India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్మల్ పట్టణంలోని 27, 39వ వార్డులకు చెందిన కౌన్సిలర్ దంపతులు తౌహీద్దీన్, ఆయేషా గురువారం సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచారు. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో బీఆర్ఎస్లో చేరారు. అల్లోల కాంగ్రెస్లో చేరడంతో తిరిగి వారు కూడా కాంగ్రెస్లో చేరారు.
ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో CM రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు. ★ ఆదిలాబాద్ జిల్లాతో నాకెంతో అవినాభావ సంబంధం ఉంది ★ ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు
★ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకుండా అవమానించిన BJP
★ అడవి బిడ్డలకు అండగా నిలబడిన మంత్రిగా సీతక్క
★ మూతబడిన CCI గురించి పట్టించుకోని మోదీ, కేసీఆర్ ★పదేళ్లు గిరిజనుల సమస్యలు పట్టించుకోని KCR.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రాగల మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం గరిష్ఠంగా జిల్లా వ్యాప్తంగా 45.5 డిగ్రీలు, గురువారం 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. శుక్రవారం 42.7, శనివారం 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు వెల్లడించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నది ఆదిలాబాద్ జిల్లా. ఇది మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో విభిన్న తెగలకు చెందిన ప్రజలు ఉంటారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 లక్షల 44 ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, BRS, BJP పోటీ చేయగా, ముగ్గురు టీచర్లే. ఈ తరుణంలో ఆదిలాబాద్ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్లో అడుగుపెట్టేది ఎవరో కామెంట్ చేయండి.
తాండూరు SI జగదీశ్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 IG రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన మల్టీ జోన్-1 IG PDS రైస్ కేసులపై సమీక్ష నిర్వహించారు. గత నెల 20న తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన PDS బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఈ కేసులో SI జగదీశ్ అలసత్వం పాటు, పలు ఆరోపణలు రావడంతో SIని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఐజీ వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. లింగట్లకు చెందిన మహేందర్ ఆదిలాబాద్ రిమ్స్లో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 26న వివాహమైంది. బుధవారం లింగట్ల నుంచి బైక్పై రిమ్స్కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి-44పై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదైంది.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున నేడు ఆసిఫాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ రానున్నట్లు నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. పాత ఆర్టీఓ కార్యలయం ఎదుట, ప్రేమలు గార్డెన్ పక్కన మైదానంలో బహిరంగ సభ కోసం వేదికను ఏర్పాటు చేశారు. ఎంపీ అభ్యర్థి సుగుణ సొంత ప్రాంతం కావడం వల్ల సీఎం సభకు భారీ స్థాయిలో జనసమీకరణ చేసి సత్తా చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ పరిశీలించారు. దీనిలో భాగంగా భద్రత చర్యల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. హెలిపాడ్, సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు జిల్లా పోలీస్ అధికారులు, తదితరులు ఉన్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి వైపు నుంచి నిర్మల్ వైపు బైక్పై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడు కడెం మండలం ముసాయిపేట గ్రామానికి చెందిన రాహుల్గా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. RIMS ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న రాథోడ్ మహేందర్ డ్యూటీ ముగించుకుని బుధవారం నేరడిగొండ మండలంలోని తన స్వగ్రామానికి బైక్ పై బయల్దేరాడు. ఈ క్రమంలో NH44 దూద్ గండి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.