Adilabad

News April 25, 2024

ఆదిలాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆస్తులు ఇవే

image

ADB బీజేపి అభ్యర్థి గోడం నగేశ్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇందులో ఆయన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ ఆస్తుల విలువ రూ. 3.09 కోట్లుగా ఉంది. ఆయన పేరిట స్విఫ్ట్ కారు, కుటుంబానికి 33 తులాల బంగారు ఆభరణాలు, ADBలో 32.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, జాతరాల్లో నివాస గృహాలతో కలిపి స్థిరాస్తుల విలువ రూ.2.58 కోట్లుగా ఉంది. రూ. 29.01 లక్షల అప్పులున్నాయి.

News April 25, 2024

లింగాపూర్: బావిలో పడి యువకుడి మృతి

image

మతిస్థిమితం కోల్పోయిన ఓ యువకుడు బావిలో పడి మృతి చెందిన ఘటన సిర్పూర్ మండలంలో చోటుచేసుకుంది. వంజారిగూడ గ్రామానికి చెందిన బాలాజీ(28)కి చిన్నప్పటి నుంచి మతిస్థిమితం సరిగ్గా లేదు. మంగళవారం ఉదయం వాళ్ల వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం రాత్రి వరకు గాలించగా కనిపించలేదు. కాగా నిన్న శివారులోని బావిలో శవమై కనిపించాడు.

News April 25, 2024

బెల్లంపల్లి: విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

image

బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాలలో విద్యుత్ షాక్‌ తో బొమ్మగోని అనిల్ గౌడ్ (28) మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు ఇంట్లో కూలర్ ప్లగ్‌ను జంక్షన్ బాక్స్‌కు అమరుస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్ గౌడ్ మంచిర్యాలలోని ఎస్ఐ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. తాళ్లగురిజాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 25, 2024

జైనథ్: రూ. లక్ష నగదు పట్టివేత

image

జైనథ్ మండలంలోని పిప్పర్‌వాడ టోల్ ప్లాజా వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రూ. లక్ష నగదును పట్టుకున్నట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. వాహనాల తనిఖీ చేపడుతుండగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్న మహ్మద్ అస్లాం ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును తీసుకువెళుతున్నాడు. అతడి నుంచి రూ. లక్ష నగదును సీజ్ చేసి జిల్లా గ్రీవెన్స్ టీంకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. 

News April 25, 2024

ADB: రాష్ట్ర స్థాయిలో రాణించిన జిల్లా విద్యార్థిని

image

జిల్లా విద్యార్థి రాష్ట్రస్థాయిలో సత్తాచాటింది. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన కొత్తూరి అరుణ ప్రసన్న కుమార్ దంపతుల కుమార్తె కొత్తూరి రేచల్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. దింతో పలువురు ఆమెను అభినందించారు. ఇదే స్పూర్తితో మున్ముందు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.

News April 25, 2024

ఆదిలాబాద్‌‌లో బుధవారం 12 నామినేషన్లు దాఖలు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7వ రోజు 12 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌వో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 12 నామినేషన్ల దాఖలైనట్లు వెల్లడించారు.

News April 25, 2024

సోలోగా వచ్చి నామినేషన్ వేసిన రాథోడ్ రమేశ్

image

ఆదిలాబాద్ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్ నామినేషన్ బుధవారం దాఖలు చేశారు. ఆయన ఒంటరిగా వచ్చి రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు నామినేషన్ కార్యక్రమంలో ఎవరూ లేకపోవడం గమనార్హం.

News April 25, 2024

నిర్మల్: పరారీలో ఉన్న హోంగార్డ్‌ అరెస్ట్

image

అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడి పరారీలో ఉన్న హోమ్ గార్డ్ షమీముల్లా ఖాన్ (షకీల్)ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పలువురిని మోసగించినట్లు సీఐ అనిల్ తెలిపారు. పరారీలో ఉన్న అతణ్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల, డీఎస్పీ గంగారెడ్డి పోలీసులను అభినందించారు.

News April 25, 2024

తాండూరు: ఇంటర్‌లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య

image

ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచ్చులాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైదం నారాయణ కుమారుడు మైదం సాత్విక్ ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నట్లు ఎస్ఐ జగదీశ్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

News April 25, 2024

కతర్‌లో నిర్మల్ వాసి మృతి.. ఇంటికి చేరిన మృతదేహం

image

నిర్మల్ మండలంలోని కొరిటికల్ గ్రామానికి చెందిన గువ్వల రవి(23) సంవత్సరం క్రితం కతర్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అక్కడ వారం రోజుల క్రితం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. దీంతో అతడి స్నేహితుల సాయంతో రవి కుటుంబీకులు తెలంగాణ గల్ఫ్ సమితిని ఆశ్రయించి మృతదేహాన్ని గ్రామానికి చేర్చాలని కోరారు. యాజమాన్యంతో మాట్లాడిన అధికారులు బుధవారం మృతదేహాన్ని గ్రామానికి రప్పించారు.