India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* TG: ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం: రేవంత్
* అక్టోబర్లో BRS అధ్యక్షుడి ఎన్నిక: KTR
* ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు
* AP: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం
* CBN ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: జగన్
* వైసీపీలో ఒకటి నుంచి వంద వరకు జగనే: వైవీ సుబ్బారెడ్డి
* IPL: ఢిల్లీపై గుజరాత్ విజయం
TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షను ఈ నెల 27న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి నిర్వహించే ఈ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్లను ఎల్లుండి నుంచి <
జైపూర్లో జరుగుతున్న RRvsLSG మ్యాచ్లో లక్నో ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో RR 9 రన్స్ చేయాల్సి ఉండగా ఆవేశ్(మ్యాచ్లో 3 వికెట్లు) అద్భుత బౌలింగ్తో ఆ స్కోర్ను డిఫెండ్ చేశారు. దీంతో లక్నో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. జైస్వాల్(74), పరాగ్ (39) పోరాటం వృథా అయింది. LSG బౌలర్లలో శార్దూల్, మార్క్రమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
AP: నిరుద్యోగులకు మంత్రి లోకేశ్ శుభవార్త చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. టీచర్ల నియామకం ద్వారా స్కూళ్ల సాధికారత సాధించడంలో ఇదొక చారిత్రక ముందడుగని పేర్కొన్నారు. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
AP: మాజీ ఎంపీ హర్షకుమార్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గతంలో ఎన్నడూ లేని విధంగా తనతో వ్యవహరించారని ఆరోపించారు. 5గంటలపాటు రాజమహేంద్రవరం అంతటా తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో హర్షకుమార్ రాజమహేంద్రవరంలో శాంతి ర్యాలీ తలపెట్టగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
AP: ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు విజయనగరంలో 10, మన్యం జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
రేపు ఈస్టర్ జరగనున్న సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ప్రకటించారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి 12గంటల వరకూ ఉక్రెయిన్పై కాల్పుల నిలుపుదల చేపడుతున్నట్లు అధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు. ఉక్రెయిన్తో చర్చలకు రష్యా సిద్ధమేనన్నారు. కాగా పుతిన్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన తరువాత కూడా రష్యా డ్రోన్లు దాడి చేస్తున్నాయని మాస్కో బుద్ధికి ఇదే నిదర్శనమని జెలెన్స్కీ అన్నారు.
నిన్న విజయసాయి ప్రెస్మీట్, నేడు రాజ్ కసిరెడ్డి కౌంటర్ ఆడియోతో AP లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజ్ డబ్బులు వసూలు చేశారని VSR నిన్న ఆరోపించగా ‘విజయసాయి బట్టేబాజ్.. ఆయన గురించి త్వరలో ప్రెస్మీట్ పెట్టి అంతా చెబుతా’ అని RKR నేడు ఆడియోలో చెప్పారు. ఒకే కేసులో ఆరోపణలున్న ఇద్దరు వ్యక్తుల పరస్పర విమర్శలతో ఈ కేసును తోడేందుకు తెరవెనక రాజకీయ తతంగం నడుస్తోందని చర్చ జరుగుతోంది.
ఫార్మాట్ ఏదైనా సెంచరీ చేయడమనేది ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. ఇప్పటివరకు ఈ IPL సీజన్లో 3 సెంచరీలే నమోదవ్వగా ముగ్గురు ప్లేయర్లు 97 పరుగులు చేశారు. వీరంతా నాటౌట్గానే మిగలడం విశేషం. ఇందులో శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సమయంలో 97 చేయగా డికాక్, బట్లర్ ఛేజింగ్లో చేశారు. వీరిలో బట్లర్, అయ్యర్కు సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు విజయానికే ప్రాధాన్యమచ్చి క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలిచారు.
సినిమాల్లో డ్రగ్స్ సన్నివేశాల కారణంగా బయటా డ్రగ్స్ వాడకం ఎక్కువవుతోందన్న వాదనను మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఖండించారు. ‘సినిమా వల్ల సొసైటీలో క్రైమ్, డ్రగ్స్ వాడకం పెరుగుతోందంటే నేను నమ్మను. సమాజాన్ని సినిమా అలా ప్రభావితం చేయలేదు. అసలు నిషేధిత పదార్థాలు కేరళకు ఎలా వస్తున్నాయి? స్కూళ్లు, కాలేజీల స్థాయిలోనే డ్రగ్స్ గురించి అవగాహన మొదలుకావాలి’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.