Adilabad

News June 26, 2024

ఆదిలాబాద్: ఈనెల 29 నుంచి పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహాచారి, అదనపు నియంత్రణ అధికారి డా.రాధిక విడుదల చేశారు. మొదటి పేపర్ జూన్ 29న, రెండో పేపర్ జులై 1న, మూడో పేపర్ 3న, నాలుగో పేపర్ 5న ఉన్నట్లు తేలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.

News June 26, 2024

ఉట్నూర్ : నాగోబా దేవాలయాల నిర్మాణం పనులు చేపట్టాలి: కలెక్టర్

image

ఉట్నూర్ లోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా ఐటిడిఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరవీరుల స్తూపం, కేస్లాపూర్ నాగోబా దేవాలయాల నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించి మూడునెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ రెండింటి నిర్మాణ పనులకు రూ.2కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు.

News June 25, 2024

ఆదిలాబాద్ : మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తి

image

పాలిసెట్ మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ 3వ రోజు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజుల పాటు జరిగింది. కాగా మంగళవారం 47 మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోగా 47 మంది అభ్యర్థులు హాజరైనట్లు పాలిసెట్ కోఆర్డినేటర్ భరద్వాజ తెలిపారు. మూడురోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్‌లో మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిపారు.

News June 25, 2024

ADB: ఆఖరి రోజు కొనసాగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

ఈనెల 23న ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన POLYCET సర్టిఫికెట్ వేరిఫికేషన్ 3 రోజులుగా కొనసాగుతోంది. కాగా కౌన్సెలింగ్ ప్రక్రియ నేటితో ముగియనుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలిసెట్ కో ఆర్డినేటర్ భరద్వాజ ఏర్పాట్లు చేశారు. కాగా ఆదివారం, సోమవారం సర్టిఫికెట్‌లు సమర్పించని విద్యార్థులు నేడు తీసుకొచ్చి వేరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు.

News June 25, 2024

నేరడిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

నేరడిగొండ మండలంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన చుంచు సురేశ్(30), లక్ష్మణ్‌చందా మండలంలోని పార్పెల్లికి చెందిన పెద్ద సాయన్న (50) బైక్ పై వస్తున్నారు. ఈక్రమంలో రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 25, 2024

ఆశిశ్ నెహ్రా ప్రశంసలందుకున్న ఆదిలాబాద్ బౌలర్

image

ఆదిలాబాద్‌కు చెందిన సాయిప్రసాద్ తన బౌలింగ్‌తో భారత మాజీ దిగ్గజ బౌలర్ ఆశిశ్ నెహ్రా ప్రశంసలందుకున్నాడు. SGF అండర్-19 రాష్ట్ర, జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో 2 సార్లు పాల్గొన్నాడు. కాగా ఇటీవల జరిగిన IPL టోర్నీలో మార్కరం, జాన్సన్, గిల్, సాయిసుదర్శన్, సాహా వంటి ఇంటర్‌నేషనల్ బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ వేశారు. ఆఫ్ స్పిన్‌తో వారిని ఆకట్టుకున్న సాయిప్రసాద్‌ను ఆశిశ్ నెహ్ర అభినందించి పలు సూచనలు చేశారు.

News June 25, 2024

ఆదిలాబాద్: PM విశ్వకర్మ యోజన పథకానికి 6061 దరఖాస్తులు

image

PM విశ్వకర్మ యోజనపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల జనరల్ మేనేజర్ పద్మభూషణ్ విశ్వకర్మ యోజన గురించి వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 6061 దరఖాస్తులు చేసుకున్నారని అందులో 1820 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. కాగా మిగతా 4241 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

News June 24, 2024

కుంటాల: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఓలకు చెందిన బొమ్మన ప్రకాష్ (35) లెఫ్ట్ పోచంపాడు గురుకుల పాఠశాలలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు. కొన్నిరోజులుగా మద్యానికి బానిసై
మద్యం మత్తులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య రీనా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రజినీకాంత్ తెలిపారు.

News June 24, 2024

ఆదిలాబాద్ : రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు

image

ఇంటర్ సప్లీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఎవరికైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ ఇంటర్ బోర్డ్ అధికారి రవీందర్ తెలిపారు. మొదటి సంవత్సరంలో జనరల్‌లో 3,313 మంది విద్యార్థుకు 2,212 మంది, ఒకేషనల్‌లో 128 మందికి 91 మంది ఉత్తీర్ణత సాధించారు. 2వ సంవత్సరం జనరల్‌లో 2,334 మందికి 1,479, ఓకేషనల్‌లో 235 మందికి 133 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

News June 24, 2024

ఆదిలాబాద్: గుర్తుపడితే సమాచారం ఇవ్వండి

image

ఇటీవల రెండు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నిందితుల ఫొటోను పోలీసులు విడుదల చేశారు. బేల, తాంసీ మండలాల్లో మహిళల మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్ చేసిన విషయం తెలిసిందే. స్నాచర్స్‌ను ఎవరైనా గుర్తుపడితే SDPO 8712659914, జైనథ్ సీఐ 8712659916, రూరల్ సీఐ 8712659915 నంబర్లకు సమాచారం ఇవ్వాలని DSP జీవన్ రెడ్డి కోరారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.