India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కెనడాలో విద్య, ఉద్యోగాల కోసం పెట్టుకున్న భారతీయుల వీసా అప్లికేషన్స్ ఈసారి 74% రిజెక్ట్ అయ్యాయి. ఆ దేశంతో రిలేషన్ గ్యాప్తో దరఖాస్తులు గణనీయంగా తగ్గగా, అప్రూవల్స్ సైతం అలాగే ఉన్నాయి. 2023లో 20K ఇండియన్స్ అప్లై చేస్తే 32% రిజెక్టవగా ఇప్పుడు 4,515లో అప్రూవ్డ్ 1,196. ఓవరాల్గా ఫారిన్ స్టూడెంట్ వీసాలు తగ్గించడంతో కెనడా వర్సిటీలకూ నిధుల లోటు తప్పట్లేదు. ఇక ఇండియన్స్ ఇప్పుడు UK, AUS వైపు చూస్తున్నారట.

మీ కుటుంబసభ్యులు తమ బ్యాంకు అకౌంట్లలో డబ్బు ఉంచి మర్చిపోయారా? పదేళ్ల కంటే ఎక్కువ సమయం కావడంతో అకౌంట్ను ఫ్రీజ్ చేశారా? అలా ఫ్రీజ్ చేసిన డబ్బును RBI తన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (DEA) ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వీటిని తిరిగి పొందవచ్చు. udgam.rbi.org.inలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తనిఖీ చేయొచ్చు. బ్యాంకుకు వెళ్లి KYC సమర్పించి డబ్బును తిరిగి పొందొచ్చు. SHARE IT

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<

పెద్దలు మనల్ని దీవించేటప్పుడు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని అంటారు. మరి ఆ అష్టైశ్వర్యాలేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే 8. అందుకే అష్టైశ్వర్యాలంటే డబ్బే అనుకుంటారు. కానీ, కాదు. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయం.. ఇవే 8 ఐశ్వర్యాలు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే కావాల్సినవి ఇవే. డబ్బు కాదు. అందుకే ఇవి కలగాలని పెద్దలు మనల్ని అలా జీవిస్తారు.

భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వన్డే వరల్డ్ కప్ కలను నెరవేర్చుకున్న ఉమెన్ ఇన్ బ్లూ ముందు మరో లక్ష్యం ఉంది. అదే T20 వరల్డ్ కప్. ఇప్పటివరకు జరిగిన 9 సీజన్లలో ఆస్ట్రేలియా(5), ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ విజేతగా నిలిచాయి. 2020లో రన్నరప్గా నిలవడమే టీమ్ ఇండియాకు ఉత్తమ ప్రదర్శన. ప్రస్తుతం మూడో ర్యాంకులో ఉన్న ఇండియా వచ్చే ఏడాది జరిగే WCను గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

వరి పంటను ముందుగా కోసినట్లయితే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, కంకిలోని చివరి గింజలు పూర్తిగా నిండుకోక చాలా సన్నగా పొట్ట తెలుపు కలిగి ఉంటాయి. దీని వల్ల మిల్లింగ్ చేసినప్పుడు నిండు గింజల దిగుబడి తగ్గి అధికంగా నూక, తౌడు వస్తాయి. గింజలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పంటను సకాలంలో కోత కోయక పోతే గింజలు ఎక్కువగా ఎండి రాలిపోవడమే కాకుండా పగుళ్లు ఏర్పడతాయి.

ఇవాళ రా.10.30 నుంచి రేపు సా.6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేసుకోవాలని సూచిస్తున్నారు. రేపు ఉ.4:52-5.44 వరకు నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి. సా.5.15-7.05 వరకు దీపారాధాన చేసేందుకు మంచి సమయమని చెబుతున్నారు. ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే దోషాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.

నిన్న మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వ్యాన్లో తరలించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ‘మరణంలోనూ కనీస గౌరవం లేకపోవడం బాధాకరం. రాష్ట్రంలో అంబులెన్స్లు / మార్చురీ వ్యాన్లు లేవా? చనిపోయిన వారికి & వారి కుటుంబాలకు కనీస గౌరవం ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారు. తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, చెత్త వ్యాన్లు, టోయింగ్ వాహనాలపై ఇలా తీసుకెళ్లడం ఏంటి’ అంటూ X వేదికగా మండిపడ్డారు.

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

ఈ నెల 7న ‘ది గర్ల్ఫ్రెండ్’ రిలీజ్ నేపథ్యంలో Xలో అభిమానుల ప్రశ్నలకు హీరోయిన్ రష్మిక ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్తో నటించే అవకాశముందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా ‘ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూస్తారని అనుకుంటున్నా. త్వరలోనే మేము కలిసి పనిచేస్తామని నమ్ముతున్నా’ అని తెలిపారు. హీరో మహేశ్ బాబుకు రోజు రోజుకు వయసు తగ్గుతోందని మరో ప్రశ్నకు బదులిచ్చారు.
Sorry, no posts matched your criteria.