India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేజీబీవీ ఉపాధ్యాయుల సమ్మె కారణంగా విద్యార్థులు తమ చదువును నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని డీఈవో రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు బోధిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఏ రకమైన సమస్యలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
శాంతి భద్రతల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా జనవరి 1 నుంచి 31వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం SP మాట్లాడుతూ.. DSP, ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతులు లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదన్నారు.
2024 చివరి రోజు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మెుగవెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో బైక్ అదుపుతప్పి కడెం కెనాల్లో పడి ఇద్దరు యువకులు చనిపోయారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా భీమారంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. కొమ్ము ప్రభాకర్ స్వామి ఇంటి వద్ద అయ్యప్ప స్వామికి వైభవంగా పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. అయ్యప్ప స్వాములు భజనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. డిసెంబర్ 31ని ఇలా భక్తిశ్రద్ధలతో ముగించి నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు.
SC వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ జనవరి 3న బహిరంగ విచారణ చేపడతారని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజల అభిప్రాయాలను బహిరంగ విచారణలో స్వీకరిస్తారని పేర్కొన్నారు.
నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కేజీబీవీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కడెం మెయిన్ కెనాల్లో పడిపోయి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాల్ని పోలీసులకు చేరవేసినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున భైంసాలోని నాగదేవత ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పెకిలించే క్రమంలో సమీపంలోని టైల్స్ పగిలిపోయాయన్నారు. ఇంతకుమించి ఆలయంలో ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దానిని నమ్మవద్దని SP విజ్ఞప్తి చేశారు.
సాయం చేస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఓ మహిళ NZB 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. SHO రఘుపతి వివరాల ప్రకారం.. భర్తతో గొడవ పడి నిర్మల్కు వెళ్లిన మహిళను గౌతమ్ ఈ నెల 17న NZBకి తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కాగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు SHO వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కను ఆదివారం హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.
హన్మకొండలో జరుగుతున్న రాష్ట్రస్థాయి CMకప్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికలజట్టు ఫైనల్స్ లో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో వరంగల్ జట్టుతో తలపడి 12గోల్స్ ఆధిక్యంలో జిల్లా జట్టు విజయం సాధించింది. జిల్లా క్రీడాకారులు,కోచ్ అరవింద్ ను ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు,కనపర్తి రమేష్,పలువురు అభినందించారు.
Sorry, no posts matched your criteria.