Adilabad

News February 8, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శనివారం క్వింటా సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News February 8, 2025

ఇచ్చోడ: రాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. MH చంద్రపూర్‌కు చెందిన గాయక్వాడ్ అంకుస్, భార్య జ్యోతితో జున్ని గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో NH-44 క్రాస్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని జ్యోతి స్పాట్‌లోనే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు కాగా రిమ్స్ తరలించారు.

News February 8, 2025

ఉట్నూర్: సీఎంను కలిసిన కొమరం భీమ్ మనవడు

image

ఉట్నూర్: రాష్ట్ర పండుగగా కొమరం భీమ్ వర్ధంతిని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని కొమరం భీమ్ మనవడు సోనేరావు శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలసి సన్మానించారు. రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జోడేఘాట్ ప్రాంతంలోని 12 గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.

News February 8, 2025

ఉట్నూర్: ప్రజలు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే  

image

కవ్వాల టైగర్ జోన్ పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాల రాకపోకలను నిషేధిస్తూ విధించిన ఆంక్షలను శుక్రవారం ఎత్తి వేశారు. ఇకపై చెక్ పోస్టుల వద్ద అటవీ శాఖ వేధింపులు ఉండవని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్ రాకేశ్‌ను ఎమ్మెల్యే కలిసి అటవీ శాఖ అధికారులను  తీరును ఆయన వివరించారు.

News February 7, 2025

ADB: రేపు పాఠశాలలకు సెలవు లేదు: DEO ప్రణీత

image

రేపు రెండవ శనివారం అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు లేదని జిల్లా విద్యాధికారి ప్రణీత  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సెలవును ప్రకటిస్తూ ఫిబ్రవరి 8 రెండవ శనివారం పని దినంగా ఉంటుందని సర్కులర్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలను యదావిధిగా నడపాలని ప్రధానోపాధ్యాయులకు ఆమె సూచించారు. 

News February 7, 2025

ఉట్నూర్: 9 నుంచి జాతర క్రీడాపోటీలు

image

ఉట్నూర్ మండలంలోని శ్యామ్ పూరులో బుడుందేవ్ జాతర అంగరంగవైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు రెండు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు మేనేజిమెంట్ సభ్యుడు పెందూర్ రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేస్తామన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు హాజరుకావాలని వారు కోరారు. 

News February 7, 2025

ADB:చైన్ దొంగలించబోయి దొరికిపోయాడు!

image

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి మాధస్తు మహేందర్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి వాళ్ల బంధువులను చూడడానికి గురువారం సాయంత్రం వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏమాయికుంటకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి విజయలక్ష్మి మెడలోని గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు దొంగ దొంగ అని అరవడంతో పారిపోగా..సెక్యూరిటీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు రిమాండ్‌కు టూ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.

News February 7, 2025

ఆదిలాబాద్: బొలెరో వాహనం ఢీ.. ముగ్గురికి గాయాలు

image

ఆదిలాబాద్‌లో గురువారం రాత్రి బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలోని అంకోలి రోడ్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న ఒక కారును ఢీకొనడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిని ఢీకొంది. దీంతో భీంపూర్ మండలంకు చెందిన గణేష్, ఆదిలాబాద్‌కు చెందిన వెంకట్, నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు.

News February 7, 2025

మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఆశావాహుల చూపు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలోని మున్సిపాలిటీలలో పాలకవర్గం పూర్తయిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను ఆధ్వర్యంలో పాలను కొనసాగుతుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలలో ఆశావాహులు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటినుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఒక వార్డుకు సుమారు ఐదుగురు ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

News February 7, 2025

ఇంద్రవెల్లిలో మండలస్థాయి ప్రజావాణి

image

రాష్ట్రంలో మొట్టమొదటి సారి ప్రజావాణి కార్యక్రమం మండల స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రారంభమైందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఇంద్రవెల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం బహిరంగ విచారణ జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేదన్నారు. DRDA పీడీ రవీందర్, కిసాన్ మిత్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీహర్ష, తదితరులు పాల్గొన్నారు.