news

News April 19, 2025

రికార్డు సృష్టించిన ఎంపురాన్.. 30రోజుల కలెక్షన్లు ఇవే!

image

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన ‘L2: ఎంపురాన్’ ప్రపంచవ్యాప్తంగా 30రోజుల్లో రూ.325 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని హీరో మోహన్ లాల్ ఎక్స్‌లో షేర్ చేశారు. చరిత్రలో నిలిచిపోయే క్షణమని, మలయాళ సినిమా ఓ వెలుగు వెలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించిన ఎంపురాన్ తాజాగా రూ.300కోట్ల క్లబ్‌లో చేరింది.

News April 19, 2025

అకాడమీ ప్రారంభించిన స్మృతి మంధాన

image

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన దుబాయ్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. యూకేకు చెందిన కోచ్ డాన్ భగవతితో భాగస్వామ్యంలో ‘సిటీ క్రికెట్ అకాడమీ’ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ అత్యాధునిక సాంకేతికత సాయంతో యువ క్రికెటర్లను సానబెట్టనున్నట్లు ఆమె వివరించారు. క్రికెట్ తనకెంతో ఇచ్చిందని, ఈ విధంగా తాను ఆటకు తిరిగిస్తున్నానని స్మృతి పేర్కొన్నారు.

News April 19, 2025

పాకిస్థాన్‌లో KFC ఔట్‌లెట్‌లపై దాడులు

image

గాజా యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తోందన్న ఆగ్రహంతో పాకిస్థాన్‌లో 20 చోట్ల KFC రెస్టారెంట్లపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ సంస్థ అమెరికాకు చెందినది కావడమే దాడుల వెనుక కారణం. సంస్థ ఉద్యోగుల్లో ఒకరిని కాల్చిచంపారు. ఘటనలో 160మందిని అరెస్ట్ చేశామని స్థానిక అధికారులు తెలిపారు. చాలా రోజులుగా పాక్‌లో KFCపై నిరసనలు జరుగుతున్నాయి.

News April 19, 2025

ఇంటర్ రిజల్ట్స్ ఎన్ని గంటలకంటే..

image

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఈనెల 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నిగంటలకు రిలీజ్ అవుతాయనేదానిపై తాజాగా బోర్డు స్పష్టత ఇచ్చింది. మ.12 గంటలకు హైదరాబాద్‌లోని విద్యాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఒకే ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ వస్తాయి. మార్క్స్ లిస్ట్‌ను ఈజీగా షేర్ చేసుకోవచ్చు.

News April 19, 2025

బట్లర్ సూపర్ ఇన్నింగ్స్.. గుజరాత్ ఘనవిజయం

image

ఢిల్లీతో జరిగిన మ్యాచులో గుజరాత్ ఘన విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ బ్యాటర్లు 19.2 ఓవర్లలో ఛేదించారు. బట్లర్ 97* పరుగులతో అదరగొట్టగా రూథర్‌ఫోర్డ్(43), సాయి సుదర్శన్(36) ఆయనకు తోడ్పాటునందించారు. గత మ్యాచులో అదరగొట్టిన ఢిల్లీ బౌలర్ స్టార్క్ ఈ సారి తేలిపోయారు.

News April 19, 2025

ఉద్యోగాలపై జపాన్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో యువతకు ఉపాధి కల్పించేలా ఒప్పందం జరిగింది. మెస్సర్స్ రాజ్ గ్రూప్, మెస్సర్స్ టెర్న్ అనే రెండు సంస్థలు TOMCOM (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్)తో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో రాబోయే రెండేళ్లలో 500 మంది ప్రొఫెషనల్స్‌ను కంపెనీలు రిక్రూట్ చేసుకుంటాయి. నైపుణ్యం గల రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా TOMCOMను ఏర్పాటు చేశారు.

News April 19, 2025

ఘోరం: విద్యుత్ షాకిచ్చి.. గోళ్లు పీకి..

image

ఛత్తీస్‌గఢ్‌ కోర్బా జిల్లాలోని ఓ ఐస్‌క్రీమ్ పరిశ్రమ యజమానులు ఇద్దరు కార్మికుల పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దొంగతనం చేశారన్న అనుమానంతో వారిద్దరి దుస్తులు ఊడదీసి కరెంట్ షాకిచ్చారు. అనంతరం గోళ్లు పెకలించి హింసించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News April 19, 2025

IPL చరిత్రలో అతిపిన్న వయస్కుడు అరంగేట్రం

image

RRతో మ్యాచులో LSG కెప్టెన్ పంత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. RRకు శాంసన్ దూరం కాగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తున్నారు. అతిపిన్న వయసులో IPL ఆడుతున్న ప్లేయర్‌గా అతడు చరిత్ర సృష్టించారు.
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, మిల్లర్, సమద్, ఆవేశ్, బిష్ణోయ్, దిగ్వేశ్, శార్దూల్, ప్రిన్స్
RR: జైస్వాల్, దూబే, రాణా, పరాగ్, జురెల్, హెట్మైర్, హసరంగా, ఆర్చర్, తీక్షణ, సందీప్, దేశ్‌పాండే

News April 19, 2025

మరోసారి థియేటర్లలోకి ‘బాషా’

image

రజినీకాంత్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటైనా ‘బాషా’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 25న రీరిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రజిని స్వాగ్, స్టైల్‌ను థియేటర్లలో చూసేందుకు సిద్ధమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న చాలా చిత్రాలకు ‘బాషా’ స్క్రీన్ ప్లేను రిఫరెన్స్‌గా వాడతారని సినీ విశ్లేషకులు చెబుతారు.

News April 19, 2025

హెరాల్డ్ కేసులో మేం భయపడేది లేదు: ఖర్గే

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై పెట్టిన కేసులకు తాము భయపడేది లేదని AICC చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకే వారిని ఈ కేసులో ఇరికించారని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలో సుప్రీం కోర్టు తమ పార్టీ లేవనెత్తిన కీలక పాయింట్లకు ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, ప్రజలకు కాంగ్రెస్ నేతలు వాస్తవాలు చెప్పాలని ఖర్గే పిలుపునిచ్చారు.