Adilabad

News November 26, 2024

నిర్మల్: మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన అదనపు కలెక్టర్

image

మహిళా శక్తి క్యాంటీన్లు మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. సోమవారం పట్టణంలోని వైద్య కళాశాలలో మహిళా శక్తి క్యాంటీన్‌ను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. మహిళా స్వయం సంఘాలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఆర్థికంగా బలపడడానికి తోడ్పడతాయన్నారు. ఈ మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా వైద్య విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.

News November 26, 2024

ఆసిఫాబాద్: సత్వర న్యాయం జరిగేలా చూడాలి: ఎస్పీ

image

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను జిల్లా SP DV.శ్రీనివాసరావు ఆదేశించారు. గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

News November 25, 2024

సిర్పూర్ (టి) : ఏఎస్ఐ ఇంట్లో దొంగతనం

image

సిర్పూర్ టి మండల కేంద్రానికి చెందిన కౌటాల ఏఎస్ఐ సాయిబాబా ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్లుగా ఎస్ఐ కమలాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి 2.5 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలను దొంగిలించినట్లు ఏఎస్ఐ సాయిబాబా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News November 25, 2024

ఆదిలాబాద్: KU డిగ్రీల పరీక్ష షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

image

కాకతీయ యూనివర్సటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి.బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడవ సెమిస్టర్ ఈనెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న ఉండే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగితావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.

News November 25, 2024

దహేగాంలో ట్రాక్టర్ కింద పడి ఐదేళ్ల బాలుడు మృతి

image

ట్రాక్టర్ కింద పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన దహేగాం మండలంలో చోటుచేసుకుంది. దేవాజిగూడకు చెందిన కృష్ణయ్య, వనిత దంపతుల కుమారుడు రిషి (5) ఆదివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా పత్తి లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ టైర్ బాలుడి పైనుంచి వెళ్లడంతో రిషి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News November 25, 2024

నర్సాపూర్(జి)లో 11ఏళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం

image

బాలిక(11)పై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి యత్నించిన ఘటన నర్సాపూర్ (జి)లో ఆదివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాలికకు తామర పువ్వులు కోసి ఇస్తామని చెప్పి బసంత చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారు. ఆమె అరవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెల్లడించారు.

News November 25, 2024

చెన్నూర్: మాలలు ఐక్యంగా ఉద్యమించాలి: ఎమ్మెల్యే వివేక్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన మాలల మహా గర్జన సభకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా మాలలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

News November 24, 2024

జన్నారం: అటవీ క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్య అటవీ క్షేత్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ఆయన జన్నారం మండలంలోని గోండుగూడా అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా అడవి, వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. అలాగే అటవీ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

News November 24, 2024

నిర్మల్‌: రేపటి నుంచి ప్రజా ఫిర్యాదుల విభాగం

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రేపటి నుంచి యథావిధిగా ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గ్రహించి తమ అర్జీలను అధికారులకు సమర్పించుకోవచ్చని సూచించారు.

News November 24, 2024

బెల్లంపల్లిలో కారు బోల్తా.. ఇద్దరు మృతి

image

బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. కన్నాలబస్తీకి చెందిన రాజేశ్ తన కుటుంబంతో భూపాలపల్లిలోని ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. కారు బెల్లంపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రాజేశ్ అత్త కళ్యాణి, కూతురు ప్రియమేఘన స్పాట్‌లోనే చనిపోయారు. అతడి భార్య అలేఖ్య, కుమారుడు సాయి తీవ్రంగా గాయపడ్డారు.