India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కళాకారుడు ద్యావంత్ రమేశ్ కుమారుడు ద్యావంత్ మోక్ష జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన నివాసంలో చిన్నారిని శాలువాతో సన్మానించారు. చిన్న వయసులోనే ప్రతిభ కనబర్చడం అభినందనీయమన్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగేశ్, బీజేపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు సాయితేజ ఉన్నారు.
అస్వస్థతతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బోథ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి మావల మండలం వాఘాపూర్లోని తన ఇంటి వద్ద ఆదివారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులను డీఎస్పీ జీవన్ రెడ్డి పరామర్శించారు.
మ్యాట్రిమోనీ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ SHO DSP వెంకటరమణ తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.17లక్షలు మోసపోయారన్నారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏలూరు జిల్లాకు చెందిన వెంకట నాగరాజు, సౌజన్యలను అరెస్ట్ చేసినట్లు DSP వెల్లడించారు.
కాగజ్నగర్ మండలం వేంపల్లి వద్ద <<14518702>>రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదమైన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగానే శంకర్ మృతి చెందారు.
తలమడుగు మండలం పల్లి (బి) గ్రామానికి చెందిన రేణుకా అనే మహిళ ఇటీవల బాబుకు జన్మనిచ్చి అనారోగ్యంతో మృతి చెందింది. కాగా ఆ బాబు పాల కోసం అవస్థలు పడుతుండడంతో కొందరు వ్యక్తులతో ఈ విషయాన్ని తెలుసుకొని ఇచ్చోడ మండల సమీపంలోని శ్రీ జై శ్రీరామ్ గోశాలకు వెళ్ళగా.. సీఐ భీమేష్ చేతుల మీదుగా బాబు తండ్రి మారుతికి ఆవు, దూడను అందజేశారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వహకులు ఐదా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాంవ్లి గ్రామానికి చెందిన భారత బాయి(32) అనే మహిళ తన భర్త రోజూ వేదించడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న సాంగే ప్రకాష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి పథకం అమలు తీరు పై శనివారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సిరికొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అనంతపూర్కు చెందిన తోడసం నాగు- ఇస్రుబాయి దంపతుల కుమారుడు లాల్ సావ్ (10) శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. శనివారం ఉదయం స్థానికులు గ్రామ పొలిమేరలో గాలించగా బావిలో బాలుడు శవమై కనిపించాడు. దీంతో వారు బాలుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఓ బాలిక (17)ను ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని మోసం చేసిన కేసులో నిందితుడి పై మావల పీఎస్లో అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఇర్ఫాన్ పై అట్రాసిటీ, పోక్సో కేసును నమోదు చేశామన్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జుడీషియల్ రిమాండ్కు తరలించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
కుంటాల మండలం సూర్యపూర్ శివారు ప్రాంతంలో చిరుత దాడిలో ఓ ఆవు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం రైతు సాయన్నకు చెందిన ఆవు గ్రామ శివారులోని అడవిలో మేత మేస్తుండగా చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత రైతు మాట్లాడుతూ.. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నాడు.
Sorry, no posts matched your criteria.