news

News April 19, 2025

ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే

image

రాజస్థాన్ తరఫున బరిలోకి దిగిన 14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అతడే పిన్నవయస్కుడన్న సంగతి తెలిసిందే. ఇక అతడి తర్వాత యంగెస్ట్ ప్లేయర్ల జాబితా చూస్తే..
16ఏళ్లు- ప్రయాస్ రాయ్ బర్మన్ (RCB తరఫున SRHపై 2019లో)
17ఏళ్లు- ముజీబుర్ రెహమాన్ (PBKS తరఫున DCపై 2018లో)
17ఏళ్లు- రియాన్ పరాగ్ (RR తరఫున CSKపై 2019లో)
17ఏళ్లు- ప్రదీప్ సాంగ్వాన్ (DCతరఫున CSKపై 2008లో)

News April 19, 2025

పొట్టతో గుండె వ్యాధులు.. తగ్గించాలంటే?

image

పొట్ట చుట్టూ చేరిన అధిక కొవ్వు వల్ల గుండె సంబంధిత, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవ్వు తగ్గేందుకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలంటున్నారు. ‘సూర్యాస్తమయంలోపు తినాలి. అదికూడా ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు ఉండాలి. ముఖ్యంగా రాత్రుళ్లు కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, స్వీట్స్, హై ప్రొటీన్ ఉండే మటన్‌తో పాటు కూల్‌డ్రింక్స్ & బీర్ అస్సలు తీసుకోకండి’ అని సూచించారు.

News April 19, 2025

భయాన్ని ఎదుర్కోవాలని నెహ్రూ నేర్పారు: రాహుల్ గాంధీ

image

భారతీయులకు నెహ్రూ ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని నేర్పించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘మా ముత్తాత నుంచే నేను నిజం చెప్పడాన్ని, ధైర్యంగా ఉండటాన్ని నేర్చుకున్నాను. ఆయన కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, నిజం కోసం నిలబడటాన్ని నేర్పించారు. నెహ్రూ అనే వ్యక్తి ఓ పొలిటీషియన్ మాత్రమే కాదు. ప్రమాదంలోకి నవ్వుతూ వెళ్లగల యోధుడు’ అని కొనియాడారు.

News April 19, 2025

ఫ్యాన్సీ నంబర్ కోసం బాలయ్య ఎంత ఖర్చు చేశారంటే?

image

TG: ఫ్యాన్సీ నంబర్లతో రాష్ట్ర రవాణాశాఖకు ఇవాళ ఒక్కరోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. సినీ నటుడు బాలకృష్ణ TG09F 0001 నంబర్‌ను రూ.7.75 లక్షలకు దక్కించుకున్నారు. టీజీ09ఎఫ్ 0009ను కమలయ్య హైసాఫ్ట్ సంస్థ రూ.6.70 లక్షలకు, TG09F 9999 నంబర్‌ను ఇకో డిజైన్ స్టూడియో రూ.99,999కు దక్కించుకుంది.

News April 19, 2025

IPL: 24 గంటల్లో మారిన క్రేజ్

image

రేపు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆ జట్లకు ఉన్న క్రేజ్‌ను స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. నిన్న ముంబైకి 63%, సీఎస్కేకు 37% మద్దతు ఉండగా ఇవాళ తారుమారైంది. తాజాగా సపోర్ట్ సీఎస్కేకు పెరిగినట్లు పేర్కొంది. CSKకు 68%, MIకి 32% సపోర్ట్ ఉందని వెల్లడించింది. మరి రేపు జరిగే మ్యాచులో ఎవరు విజయం సాధిస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News April 19, 2025

డీఎస్సీ నోటిఫికేషన్ రేపేనా?

image

AP: లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న డీఎస్సీ ప్రకటనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ప్రభుత్వం డీఎస్సీకి వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. మరి మీరూ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా?

News April 19, 2025

ఇంకో 15 పరుగులు చేయాల్సింది: అక్షర్

image

గుజరాత్‌తో మ్యాచులో ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించారు. ఇంకో 15 పరుగులు చేస్తే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. వేగంగా ఆడేందుకు ప్రయత్నించే క్రమంలో తమ జట్టు వికెట్లు కోల్పోయినట్లు తెలిపారు. బౌలింగ్‌లో విఫలమైనట్లు అంగీకరించారు. పరాజయం గురించి ఎక్కువగా పట్టించుకోకుండా రాబోయే మ్యాచులపై దృష్టి పెడతామన్నారు. కాగా ఈ మ్యాచులో ఢిల్లీ 203 పరుగులు చేయగా GT 19.2 ఓవర్లలోనే ఛేదించింది.

News April 19, 2025

HEART BREAK: 10.5 ఓవర్లలోనే గెలిచినా..

image

ICC ఉమెన్స్ వన్డే WC క్వాలిఫయర్ మ్యాచులో గెలిచినా వెస్టిండీస్‌ హార్ట్ బ్రేక్ అయింది. థాయ్‌లాండ్ ఇచ్చిన 167 పరుగుల టార్గెట్‌ను ఆ జట్టు 10.5 ఓవర్లలోనే ఛేదించింది. అయితే, పాయింట్ల పరంగా బంగ్లాదేశ్(6P)తో సమానంగా ఉన్నప్పటికీ NRR 0.013 తక్కువగా ఉండటంతో క్వాలిఫై కాలేకపోయింది. దీంతో ప్లేయర్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మరోవైపు పాకిస్థాన్‌తో పాటు NRR ఎక్కువగా ఉన్న బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి.

News April 19, 2025

కొనసాగుతున్న పంత్ ఫ్లాప్ షో

image

IPL-2025లో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ప్రస్తుతం RRతో మ్యాచులో 9 బంతులాడి 3 పరుగులు చేసిన పంత్, హసరంగా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. IPL చరిత్రలో అత్యధిక ధర(రూ.27Cr)కు LSG అతడిని కొనుగోలు చేసింది. కానీ పంత్ ఆ రేట్‌కు ఏమాత్రం న్యాయం చేయడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో వరుసగా 0, 15, 2, 2, 0, 21, 63 రన్స్ చేశారు.

News April 19, 2025

చేనేత చీరలో మెరవనున్న అందగత్తెలు

image

TG: చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిస్ వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలు ధరించేలా ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలలో చేనేత థీమ్ ప్రత్యేకంగా నిలవనున్నట్లు సమాచారం. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పోటీదారులు, ఐరోపా ప్రతినిధులతో మే15న పోచంపల్లి పర్యటన చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్రంలో మే7నుంచి31వరకూ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.