news

News November 4, 2025

అష్టైశ్వర్యాలు అంటే ఏంటి?

image

పెద్దలు మనల్ని దీవించేటప్పుడు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని అంటారు. మరి ఆ అష్టైశ్వర్యాలేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే 8. అందుకే అష్టైశ్వర్యాలంటే డబ్బే అనుకుంటారు. కానీ, కాదు. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయం.. ఇవే 8 ఐశ్వర్యాలు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే కావాల్సినవి ఇవే. డబ్బు కాదు. అందుకే ఇవి కలగాలని పెద్దలు మనల్ని అలా జీవిస్తారు.

News November 4, 2025

ఇక టార్గెట్ టీ20 వరల్డ్ కప్

image

భారత మహిళా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వన్డే వరల్డ్ కప్ కలను నెరవేర్చుకున్న ఉమెన్ ఇన్ బ్లూ ముందు మరో లక్ష్యం ఉంది. అదే T20 వరల్డ్ కప్. ఇప్పటివరకు జరిగిన 9 సీజన్లలో ఆస్ట్రేలియా(5), ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ విజేతగా నిలిచాయి. 2020లో రన్నరప్‌గా నిలవడమే టీమ్ ఇండియాకు ఉత్తమ ప్రదర్శన. ప్రస్తుతం మూడో ర్యాంకులో ఉన్న ఇండియా వచ్చే ఏడాది జరిగే WCను గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

News November 4, 2025

వరి పంటను ముందే కోస్తే ఏం జరుగుతుంది?

image

వరి పంటను ముందుగా కోసినట్లయితే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, కంకిలోని చివరి గింజలు పూర్తిగా నిండుకోక చాలా సన్నగా పొట్ట తెలుపు కలిగి ఉంటాయి. దీని వల్ల మిల్లింగ్ చేసినప్పుడు నిండు గింజల దిగుబడి తగ్గి అధికంగా నూక, తౌడు వస్తాయి. గింజలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పంటను సకాలంలో కోత కోయక పోతే గింజలు ఎక్కువగా ఎండి రాలిపోవడమే కాకుండా పగుళ్లు ఏర్పడతాయి.

News November 4, 2025

రేపు కార్తీక పౌర్ణమి.. ఇలా చేస్తే?

image

ఇవాళ రా.10.30 నుంచి రేపు సా.6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేసుకోవాలని సూచిస్తున్నారు. రేపు ఉ.4:52-5.44 వరకు నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి. సా.5.15-7.05 వరకు దీపారాధాన చేసేందుకు మంచి సమయమని చెబుతున్నారు. ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే దోషాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.

News November 4, 2025

మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వరా: KTR

image

నిన్న మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వ్యాన్‌లో తరలించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ‘మరణంలోనూ కనీస గౌరవం లేకపోవడం బాధాకరం. రాష్ట్రంలో అంబులెన్స్‌లు / మార్చురీ వ్యాన్‌లు లేవా? చనిపోయిన వారికి & వారి కుటుంబాలకు కనీస గౌరవం ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారు. తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, చెత్త వ్యాన్లు, టోయింగ్ వాహనాలపై ఇలా తీసుకెళ్లడం ఏంటి’ అంటూ X వేదికగా మండిపడ్డారు.

News November 4, 2025

మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

image

మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

News November 4, 2025

ప్రభాస్‌తో నటిస్తారా.. రష్మిక ఏమన్నారంటే?

image

ఈ నెల 7న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రిలీజ్ నేపథ్యంలో Xలో అభిమానుల ప్రశ్నలకు హీరోయిన్ రష్మిక ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్‌తో నటించే అవకాశముందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా ‘ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూస్తారని అనుకుంటున్నా. త్వరలోనే మేము కలిసి పనిచేస్తామని నమ్ముతున్నా’ అని తెలిపారు. హీరో మహేశ్ బాబుకు రోజు రోజుకు వయసు తగ్గుతోందని మరో ప్రశ్నకు బదులిచ్చారు.

News November 4, 2025

ఫ్రీగా త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా అప్లై

image

AP: దివ్యాంగులకు ఉచితంగా 1,750 త్రీవీలర్ <<18191488>>మోటార్ సైకిళ్లు<<>> అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
>అర్హతలు
*రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, కనీసం 10th పాసై స్వయం ఉపాధి
*18-45 ఏళ్ల లోపు వయసు. 70% అంగవైకల్యం
*డ్రైవింగ్ లైసెన్స్
> దరఖాస్తులకు లాస్ట్ డేట్ నవంబర్ 25. సైట్ <>www.apdascac.ap.gov.in<<>>

News November 4, 2025

ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో 55 ఉద్యోగాలు

image

ఎయిమ్స్ <>గోరఖ్‌పూర్<<>> 55 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు NMC/MCIలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నవంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. అప్లికేషన్ ఫామ్‌పై ట్రాన్సాక్షన్ నంబర్ రాయాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్:https://aiimsgorakhpur.edu.in

News November 4, 2025

మనవరాలు, తల్లి, తాత.. ముగ్గురూ మృతి

image

TG: నిన్న మీర్జాగూడ <<18183262>>బస్సు<<>> ప్రమాదంలో మరణించిన తల్లీకూతుళ్ల ఫొటో గుండెలను పిండేసిన విషయం తెలిసిందే. తాండూరుకు చెందిన ఖాలీద్.. తన 40 రోజుల మనవరాలికి నామకరణం చేసేందుకు రెండు రోజుల క్రితం HYD నుంచి తీసుకొచ్చారు. అత్తారింట్లో దిగబెట్టేందుకు బస్సులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. తల్లి సలేహ బిడ్డకు హాని జరగకుండా పొత్తిళ్లలో గట్టిగా హత్తుకున్నా ప్రాణాలు దక్కలేదు. ఆ ప్రమాదంలో ఖాలీద్ కూడా చనిపోయారు.