India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ, 166 ఎంపీటీసీ, సర్పంచ్ 473, వార్డులు 3,834 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 11న పోలీంగ్ కేంద్రాల ముసాయిదా విడుదల కానుంది. కాగా ఈ నెల 15 లోపు ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.

ఇండియన్ ఐడిల్ తో పాటు జీ తెలుగు వారు నిర్వహించిన సరిగమ సూపర్ సింగర్స్ ఫైనల్ పోటీల్లో ఆదిలాబాద్ యువతి మొదటి స్థానంలో నిలిచారు. అదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన యువతి అభిజ్ఞ ఆదివారం జరిగిన ఫైనల్లో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటారు. దీంతో కౌన్సిలర్ బండారి సతీష్, కాలనీ వాసులు యువతికి అభినందనలు తెలిపారు.

ఆధ్యాత్మిక గురువు బాజీరావు మహారాజ్ భౌతికంగా దూరమైన ఆయన బోధనలు ఆచరణీయమని, వేలాది మంది జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి అన్నారు. బేల మండలంలోని చెప్రాల గ్రామంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న బాజీరావ్ మహారాజ్ సప్త వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో ఆయన హాజరై మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పల్లకిని గ్రామంలో ఊరేగించారు.

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కౌటాలలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హనీస్ఫూర్తి స్టడీ మెటీరియల్ కోసం మొబైల్ ఫోన్ అడగ్గా తల్లి నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పెళ్లి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం భోదిలో జరిగిన రిసెప్షన్లో కలెక్టర్ రాజర్షి షా ఆయన భార్య నితికా పంత్తో కలిసి పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, తదితరులు ఉన్నారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ సునీల్ వివరాల ప్రకారం.. స్థానిక సీసీఐ ఫ్యాక్టరీ వద్ద శనివారం వాహనాల తనిఖీ చేస్తున్న సందర్భంగా రెండు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా వెళుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రదీప్, జగేశ్వర్ ను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. చోరీ చేసినట్లు అంగీకరించారన్నారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11 TASK ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన GLITZ CORP ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.అతీక్ బేగం పేర్కొన్నారు. 10, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15వేల జీతంతో పాటు, భోజనం, రవాణా సౌకర్యం, వసతి నెలకు అలవెన్స్ ఉంటుందన్నారు.

ఆదిలాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన మేకల రాములు పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కు చెందిన సాజిద్ ఆటోలో ఎక్కి ఓ ఆసుపత్రి వద్ద దిగిపోయాడు. అయితే ఆటోలోనే తన బ్యాగును మరచిపోయాడు. ఆటో డ్రైవర్ బ్యాగును గమనించి వన్ టౌన్ లో అప్పగించాడు. సీఐ సునిల్ కుమార్ బాధితుడిని గుర్తించి ఆ బ్యాగును బాధితునికి అప్పగించి ఆటో డ్రైవర్ సాజిద్ ను అభినందించారు.

అన్ని విషయాలు బోధించే ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఉపయోగించే విధానాన్ని తెలుసుకొని ఉండాలని, ప్రతి రోజు వాటిని ఉపయోగిస్తూ విద్యార్థులకు బోధన జరపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో ఆయా భాష ఉపాధ్యాయులకు ఐఎఫ్పిలు ఉపయోగించే విధానంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.