India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పురుగు మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. ఉట్నూరు మండలం జైత్రాం తండాకి చెందిన నూర్ సింగ్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. నూర్ సింగ్ మంగళవారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు వెంటనే రిమ్స్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
అందరి సహకారంతోనే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్ను పూర్తి చేసి ప్రత్యేక స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని ఒకటి, రెండు మార్కులతో పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వారు ఆందోళన చెందకుండా సప్లమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు.
పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ సత్తా చాటింది. 99.05 శాతంతో రాష్ట్రంలోనే మెుదటి స్థానంలో నిలిచింది. 8908 మంది విద్యార్థులకు గాను 8823 మంది పాసయ్యారు. 92.93 శాతంతో ఆదిలాబాద్ 17వ స్థానంలో నిలిచింది. 10,374 మందికి 9,641 మంది పాసయ్యారు. 92.42 శాతంతో MNCL జిల్లా 20వ స్థానంలో నిలిచింది. 9283 మందికి గాను 8579 మంది పాసయ్యారు. 83.29 శాతంతో ASF జిల్లా 31 వస్థానంలో నిలిచింది. 6393 మందికి గాను 5325 మంది పాసయ్యారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా BJP తరపున ఆదిలాబాద్లో జరగాల్సిన మహారాష్ట్ర CM ఏక్నాథ్ శిండే, విదేశాంగమంత్రి శివశంకర్ పర్యటనలు రద్దయ్యాయి. కాగా మే మొదటి వారంలో PM మోదీ, ఉత్తరప్రదేశ్ CM యోగి, కేంద్రమంత్రి అమిత్ షా సభలను ఖరారు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. అనుకూలిస్తే ఆసిఫాబాద్- కాగజ్ నగర్ కలిసేలా మోదీ, ఆదిలాబాద్ – ఉట్నూర్ కలిసేలా యోగి, నిర్మల్ -ముథోల్ కలిసేలా అమిత్ షా సభలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,50,175 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 36,338 మంది ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వారిదే ఆధిపత్యం. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రేమించిన యువతి తనకు దక్కుతుందో.. లేదో.. తమ పెళ్లి జరుగుతుందో.. లేదోనని ఓ యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేమనపల్లి చోటుచేసుకుంది. SI శ్యామ్ పటేల్ ప్రకారం.. సంపుటంకు చెందిన నితిన్(20) గోదావరిఖనికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రులు అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి ఖరారు చేసుకుందామని నచ్చజెప్పారు. అయినప్పటికీ తన ప్రేమ ఎక్కడ విఫలమవుతుందనే భయపడి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.
పదోతరగతి ఫలితాలు నేడు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 10,405 మంది రెగ్యులర్,106 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో 5192 మంది బాలురు, 5213 మంది బాలికలు ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 8,923 , మంచిర్యాల జిల్లాలో 9298 , ఆసిఫాబాద్ జిల్లాలో 6637 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్ను Way2News యాప్లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
MPఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఆదిలాబాద్ పరిధిలో 12 మంది అభ్యర్థులు మిగిలారు. నిన్న స్వతంత్ర అభ్యర్థి రాఠోడ్ రాజు తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. రిటర్నింగ్ అధికారి, సాధారణ పరిశీలకుల సమక్షంలో వీరికి గుర్తులు కేటాయించారు. పెద్దపల్లి లోక్ సభ స్థానానికి 42 మంది బరిలో నిలిచారు. నిన్న ఏడుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం కానున్నాయి.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబందించి ఏమైనా సందేహాలు, ఫిర్యాదుల కోరకు సంప్రదించవచ్చని పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద తెలిపారు. ఫిర్యాదు చేయదలుచుకున్న వారు ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు 8143876383 నంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. నేరుగా ఫిర్యాదు చేయదలచిన వారు ఆదిలాబాద్లోని పెన్ గంగా గెస్ట్ హౌస్లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా మైక్రో అబ్జర్వర్స్
ర్యాండమైజేషన్ను సాదారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. అదిలాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ల వారిగా అదిలాబాద్ 14, బోథ్ 30, ఆసిఫాబాద్ 24, సిర్పూర్ 16, నిర్మల్, 30, ఖానాపూర్ 49, ముదోల్ 27 మొత్తం 190 మైక్రో అబ్జర్వర్స్ను కేటాయించారు.
Sorry, no posts matched your criteria.