Adilabad

News December 20, 2024

లోకేశ్వరం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

image

లోకేశ్వరం మండలం లక్ష్మీ నగర్ తండాకుఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు. వారి వివరాల ప్రకారం.. రాందాస్ అనే వ్యక్తి మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవ పడేవాడు. భార్య మందలించగా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య డయల్ 100కు కాల్ చేయగా బ్లూ కోల్డ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఆయనను రక్షించారు. కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

News December 19, 2024

మంచిర్యాల: పెద్దపులి సంచారం!

image

మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అటవీ శాఖ పాత మంచిర్యాల, ముల్కల్ల బీట్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సఫారీ రోడ్ మీదుగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాపింగ్ కెమెరాకి పులి చిక్కింది. దీంతో పులి సంచరించిన ప్రదేశాల్లో పాదముద్రలు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో అడవిలోకి వెళ్లవద్దని, పత్తి చేనులోకి రైతులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

News December 19, 2024

వాంకిడి: కుల బహిష్కరణ కేసులో 8 మందికి జైలు శిక్ష

image

కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన 8 మందికి నెల రోజుల జైలు శిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ స్పెషల్ PDR కోర్టు ADB జడ్జి దుర్గారాణి బుధవారం తీర్పునిచ్చారు. వాంకిడిలోని రాంనగర్‌కు చెందిన ఆత్మారాం అతడి కుమారుడికి మధ్య భూ తగాదాలు జరగడంతో వారిని కుల పెద్దలు 4ఏళ్ల పాటు కులం నుంచి బహిష్కరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 2020మే20న వారిపై SHO రమేశ్ కేసు నమోదు చేయగా వారికి బుధవారం జడ్జి శిక్ష విధించారు.

News December 19, 2024

ముళ్ళ పందులను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు

image

నిర్మల్‌‌లోని కొండాపూర్‌ బైపాస్‌ వద్ద అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా మూడు చనిపోయిన ముళ్ల పందులు లభించినట్లు నిర్మల్‌ ఎఫ్‌ఆర్‌వో రామకృష్ణారావు తెలిపారు. ముళ్లపందులను దిలావర్‌పూర్‌ అటవీ ప్రాంతంలో చంపి నిర్మల్‌కు చెందిన విజయ్, నాగరాజు విక్రయించడానికి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బైకును జప్తు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచమన్నారు.

News December 19, 2024

తాండూరు: పత్రాలు లేని వాహనాలకు జరిమానా

image

తాండూరు మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధి అండర్ బ్రిడ్జి ఐబీ చౌరస్తా వద్ద సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. సీఐ మాట్లాడుతూ..ప్రతి వాహనా దారులు వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

News December 18, 2024

అదిలాబాద్: కేంద్రమంత్రిని కలిసిన అదిలాబాద్ ఎంపీ

image

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇవాళ క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియాని కలిశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో క్రీడా అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీ కోరారు. అలాగే హాకీ కోర్టుకు సింథటిక్ టార్ప్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్రమంత్రికి నగేష్  వినతి పత్రం అందజేశారు.

News December 18, 2024

ఆదిలాబాద్: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ADB వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. స్థానిక శాంతినగర్‌కు చెందిన ఆసిఫ్ (23) పాఠశాలకు వెళ్తున్న 9వ తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వేధింపులకు గురి చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News December 17, 2024

ASF: పోలీస్ లాంచనాలతో తిరుపతయ్య అంత్యక్రియలు

image

హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య అంత్యక్రియలు పోలీస్ లాంచనాలతో ఆయన స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా జమ్మికుంటలో నిర్వహించారు. జిల్లాలోని CCSలో విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య గుండెపోటుతో నిన్న మరణించిన విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు షోక్ శక్స్త్ పరేడ్ నిర్వహించి పోలీస్ లాంచనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

News December 17, 2024

కవ్వాల్‌లో అరుదైన పక్షులు

image

జన్నారం మండలంలోని కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల బర్డ్, బటర్ ఫ్లై వాక్ నిర్వహించారు. కాగా అడవిలో పలు అరుదైన పక్షులు పర్యటకులకు కనువిందు చేశారు. రెడ్ రీసెల్డ్ ల్యాప్ విగ్, వైట్ ఐ బెజార్డ్, ఫైడ్ కింగ్ ఫిషర్, వైట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్ వంటి పక్షులు కనిపించాయి. కవ్వాల్ పర్యాటకులను ఆకర్షిస్తోందని అధికారులు తెలిపారు. 

News December 17, 2024

మంచిర్యాల: అవినీతికి పాల్పడిన HMకి జైలు శిక్ష

image

అవినీతికి పాల్పడిన HMకి జైలు శిక్ష, జరిమానాను బెల్లంపల్లి JFCM మెజిస్ట్రేట్ ముఖేష్ విధించారు. దేవాపూర్ SHO ఆంజనేయులు వివరాల ప్రకారం.. కాసిపేట మండలం రేగులగూడ ఆశ్రమ పాఠశాల HM రొడ్డ గోపాల్ 46మంది విద్యార్థులకు బదులు 136మంది హాజరు ఉన్నట్లు తప్పుగా రాసి ప్రభుత్వ డబ్బులను కాజేశారని 2013లో కేసు నమోదైంది. కోర్టులో సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో మెజిస్ట్రేట్ నిందితుడికి పైవిధంగా శిక్ష విధించారు.