Adilabad

News December 23, 2024

ఆసిఫాబాద్: రైతు బిడ్డకు అరుదైన పురస్కారం

image

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలం PACS ఛైర్మన్ చుంచు శ్రీనివాస్‌కు అరుదైన పురస్కారం లభించింది. అనునిత్యం వ్యవసాయంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న శ్రీనివాస్ దంపతులకు రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా గాంధీ ప్రతిష్ఠ సంస్థ ద్వారా అందిస్తున్న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అవార్డును అందజేశారు. వారు మాట్లాడుతూ..అరుదైన పురస్కారం లభించడం వల్ల తనకెంతో సంతోషంగా ఉందన్నారు.

News December 23, 2024

ఉట్నూర్: కేటీఆర్‌పై కక్షపూరితంగానే కేసులు

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వం కక్షపూరితంగానే కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ అన్నారు. ఆదివారం అయన ఉట్నూర్‌లో మాట్లాడుతూ.. గురుకుల పాఠశాల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై నిలదీయడం, హైడ్రా బాధితులకు అండగా నిలబడడంతోనే కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కేటీఆర్‌ను టచ్ చేస్తే ఆందోళన తప్పదన్నారు.

News December 22, 2024

ఆదిలాబాద్: ఈ ఏడాది 75 గంజాయి కేసులు నమోదు

image

ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అనే పదం వినపడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, అందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు తమ వంతు కృషి చేయాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 75 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 987.425 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. సుమారు రూ.2 కోట్ల 31 లక్షల 31 వేల 750 విలువ గల గంజాయి కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

News December 22, 2024

‘ఏజెన్సీ ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికన ఉద్యోగాల నియామకాలు జరపాలి’

image

విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో భాష ప్రాతిపాదికన నియామకాలు చేపట్టాలని ఖానాపూర్ MLA వెడ్మ భొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో గిరిజనుల బతుకులు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. కావున, ఏజెన్సీ ప్రాంతంలో భాష ప్రాతిపాదికన గిరిజనులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలన్నారు.

News December 22, 2024

MNCL: 11 నుంచి 27 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు జనవరి 11 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హైయ్యర్ గ్రేడ్ పరీక్ష, 11వ తేదీన టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12, 16వ తేదీన హైయర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

News December 21, 2024

నిర్మల్: ‘రైతులకు అవగాహన కల్పించాలి’

image

ఆధునిక పద్ధతులలో సంప్రదాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత పథకం-2024, కింద జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న కార్యాచరణపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మహిళా శక్తి క్యాంటీన్లలో సేంద్రియ ఉత్పత్తుల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

News December 21, 2024

ఆసిఫాబాద్: 44 కేసులలో 59 మంది అరెస్ట్

image

అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా SPశ్రీనివాసరావు హెచ్చరించారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు అక్రమంగా గుట్కాలు అమ్ముతున్న వారిలో 44 కేసులలో 59మందిని అరెస్ట్ చేసి, రూ.38,38152/-విలువగల గుట్కా రికవరీ చేశామన్నారు. PDS బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి లాంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

News December 21, 2024

మంచిర్యాల: బస్టాండ్ శుభ్రం చేయాలని మందుబాబులకు శిక్ష

image

ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి ఈనెల 18న కోర్టులో హాజరు పర్చగా 2వ అదనపు మెజిస్ట్రేట్ మంచిర్యాల బస్టాండను 5 రోజుల (ఈనెల 20 నుంచి 24) వరకు శుభ్రం చేయాలని శిక్ష విధించారు. ఇది ఇలా ఉండగా మరో 22మందిని ఇవాళ కోర్టులో హాజరు పరచగా 14మందిని 5రోజులు ట్రాఫిక్ అసిస్టెంట్ విధులు నిర్వర్తించాలని, మిగతా వారికి రూ.17500/-జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B.సత్యనారాయణ తెలిపారు.

News December 21, 2024

బెల్లంపల్లి: ‘కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు’

image

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసుల దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ తెలంగాణ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచడమే లక్ష్యంగా ఫార్ములా ఈ కారు రేసింగ్ను చేపట్టగా అవకతవకలకు పాల్పడ్డారని కేసులు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు.

News December 20, 2024

కుభీర్: అత్యాచారయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష

image

అత్యాచారయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ నిర్మల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు సమన్వయ అధికారి ప్రకారం.. కుభీర్ మండలం ఓ గ్రామానికి చెందిన బాలిక 2021 జులై 18న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నరేశ్ బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తండ్రి కుభీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నేరం రుజువు కావడంతో శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.