Adilabad

News October 21, 2024

మంచిర్యాల: ఈ నెల 24న మినీ జాబ్ మేళా

image

మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ఈనెల 24వ తేదీన ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి రజని కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న 18- 30 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశం పొందాలని కోరారు.

News October 21, 2024

ADB: లేక్ వ్యూ రెస్టారెంట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆసిఫాబాద్ మండలంలోని అడ ప్రాజెక్టు వద్ద గల లేక్ వ్యూ రెస్టారెంట్ నడపడానికి ఆసక్తి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అర్హత కలిగిన గిరిజన అభ్యర్థులు ఈనెల 28 వ తేదీ లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

News October 21, 2024

ADB: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకై దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బుగ్గారం, ఆసిఫాబాద్, ఇచ్చోడ, జైనూర్, తిర్యాణి, సిర్పూర్, ముథోల్‌లోని పాఠశాలల్లో మిగిలిన సీట్లకై అర్హులైన విద్యార్థులు ఉట్నూరులోని గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 20, 2024

బాసరలో గుర్తు తెలియని మృతదేహం 

image

గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలం రేణుకాపూర్ చెరువులో ఆదివారం లభ్యమైంది. స్థానిక ఎస్సై గణేశ్ వివరాల మేరకు.. అటుగా వెళ్తున్న స్థానికులు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. మృతదేహం గుర్తుపట్టే విధంగా లేకపోవడంతో విచారణ జరిపి పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

News October 20, 2024

ADB: సర్పంచ్, ఉప సర్పంచ్ అవ్వాల్సిందే!

image

కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2, 3 నెలల్లో పంచాయతీ పోరు జరగనుండగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గతంలో ఓడినవారు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, గతంలో గెలిచిన వారు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మరోసారి.. ఏదైతేనేం ఎలాగైనా సర్పంచ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు పావులు కదుపుతున్నారు.

News October 20, 2024

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు

image

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్ట్ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, 697.875 అడుగుల నీటి మట్టం నిల్వ ఉందని చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 406 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు.  

News October 19, 2024

ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్లపై సందేహాలు ఉన్నాయా…? అయితే..

image

ADB జిల్లాలోని పత్తి కొనుగోళ్లలోని రైతుల సమస్యలు/ సందేహాలు/ ఫిర్యాదులకై వివిధ శాఖల సమన్వయంతో మల్టి డిసిప్లినరీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.1) వ్యవసాయ శాఖ కార్యాలయ విస్తరణ అధికారి ప్రసాద్ -9014208626, 2) వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం- జె. స్వామి – 78935866723) సీసీఐ కార్యాలయ ప్రవీణ్ – 90107809734) లీగల్ మెట్రాలజీ నవీన్ కుమార్ 8247767144కు సంప్రదించాలన్నారు.

News October 19, 2024

బెల్లంపల్లి ఎమ్మెల్యే PA ఫేస్‌బుక్ హ్యాక్

image

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల ఫేస్ బుక్ హ్యాక్ చేస్తూ అందిన కాడికి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటన బెల్లంపల్లి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి PA గడ్డం ప్రసాద్ ఫేస్ బుక్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారనే ఆయన తెలిపారు. మెసేజ్‌లు చేస్తూ డబ్బులు కావాలని అడుగుతున్నట్లు PA ప్రసాద్ తెలుసుకుని తన స్నేహితులు, ఇతరులను అప్రమత్తం చేశానని చెప్పారు.

News October 19, 2024

గుడిహత్నూర్: అదుపు తప్పి గాలిలో ఎగిరిన కారు

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్ గావ్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ వైపు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి గాలిలో ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. 

News October 19, 2024

ఆదిలాబాద్: ఒకే రోజు ముగ్గురి సూసైడ్

image

ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు కారణాలతో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. ఆదిలాబాద్ శాంతినగర్‌కి చెందిన హరికృష్ణ(27) అనారోగ్యంతో మత్తడివాగు ప్రాజెక్టు వద్ద సూసైడ్ చేసుకున్నాడు. కొలాంగూడ అటవీ ప్రాంతంలో మనస్తాపంతో ముత్నూర్‌కు చెందిన మాణిక్‌రావు ఉరేసుకోగా.. భుక్తాపూర్‌కు చెందిన హన్మాండ్లు ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య మృతిచెందినప్పటి నుంచి మద్యానికి బానిసై ఉరేసుకున్నట్లు సీఐ తెలిపారు.