India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

న్యూఢిల్లీలోని CSIR-నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ 18 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 9 వరకు పంపాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.72,240 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nplindia.in

అనంతపురం(D) పంపనూరు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. విజయనగర రాజగురువు వ్యాసరాజు ప్రతిష్టించిన ఇక్కడి విగ్రహం ఒకేచోట శివకుటుంబాన్ని, విష్ణుతత్వాన్ని ప్రదర్శిస్తుంది. విగ్రహంలో శివలింగం, శ్రీచక్రం, సప్తశిరస్సుల పాముతో పాటు గణపతి, నరసింహస్వామి కూడా ఉంటారు. ఇక్కడ 9/11 మంగళవారాలు ప్రదక్షిణలు చేస్తే నాగ, రాహుకేతు, కాలసర్ప దోషాలు తొలగి సంపద, సంతానం, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని నమ్మకం.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చెక్ చేయాల్సిందే. విమానం వేగం, ఇంధనం వంటి దాదాపు 80 రకాల సాంకేతిక అంశాలను ఇది రికార్డు చేస్తుంది. పైలట్ల మాటలు, కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన సూచనలు, కాక్పిట్లో వినిపించే శబ్దాలను ఇది భద్రపరుస్తుంది. ప్రస్తుతం అధికారులు బ్లాక్ బాక్స్ను వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

TG: మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘భక్తుల కోసం RTC 4వేల బస్సులు నడుపుతోంది. అక్కా చెల్లెళ్లు ఫ్రీగా ప్రయాణించొచ్చు. బస్సులు అమ్మవారి గద్దెల ప్రాంగణం వరకు భక్తులను తీసుకెళ్తాయి. తాగునీరు, హెల్త్ క్యాంప్స్, మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్, 9KM పొడవైన 50 క్యూలైన్లలో ఒకేసారి 20 వేల మంది ప్రయాణికులు నిలిచేలా ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు.

* నిమ్మరసం మిగిలిపోతే అందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిజ్లో ఉంచితే మరో 2 రోజులు వాడుకోవచ్చు. * నీళ్ళలో పచ్చిపాలు కలిపి వెండి సామగ్రి కడిగితే మురికి వదిలిపోయి శుభ్రపడతాయి. * బెండకాయ కూరలో కాస్త పెరుగు/ నిమ్మరసం జోడిస్తే జిగురు రాకుండా ఉంటుంది. * పిండిలో పావుకప్పు వేయించిన సేమియా వేస్తే గారెలు మరింత రుచిగా ఉంటాయి. *అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.

ఇటీవల చేతికి గాయంతో <<18941717>>కనిపించిన<<>> US అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తడబడ్డారు. తన కుటుంబ ఆరోగ్య చరిత్రను చెబుతూ ‘అల్జీమర్స్’ పేరును మరచిపోయారు. ‘నా తండ్రికి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఆ ఒక్కటి తప్ప. అదేంటి’ అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ను అడిగారు. అల్జీమర్స్ అని ఆమె బదులివ్వడంతో ‘అది నాకు లేదు. నా ఆరోగ్యం చాలా బాగుంది. వంశపారంపర్యంగా వస్తుందనే ఆందోళన కూడా లేదు’ అని చెప్పారు.

తన బాబాయ్, NCP అధినేత శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా 2019 NOVలో అజిత్ పవార్ BJPతో కలిశారు. ఫడణవీస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, Dy.CMగా ప్రమాణం చేశారు. కానీ వారానికే సొంతగూటికి చేరారు. 2023 జులైలో మరోసారి తన వర్గంతో వెళ్లి BJPతో పొత్తు పెట్టుకున్నారు. కుటుంబం, పార్టీ విచ్ఛిన్నానికి ఇది కారణమైంది. మూడేళ్లకు ఇటీవల స్థానిక ఎన్నికల్లో <<18701129>>బాబాయ్, అబ్బాయ్<<>> ఒక్కటయ్యారు. ఇంతలోనే ఘోరం జరిగింది.

వరి సాగులో ఎరువుల యాజమాన్యం ముఖ్యం. సరైన సమయంలో పంటకు అవసరమైన ఎరువులు, పోషకాలు అందించాలి. తెలుగు రాష్ట్రాలలో తేలిక భూములే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వరి చిరు పొట్ట దశలో ఎకరాకు 35 నుంచి 40 కిలోల యూరియాతో పాటు 20 నుంచి 25 కిలోల పొటాష్ ఎరువును వాడటం మంచిది. ఈ దశలో పొటాష్ వాడకం వల్ల వెన్నులో గింజ నాణ్యంగా ఉండి.. తాలు గింజలు ఏర్పడవు. దీని వల్ల అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మహారాష్ట్ర బారామతి ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రన్వే నుంచి పక్కకు వెళ్లి కూలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఫ్లైట్పై పైలట్ పూర్తిగా పట్టుకోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రమాదానికి గురైన Learjet 45 ఎయిర్క్రాఫ్ట్ను VSR సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఈ దుర్ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు <<18980385>>మరణించారు.<<>>

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి రూ.4,00,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,220 పెరిగి రూ.1,65,170గా ఉంది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,950 ఎగబాకి రూ.1,51,400 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
Sorry, no posts matched your criteria.