India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిరికొండ మండల కేంద్రానికి చెందిన కస్బె రామారావు కుమారుడు కస్బె సాయికుమార్ ఇటీవల విడుదలైన సీఆర్పీఎఫ్ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. తల్లి తండ్రులు వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తారు. సిరికొండ మండల కేంద్రంలోనే ఎస్సీ సామాజిక వర్గంలో మొట్ట మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అరుదైన ఘనత రామారావు తెలిపారు. ఈ సందర్భంగా కస్బె సాయికుమార్ ను స్నేహితులు, కుటుంబీకులు, గ్రామస్తులు అభినందించారు.
కలం స్నేహం ఆధ్వర్యంలో చేపట్టిన బెస్ట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డులు నిర్మల్ జిల్లా వాసులను వరించింది. హైదరాబాదులోని కూకట్పల్లి జరిగిన కార్యక్రమంలో స్వర స్నేహం బెస్ట్ ఆఫ్ ది ఇయర్ గా నాగరాజు, శ్రీకాంత్, గంగాధర్, రాధికలు అవార్డులు పొందారు. నాట్య స్నేహంలో శ్రీ బెస్ట్ ఆఫ్ ది ఇయర్ గా చిన్నారి ప్రణవలకు అవార్డు లభించింది. వారితోపాటు జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రియ కూడా ఉన్నారు.
ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి, దుంపల రంజిత్ కుమార్ అన్నారు. డిసెంబర్ 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా కార్యకర్తల బస్సు యాత్ర సోమవారం మధ్యాహ్నానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని, ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలతో పాటు ఈఎస్ఐ పీఎఫ్ ఇవ్వాలన్నారు.
రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూర్ మండలం రేచినిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మేడి సాయి కుమార్(22) తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. దీంతో తనకు ఎవరు లేరని మనోవేదనకు గురై సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్- 2 పరీక్షల నేపథ్యంలో మంచిర్యాలలోని పరీక్ష కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపుపై పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదిలాబాద్లో 63 కేంద్రాల్లో 10,428, ఆసిఫాబాద్లో 18 కేంద్రాల్లో 4,389, నిర్మల్లో 24 కేంద్రాల్లో 8,080, మంచిర్యాలలో 48 కేంద్రాల్లో14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిమిషం నిబంధన అమలులో ఉంది. అభ్యర్థులు సమయానికి కేంద్రాల వద్దకు చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసివేస్తారని అధికారులు స్పష్టం చేశారు.
ఇచ్చోడ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు రుణమాఫీ, రైతుకు గిట్టుబాటు ధర, సన్నవడ్లకు బోనస్, ప్రతి గింజ ప్రభుత్వమే కొనే విధంగా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సమేతంగా గూడెం గుట్ట దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు దేవాలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
కూతురును ఆడించేందుకు కట్టిన ఊయల తల్లి మెడకు చుట్టుకొని మహిళ మృతి చెందిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 1టౌన్ SHO దేవయ్య వివరాల ప్రకారం.. బెల్లంపల్లిబస్తికి చెందిన నీరజ(42) తన కూతురు కోసం ఇంట్లో చీరతో ఊయల కట్టింది. గురువారం కూతురును ఒళ్లో కూర్చోపెట్టుకొని ఇద్దరు ఊయల ఊగుతూ ఆడించింది. కూతురును దించి కుమారుడికి ఊయల ఊగడం చూపిస్తుండగా ప్రమాదవశాత్తు చీర చుట్టుకుని ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.