India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాముకాటుతో యువకుడు మృతి చెందిన ఘటన బెజ్జూర్ మండలం సోమిని గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సోమిని గ్రామానికి చెందిన జనగం జీవన్దాస్ (22) వ్యవసాయ పనుల నిమిత్తం బుధవారం సాయంత్రం పొలంలో పనిచేస్తుండగా పాముకాటు వేసినట్లుగా తెలిపారు. అనంతరం అహేరి MHలోని సామాజిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
సింగరేణిలోని వివిధ ఖాళీలకు నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి పోస్టుల భర్తీ ప్రక్రియను 2 వారాల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని CMD బలరాం సంబంధిత అధికారులను ఆదేశించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలవుతున్న నేపథ్యంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు పారదర్శకంగా పూర్తిచేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం వజ్జర్లో పులి సంచారం కలకలం రేపుతోంది. చింతగూడలో పులి దాడిలో బుధవారం ఒక ఎద్దు చనిపోయింది. దీంతో గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పులి పాద ముద్రలను గుర్తించారు. పశువులను మేపటానికి అడవిలోకి వెళ్లొద్దని సూచించారు. పులి సంచారంతో ఆయా గ్రామాలలో భయాందోళనలు నెలకొన్నాయి.
హైదరాబాద్ నగరంలోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆర్జీయూకేటీ (బాసర) నూతన వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీలో కల్పిస్తున్న వసతులు, విద్యార్థులకు అందిస్తున్న కోర్సులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై వివరించారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
ఆంద్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒకరు దుర్మరణం చెందారు. గుడిహత్నూర్ మండలం మన్నూర్కు చెందిన బాలుముండే అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఐతే ఐచర్ వాహనంలో అమరావతి నుండి చెన్నై సంత్ర పండ్ల లోడ్తో వెళుతుండగా ఒంగోలు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలు ముండే దుర్మరణం చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈ నెల 25న రామక్రిష్ణాపూర్ తిలక్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యదర్శి బాబురావు తెలిపారు. ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్- 19 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంపిక పోటీలకు ఇంటర్ చదువుతూ 19 ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులని తెలిపారు.
జల్ జంగల్ జమీన్ నినాదంతో నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ వీరుడు కొమరం భీమ్. ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలపై నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఉద్యమించిన కొదమ సింహం, చరిత్ర మరువని యోధుడు కొమురం భీం. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసులను ఏకం చేసి హక్కుల కోసం పోరాటం చేసిన మహా నాయకుడు. నేటికీ కుమరం భీమ్ ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీలు తమ హక్కుల సాధనకై పోరాటాలు కొనసాగిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని IBచౌరస్తాలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ ‘మంచి మంచిర్యాల’ అక్షరాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గతంలో పట్టణ ప్రగతి నిధులు కేటాయించి సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ‘మంచి మంచిర్యాల’ అక్షరాలు కనిపించకుండా పోయాయి. దీంతో సెల్ఫీ పాయింట్ బోసిపోయి కనిపిస్తోంది. వెంటనే అక్షరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎంపీ నగేష్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులు అత్యధిక శాతంగా జిల్లాకు వచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.