India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాత పగలు మనసులో ఉంచుకొని పథకం ప్రకారం ఒకరిని హత్యకు ప్రయత్నించిన 5గురు నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రూరల్ CIఅబ్సలుద్దీన్ తెలిపారు.CIవివరాల ప్రకారం..ఈనెల 24న బాధితుడు పురుషోత్తం కాగజ్ నగర్ నుంచి మంచిర్యాలకు కారులో వెళుతుండగా ముగ్గురిలో ఒక వ్యక్తి బెల్లంపల్లి వద్ద కారు ఆపి పురుషోత్తంను బండరాళ్లతో తలమీద బాది పారిపోయారు. నేడు తాండూరులో నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించామన్నారు.
మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 61452.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. ఇందులో 18082.120 మె.టల సన్నలు ఉన్నట్లు పేర్కొన్నారు. నేటికీ రూ.76.23 కోట్లు 5,144 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు పూర్తి చేసిన 69 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగిందన్నారు. అకాల వర్షాలకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి పవార్ అనిత తనిఖీ చేశారు. అనంతరం బోధన సిబ్బంది రికార్డులను పరిశీలించి విద్యార్థులకు పాఠం నేర్పించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై దృష్టి పెట్టాలని, పరీక్షల్లో ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలకు వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేడు ఉదయం జరగాల్సిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష, మధ్యాహ్నం జరగాల్సిన 1వ సెమిస్టర్ పరీక్ష వాయిదా వేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 31 మంగళవారం జరుగుతాయని స్పష్టం చేశారు. కావున ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ప్రస్తుత కాలంలో సెల్ఫోన్ లేని వారంటూ ఉండరు. సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్ఫోన్లకు సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో టెలిఫోన్ సిగ్నల్ లేక గ్రామస్థులు ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చెట్లు, గోడలు, బిల్డింగులు ఎక్కుతున్నారు. బంధువులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా నెట్వర్క్ ఏరియాలో లేదు అని వస్తుందని వాపోతున్నారు.
అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.
కేజీబీవీ, సమగ్రశిక్షా ఉద్యోగులు నిరసన చేపడుతున్న సందర్భంగా ఆయా మండలాల్లో కస్తూర్బా విద్యాలయాల్లో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఎంఈవోలను గురువారం ప్రకటనలో ఆదేశించారు. వారు కేజీబీవీ పాఠశాలల్లో వంట మనుషులు, వాచ్మెన్లు , టీచింగ్ స్టాఫ్ను సర్దుబాటు చేయాలని ఎంఈఓలకు సూచించారు.
మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్లో చోటుచేసుకుంది. నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్కు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ కవర్ కింద పడింది. సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో నవజాత శిశువు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఈ నెల 21న ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు చెట్ల పోశెట్టి అలియాస్ అనిల్ను రిమాండ్కు తరలించినట్లు ఉట్నూర్ డిఎస్పీ సీహెచ్ నాగేందర్ తెలిపారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం నిందితుడిపై ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇచ్చోడ సీఐ భీమేష్ తదితరులున్నారు.
డ్రైవర్ను బండరాళ్లతో కొట్టి కారును దుండగులు ఎత్తుకుపోయిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. CI అబ్జాలుద్దీన్ వివరాల ప్రకారం..ముగ్గురు వ్యక్తులు కాగజ్ నగర్ నుంచి మంచిర్యాలకు వెళ్లాలని కారు కిరాయి మాట్లాడుకొని బయలుదేరారు. బెల్లంపల్లి వద్ద కారు ఆపి డ్రైవర్ను కొట్టి అతను వద్దనున్న రూ.3,500/-నగదు, సెల్ ఫోన్ దొంగిలించారని డ్రైవర్ పురుషోత్తం కొడుకు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదయిందని సీఐ వివరించారు.
Sorry, no posts matched your criteria.