Adilabad

News April 27, 2024

ADB: ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

image

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశాలకు అర్హులైన అనాథ, నిస్సహాయులైన జిల్లాకు చెందిన పదవ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మే 25వ లోగా దరఖాస్తులను ఆదిలాబాద్ బాలరక్షక్ భవన్‌లో అందించాలని కోరారు. వివరాలకు 9440289825 సంప్రదించాలన్నారు.

News April 26, 2024

ఆదిలాబాద్: ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

image

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశాలకు అర్హులైన అనాథ, నిస్సహాయులైన జిల్లాకు చెందిన పదవ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మే 25వ లోగా దరఖాస్తులను ఆదిలాబాద్ బాలరక్షక్ భవన్‌లో అందించాలని కోరారు. వివరాలకు 9440289825 సంప్రదించాలన్నారు.

News April 26, 2024

ADB: ‘13 నామినేష‌న్లు యాక్సెప్ట్.. 10 రిజెక్ట్’

image

ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్‌తో కలిసి జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ పార్టీల‌ ప్ర‌తినిధులు స‌మావేశం నిర్వ‌హించారు.
మొత్తం 23 మంది అభ్య‌ర్థులు 42 నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌గా వివిధ కార‌ణాల‌తో 10 నామినేష‌న్లు తిర‌స్క‌రించిన‌ట్టు వెల్లడించారు.

News April 26, 2024

ADB: అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

image

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వల్ప అనారోగ్యానికి గురైనందున పార్టీ ప్రచార కార్యక్రమంలో వచ్చే 2 రోజులు పాల్గొనరని PRO అక్షయ్ ప్రకటనలో తెలియజేశారు. ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.

News April 26, 2024

గ్రూప్-1 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలి

image

గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆయన గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు జిల్లాలో పకడ్బందిగా చర్యలు చేపట్టాలన్నారు.

News April 26, 2024

స్వల్ప అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

image

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వల్ప అనారోగ్యానికి గురైనందున పార్టీ ప్రచార కార్యక్రమంలో వచ్చే 2 రోజులు పాల్గొనరని PRO అక్షయ్ ప్రకటనలో తెలియజేశారు. ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజలకు సూచించారు.

News April 26, 2024

మే 1న కాగజ్ నగర్‌కు అమిత్ షా

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

News April 26, 2024

జైపూర్: గుప్తనిధుల కోసం తవ్వకాలు

image

జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామి దేవాలయంలోని దొనలో రెండు రోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొనలోని శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్సై శ్రీధర్ ను వివరణ కోరగా ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News April 26, 2024

ఆదిలాబాద్: మే 6 నుంచి DEGREE పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం9 నుంచి 12 వరకు జరగనున్నాయి.
SHARE

News April 26, 2024

జైపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మద్దులపల్లి గ్రామానికి చెందిన సోల్లూరి అజయ్ ద్విచక్ర వాహనంపై ఇందారంకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి పోచం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.