Adilabad

News April 25, 2024

ఆదిలాబాద్: ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ

image

ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పంపిణీకి ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందరికి ఓటర్ స్లిప్ ఇవ్వడంతో పాటు ఓటర్ గైడ్‌ను కూడా అందించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో బూత్ స్థాయి అధికారులు ఓటర్ స్లిప్పులు పంపిణీలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.

News April 25, 2024

ఆదిలాబాద్‌లో 6వ రోజు 6 నామినేషన్‌లు దాఖలు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 6వ రోజు 6 నామినేషన్ల దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. BRS అభ్యర్థి ఆత్రం సక్కు 2 సెట్లు, ఇండియా ప్రజా బంధు పార్టీ అభ్యర్థి గేడం సాగర్ 2 సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా మేస్త్రం గంగాదేవి, చవాన్ రాము ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు.

News April 24, 2024

ఆదిలాబాద్: నామినేషన్ దాఖలు చేసిన ఆత్రం సక్కు

image

ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలను అందించారు. ఆయనతో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ ఉన్నారు.

News April 24, 2024

ఆదిలాబాద్‌కు CM వరాల జల్లులు.. ఇవే

image

ఆదిలాబాద్ జిల్లావాసులకు సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. నాగోబా జాతరకు రూ.4 కోట్ల కేటాయించాలని నిర్ణయించామన్నారు. బోథ్ ప్రాంతంలో కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ముక్తి ప్రాజెక్టును కట్టి.. ఆదిలాబాద్‌కు నీళ్లిస్తామని హామీఇచ్చారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి అంబేడ్కర్ పేరు పెడుతామన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని, యూనివర్సిటీ ఏర్పాటు, CCI తెరిపిస్తామన్నారు.

News April 24, 2024

మంచిర్యాల: డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

image

మంచిర్యాలలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన పగరపు బిక్షపతి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతిచెందాడు. కూలీ పనిచేసుకుంటూ అతడు జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి సమీపంలోని డ్రైనేజీ మోరీపై కూర్చుని ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.

News April 24, 2024

ఆదిలాబాద్ లోక్‌సభకు పోటీలో తొలి మహిళ

image

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు. 1952లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఏర్పడింది. 2009లో ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈసారి మొట్టమొదటి సారి ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తున్నారు.

News April 24, 2024

తులం బంగారం, లక్ష రూపాయలు ఎప్పుడిస్తారు?: మహేశ్వర్ రెడ్డి

image

రాష్ట్రంలో కరవు కాటకాలు తీవ్రంగా ఉన్నాయని నిర్మల్ MLA మహేశ్వర్ రెడ్డి అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగొలు చేయకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. CM మాటలు ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ల మీద ప్రమాణం చేస్తున్నారన్నారు. కౌలు రైతులను కలుపుకుని రూ.90వేల కోట్లు రైతంగానికి ఖర్చు పెట్టే స్తోమత ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వివాహాలకు తులం బంగారం, రూ.లక్ష ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

News April 24, 2024

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన ఆత్రం సుగుణ

image

ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ సోమవారం మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేశారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. వారితో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు ఉన్నారు. ఇప్పటివరకు ఆమె రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.

News April 24, 2024

దేవుడు గుడిలో ఉండాలే.. భక్తి గుండెల్లో ఉండాలి: మంత్రి సీతక్క

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జన జాతర కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి దేవుని పైన నమ్మకం ఉందన్నారు. గుడిలా పేరు చెబుతూ రాజకీయాలు చేసే బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. దేవుడు గుడిలో ఉండాలే భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు.

News April 24, 2024

ఆదిలాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

image

ADB జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ ద్వారా సీఎం జన జాతర సభకు చేరుకోగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.