India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్యాన్సర్ వ్యాధి నివారణకు 10 ఏళ్లుగా కృషి చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసి డాక్టర్ ఉమాకాంత్ గౌడ్ ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ప్రొఫెసర్లు అవార్డుకు ఎంపిక కాగా.. అందులో ADBలోని శాంతి నగర్కు చెందిన ఉమాకాంత్ గౌడ్ ఉన్నారు. ఈనెల 4న కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అవార్డు అందుకోనున్నారు.

టీబీ నిర్మూలన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్పై జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి వైద్య సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్ ఉన్నారు.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోథ్ మండలం కౌట గ్రామానికి చెందిన నోముల వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పతాంగె బ్రహ్మానంద్ నియమితులయ్యారు. దీంతో ఆయన రెండవసారి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన గతంలో గుడిహత్నూర్ జడ్పీటీసీగా పనిచేశారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వికలాంగుల ఉపాధి, పునరావాస పథకం కింద దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించటానికి అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ DWO సబిత తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 12 తేదీ లోపు https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకం క్రింద బ్యాంకు లింకేజ్ లేకుండా నేరుగా రూ.50 వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21 యూనిట్లు జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు.

అసాంక్రమిక వ్యాధులచే బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో NCD క్లినిక్ ను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. అనంతరం రోగులను పరీక్షించే గది, వ్యాధిగ్రస్తులకు సేవలు అందించే గదులను ఆయన సందర్శించారు. NCD క్లినిక్లో అసాంక్రమిక వ్యాధులతో (రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మొదలైనవి) వాటితో బాధపడుతున్న వ్యాధిగ్రస్థులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

మామడ (M) పులిమడుగుకు చెందిన తులసిరాం, రాజు శనివారం బైక్పై ఇంద్రవెల్లి (M) కేస్లాపూర్ నాగోబా జాతరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అధికవేగంతో ప్రయాణిస్తున్న వారి బైకు ఇచ్చోడ (M) దుబార్ పేట్ వద్ద లారీని తప్పించబోయి కిందపడింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాజు మృతి చెందాడని ఎస్సై తిరుపతి తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఎస్సీ కాలనీలో ఇవాళ ఉదయం పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్రపూజలు చేశారా లేక ఎవరైనా కావాలని అలా రోడ్డుపై వేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ సమీపంలో గత రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు నాగోబా జాతరకు వెళ్తుండగా వారి బైక్, ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.