India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 17న కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించే గిరిజన పోరాట వీరుడు కొమురం భీం 84వ వర్ధంతికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు కొమురం భీం మనుమడు కొమురం సోనేరావు, వర్ధంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ పెందోర్ రాజేశ్వర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్తో కలిసి ఆహ్వాన పత్రికను అందించినట్లు పేర్కొన్నారు.
★ లోకేశ్వరం: మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య
★ ఆదిలాబాద్: రైలు కింద పడ్డ వ్యక్తి మృతి
★ ఆసిఫాబాద్: పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు
★ ఆదిలాబాద్: పట్టగొలుసు మింగిన 7 నెలల పాపా
★ నర్సాపూర్: రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
★ మంచిర్యాల: వ్యక్తి ఆత్మహత్య
★ చెన్నూర్: చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్
★ ఇచ్చోడ: రోడ్డుప్రమాదంలో ఒకరికి గాయాలు
★ లోకేశ్వరం: అనారోగ్యంతో ఒకరు మృతి
రెబ్బెనకు చెందిన ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెలు డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ కొలువులు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అక్క ప్రవళిక స్కూల్ అసిస్టెంట్గా, చెల్లెలు రష్మిక SGTకి ఎంపికయ్యారు. వీరి తండ్రి మల్లేష్ బార్బర్గా, తల్లి పద్మ కేజీబీవీలో సీఆర్టీగా పనిచేస్తున్నారు. తమ ఇద్దరు ఆడపిల్లలను ప్రయోజకులను చేయాలని కోరికతో కష్టపడి చదివించామని, వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఫేక్ మేసేజ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు తీసి గ్రూపుల్లో పోస్టు చేసిన, ఫార్వర్డ్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకొని, ఒకటికి రెండుసార్లు వార్త సరైనదా, కాదా పరిశీలించుకుని ప్రచురించాలన్నారు.
ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. వామపక్ష, తీవ్రవాద ప్రభావిత (ఎల్డబ్ల్యూఈ) జిల్లాల జాబితాలో నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల,ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి ఆ జాబితాలో చేర్చాలని అమిత్ షా ను రేవంత్ రెడ్డి కోరారు.
క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన తాండూర్ మండలంలో చోటు చేసుకుంది. విద్యాభారతి పాఠశాలలో విద్యాభారతి బలగం పేరిట పూర్వ విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా రాచకొండ లక్ష్మీనారాయణ క్రికెట్ ఆడుతూ అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు తమతో ఉత్సాహంగా క్రికెట్ ఆడిన మిత్రుడి మరణంతో తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. సర్పంచ్గా పోటీ చేయడానికి ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా గ్రామాలలో పాత వారితో పాటు కొత్తగా బరిలో నిలవడానికి నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్లో 468, మంచిర్యాల 311, నిర్మల్ 396, ఆసిఫాబాద్లో 355 పంచాయతీలు ఉన్నాయి.
భవిష్యత్తు కోసం అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ అనిత సూచించారు. 70వ అటవీ సంరక్షణ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉడుంపూర్ పరిధిలోని అటవీ ప్రాంతాలలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందన్నారు. వాటిని కాపాడుకుందామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందింది. ఏఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడిగూడకు చెందిన అల్లూరి లక్ష్మీ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లింది. నీళ్లు తీసుకువచ్చే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతి చెందింది. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.
TYSA ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెవులో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో నిర్మల్ జిల్లా బాసరకు చెందిన చరణ్, అవినాశ్ జాతీయస్థాయికి ఎంపికైనట్లు సోమవారం నిర్మల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశ్ తెలిపారు. ఇందులో అవినాష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇది ఐదో సారి అని తెలిపారు. విద్యార్థులకు పలువురు అభినందించారు.
Sorry, no posts matched your criteria.