రాకపోవడం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ కోసం Jr.NTR బయల్దేరినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేనితో ఆయన ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తారక్ కొత్తగా, స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఈనెల 22 నుంచి షూటింగ్లో పాల్గొంటారు. అయితే షూటింగ్ ఎక్కడ జరగనుంది? హీరో ఎక్కడికి బయల్దేరారనే విషయాన్ని మూవీ టీమ్ వెల్లడించలేదు.
ముంబైలో మే 1-4 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(WAVES)లో ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ అంశానికి PM మోదీ సారథ్యం వహించనున్నారు. వివిధ దేశాల్లోని మీడియా, ఎంటర్టైన్మెంట్(M&E) రంగాల క్రియేటర్స్ను కనెక్ట్ చేసే వేదికే WAVES. సమ్మిట్లో పలు అంశాలపై సెషన్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ నినాదంతో M&E హబ్కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
TG: ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ కంటే రాష్ట్రానికే ఎక్కువ నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ కేసీఆర్ను సీఎం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంది. కానీ 500 రోజులైనా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
ఇవాళ ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచులో సీఎస్కే మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా మ్యాచులు ఓడిపోతున్న నేపథ్యంలో యాజమాన్యం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. త్రిపాఠి లేదా విజయ్ శంకర్ స్థానంలో శివమ్ దూబే, పతిరణ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ను తుది జట్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. పతిరణను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించుతారని టాక్.
హీరోయిన్ సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో కలిసి నిన్న ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని, మే నెలలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటు సమంతగానీ, అటు రాజ్గానీ స్పందించలేదు.
Sorry, no posts matched your criteria.