Adilabad

News December 25, 2024

ADB: ‘వాజ్ పేయ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ నగేశ్’

image

రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగేశ్ మాట్లాడుతూ.. వాజ్ పేయ్ పుట్టినరోజును సుపరిపాలన దినంగా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

News December 25, 2024

ADB: సమగ్ర శిక్ష ఉద్యోగులకు తుడుందెబ్బ మద్దతు

image

టీపీసీసీ అధ్యక్ష హోదాలో వరంగల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆదివాసీ నాయకులతో కలిసి ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.

News December 25, 2024

ఆదిలాబాద్: BJP కొత్త సారథులు ఎవరు?

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీమ్, నిర్మల్ జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?

News December 25, 2024

తాండూరు మండలంలో పులి సంచారం.. ?

image

తాండూరు మండలంలోని నీలాయపల్లికి కూత వేటు దూరంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలియడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దూడపై దాడి చేసింది పెద్దపులా.. చిరుత పులా అనేది తెలియాల్సి ఉంది. దూడపై పులి దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 24, 2024

MNCL: నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన శ్రీయన్షి

image

బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీయన్షి రన్నర్‌గా నిలిచినట్లు మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టీం మేనేజర్ పుల్లూరి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా క్రీడాకారిణి దేవిక సిహాగ్ తో హోరాహోరీగా తలపడి రన్నర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీయన్షిని ఆయన అభినందించారు.

News December 24, 2024

ఆసిఫాబాద్: తల్లి లేక తల్లడిల్లుతున్న పసికూనలు

image

పాలు తాగి తల్లి ఒడిలో పడుకోవాల్సిన పిల్లల జీవితం అంధకారంగా మారింది. ASF జిల్లా పెంచికల్‌పేట్‌లో ఓ కుక్క 6 పిల్లలకు జన్మనిచ్చి 4 రోజుల క్రితం చనిపోయింది. దీంతో వాటికి పాలిచ్చేందుకు, చలికి తలదాచుకునేందుకు తల్లి ఒడి దూరమైంది. తల్లి చనిపోయిన విషయం తెలియక ఎముకలు కొరికే చలిలో నాలుగు రోజుల నుంచి ఓ ఆవు పక్కన తలదాచుకుంటున్నాయి. తల్లి కోసం పసిప్రాయాలు అల్లాడుతుంటే స్థానికులు చలించి పాలు అందించారు.

News December 24, 2024

కుబీర్: గొడ్డలితో దాడి.. రక్తపుమడుగులో యువకుడు

image

గొడ్డలితో ఓ వ్యక్తిపై దాడి జరిగిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. కుప్టి గ్రామానికి చెందిన విజయ్‌ ఆదివారం సాయంత్రం కస్రా గ్రామానికి మద్యం తాగడానికి వెళ్లాడు. నడుచుకుంటూ కుప్టి వెళ్తుండగా వెనక నుంచి ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న యువకుడిని స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

News December 24, 2024

ADB: గ్యాస్ సిలిండర్ లీకేజీ.. తప్పిన ప్రమాదం

image

ఆదిలాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని హమాలీవాడకు చెందిన రాజు ఇంట్లో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ అయి మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన రాజు వంట గ్యాస్ పై దుప్పటి కప్పేశాడు. దీంతో మంటలు దుప్పటికి సైతం అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

News December 24, 2024

పెంచికల్పేట్: బాబోయ్ మళ్లీ పెద్దపులి కదలికలు?

image

కొమురం భీం జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి శివారు ప్రాంతంలోని ఎర్రగుంట సమీపంలో మళ్లీ పెద్ద పులి కనిపించినట్లు రైతులు పేర్కొన్నారు. పాలఓర్రే, మంగలి కుంట, కుమ్మరి కుంట, కంట్లం దారి, నక్కచెలీమ, లోడపల్లి కెనాల్ ఏరియా, లోడపల్లి ఎర్ర వాగు చెరువు ప్రాంతాలలో పెద్ద పులి సంచరిస్తుందని తెలిపారు. కావున గ్రామ ప్రజలు అటవీలోకి వెళ్లారాదని. అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

News December 23, 2024

ప్రజలు పోలీసుల సేవలను వినియోగించుకోవాలి: నిర్మల్ ఎస్పీ

image

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలనిఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసు సహాయం కావాలన్నా వెంటనే డయల్ 100కు గాని స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.