India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దిలావర్పూర్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు ఓ కీలక లేఖ విడుదల చేశారు. నేటి నుంచి చేపడుతున్న కులగణన కార్యక్రమాన్ని నిషేధిస్తున్నట్లు వారు ప్రకటించారు. బుధవారం స్థానిక తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఫ్యాక్టరీని తొలగిస్తేనే కులగణనలో పాల్గొంటామని తెలిపారు.
దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామానికి చెందిన విద్యార్థి ఆయాన్ హుస్సేన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సంతాపాన్ని తెలిపారు. విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
దండేపల్లి మండలంలోని మేదర్ పేట రోడ్డుపై రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మేదరిపేటలో రోడ్డుపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని లక్సెట్టిపేట మండలంలోని హనుమంతుపల్లికి చెందిన బోనాల మహేశ్ (34) అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు కార్పెంటర్గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సుద్దవాగులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ (జి) మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హనుమాన్లు వివరాలు.. నిజామాబాద్ జిల్లా రాంనగర్కు చెందిన దినేష్ (22) తన భార్య బంధువులు బుర్గుపల్లికి వచ్చారు. నిన్న సాయంత్రం బయటకు వెళ్తునానని బైక్పై వెళ్లి గ్రామ సమీపంలోని సుద్దవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ పక్కన ఉన్న ఎంజేపీ పాఠశాలలో ఉదయం బేస్ బాల్ ఆడుతూ ఓ విద్యార్థి మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న అయాన్(14) అనే విద్యార్థి వాలీబాల్ ఆడుతూ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. బాలుడి స్వగ్రామం దిలావర్పూర్ మండలం లోలం గ్రామం. ఫిట్స్ రావడంతోనే బాలుడు చనిపోయినట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
బెల్లంపల్లి పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ సంజీవని హనుమాన్ దేవాలయ భూములను పరిరక్షించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రేవల్లి రాజలింగు మాట్లాడుతూ.. దేవాలయ భూముల కబ్జాకు దౌర్జన్యంగా రాజకీయ అండతోనే కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్న దుండగులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న ఆటోలో గోదావరిఖనికి చెందిన ప్రయాణికుడు మందమర్రిలో ఆటో దిగి బ్యాగ్ మర్చిపోయాడు.బెల్లంపల్లికి చేరుకున్న ఆటో డ్రైవర్ తిరుపతి విషయాన్ని బెల్లంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్టరాం కుమార్ కి సమాచారం అందించారు. అయిన ద్వారా బ్యాగుని బాధితుడికి అప్పచెప్పారు. బ్యాగ్లో విలువైన బ్యాంక్ పత్రాలు, కొత్త బట్టలు ఉన్నట్లు బాధితుడు తెలిపారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సోయాబీన్ దొంగలించిన కేసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. గత నెల 30న మార్కెట్ యార్డ్లో దొంగతనం అయినట్లు సీఈవో కేదార్ పండరి ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తులో భాగంగా స్థానిక వడ్డెర కాలనీకి చెందిన ఎ.రాజు, ఎస్.రాజు సోయాబీన్ 50 కేజీలు దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. సోయాబీన్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాడనే కారణంతో అరేపల్లి విజయ్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత కాలంగా ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దిలావర్ పూర్, గుండంపల్లి గ్రామస్థులు, రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.