Adilabad

News December 29, 2024

నిర్మల్: ‘నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి’

image

నిర్మల్ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. డిసెంబర్ 31న జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తారని గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగవద్దని, మైనర్లు వాహనాలు నడపవద్దని, గుంపులు గుంపులుగా రోడ్లపై తిరగవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

News December 29, 2024

ఫైనల్స్‌కు చేరిన ఉమ్మడి ADB జట్టు

image

హన్మకొండలోని జెఎన్ఎస్ మైదానంలో 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి జూనియర్ సీఎం కప్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రతిభ కనబర్చి ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా జట్టుతో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్‌లో 17గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. జిల్లా జట్టు క్రీడాకారులను, కోచ్ సునార్కర్ అరవింద్‌ను పలువురు అభినందించారు.

News December 29, 2024

మైసూర్‌లో యాక్సిడెంట్.. మంచిర్యాల యువకుడు మృతి

image

కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల యువకుడు మృతి చెందాడు. దొరగారిపల్లెకు చెందిన బల్జిపెల్లి సందీప్ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా సందీప్ స్నేహితులతో కలిసి శుక్రవారం కారులో మైసూర్ వెళ్లగా శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో సందీప్‌తో పాటు మరొకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సందీప్ మృతితో దొరగారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 29, 2024

నిర్మల్‌లో మహిళపై అత్యాచారం.. వివరాలు వెల్లడించిన సీఐ

image

నిర్మల్‌లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన వివరాలను టౌన్ సీఐ శనివారం వెల్లడించారు. శుక్రవారం బస్టాండ్‌లో కానిస్టేబుల్ అనిల్ విధులు నిర్వహిస్తుండగా ఆటో డ్రైవర్ స్పృహ కోల్పోయి ఉన్న మహిళ వివరాలు తెలపారు. వారు బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనను యోగేష్ అనే వ్యక్తి లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని తెలుపగా కేసు నమోదు చేశామన్నారు.

News December 29, 2024

‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విజయ డెయిరీ కేంద్రాలు’: ADB కలెక్టర్

image

తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో 85, పట్టణ ప్రాంతాల్లో 25 విజయ పాల విక్రయ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కేంద్రాలకు విజయ సఖి పేరుతోనడుపుతున్నామన్నారు. శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విజయ సఖి నమూనా ఫ్రిడ్జ్‌ను ఆయన ఆవిష్కరించారు.  డెయిరీ డిడి మధుసూదన్ తదితరులు ఉన్నారు.

News December 29, 2024

సిర్పూర్(టి): పెద్దపులి సంచారం కలకలం

image

సిర్పూర్ మండలం ఇటిక్యాల పహాడ్‌లోని ప్లాంటేషన్లో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. పెద్దపులి అడుగులను గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగులను గుర్తించి గ్రామస్థులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, ఉదయం 10 దాటాక వెళ్లి సాయంత్రం 4 లోపే ఇంటికి చేరుకోవాలన్నారు.

News December 28, 2024

ADB: ఆదివారం కాంటాక్ట్ కం కౌన్సిలింగ్ తరగతులు

image

డా. BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3 ,5 సెమిస్టర్ విద్యార్థులకు కాంటాక్ట్ కం కౌన్సిలింగ్ తరగతులను ఈనెల 29న ఆదిలాబాద్ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ శనివారం పేర్కొన్నారు. పీజీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

News December 28, 2024

ఆసిఫాబాద్: ఏడాదిలో 1207 కేసులు నమోదు

image

ఆసిఫాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే హత్య కేసులు 45.45%, రోడ్డు ప్రమాదాలు 1.6% తగ్గాయని జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. SPవార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. 2024లో జిల్లాలో 12 హత్య కేసులు, 82ఆస్తి సంబంధిత నేరాలు, 3నేర పూరిత నరహత్యలు, 04దొమ్మి కేసులు,18 కిడ్నాప్‌లు, 24 రేప్‌లు, 34 SC,STనేరాలు, 27పోక్సో,39 గంజాయి కేసులు, 188మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయాయన్నారు.

News December 28, 2024

ఆదిలాబాద్: ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

image

ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ అడ్మిషన్ల గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ డీఈఓ ప్రణీత పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 24తో గడువు ముగియగా ఈనెల 30 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. కావున విద్యార్థులు www.Telanganaopenschool.orgలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. SHARE IT

News December 28, 2024

మంచిర్యాల: ఆన్‌లైన్ గేమ్‌లో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగి

image

ఆన్‌లైన్ గేమ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని మోసగించిన కేసులో సాంకేతిక పరిజ్ఞానంతో మంచిర్యాల బస్టాండ్‌లో నిందితుడిని పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ PS SHO, DSP వెంకటరమణ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.1,36,96,290మోసపోయానని తమకు ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తు చేయగా నిందితుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ మహమ్మద్ అబ్దుల్ నయీం అని తెలిసి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.