India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల హైదరాబాద్లో దేవాలయాలపై జరిగిన దాడికి నిరసనగా నిర్మల్ జిల్లా ముధోల్ మండల ఉత్సవ కమిటీ, హిందూ వాహిని అధ్వర్యంలో నేడు ముధోల్ బంద్ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రోళ్ల రమేశ్ తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు.
ఆసిఫాబాద్: పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు అంత్యక్రియలు నేడు స్వగ్రామం జైనూర్ మండలం మర్లవాయిలో జరగనున్నాయి. శుక్రవారం అనారోగ్యంతో ఆయన కన్నుమూయగా.. పలువురు సంతాపం తెలిపారు. ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అలరించే ఆయన ఈసారి పండగ ముందే కన్నుమూయడంతో ఆదివాసీ గూడేల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి వన్నెతెచ్చిన కనగరాజును 2021లో ‘పద్మశ్రీ’ వరించింది.
పద్మశ్రీ కనకరాజు గుస్సాడి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు గుస్సాడి నృత్యం శిక్షణలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. కేంద్రం ప్రభుత్వం కనకరాజును 2021 పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మరణం ఆదివాసులకు తీరని లోటుగా మిగిలిపోనుంది. రేపు అంతక్రియలు ఆయన స్వగృహంలో నిర్వహిస్తున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కారుకు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తుండగా వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయింది. కాగా ఎమ్మెల్యే అతి స్వల్పంగా గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శి షా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం నిర్వహించే పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే వారి పంటను అమ్ముకోవాలన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు.
ఉదయాన్నే రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్ గావ్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కమాండర్ వాహనం ఢీకొంది. ఈఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం బోల్తా పడగా అందులోని ఆరుగురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచి మంచిర్యాల జిల్లాలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటలలో 2.18 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఎల్లంపల్లి ప్రాజెక్టు, సుందిళ్ల బ్యారేజీలో రొయ్య పిల్లలు పంపిణీ చేస్తారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గఢ్ 3రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడిచిరోలి SP క్యాంప్ ఆఫీసులో Dy, IGఅంకిత్ గోయల్ ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి రామగుండం CP శ్రీనివాస్ అధ్యక్షత వహించి, రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి చర్చించారు.
ఈనెల 28న బీసీ కమిషన్ బృందం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాజర్షి షా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, డిబిసిడిఓ రాజలింగు, డిహెంహెచ్ఓ కృష్ణా, జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డిఎల్పీఓ, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.
పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 25న ఆదిలాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. శుక్రవారం ఉ.8 గంటలకు పట్టణంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఔత్సాహికులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.