Adilabad

News April 15, 2024

ELECTION STORY: ఆదిలాబాద్‌లో గెలుపేవరిదో..?

image

ADB లోక్‌సభ స్థానాన్ని 2019లో BJP గెలుచుకుంది. ఈ పార్టీకి 35.92 శాతం ఓట్లు వచ్చాయి. BRSకు 30.34, కాంగ్రెస్‌కు 29.91 ఓట్లు లభించాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు35.62 ఓట్లు వస్తే, BJPకి 34.32, కాంగ్రెస్‌కి కేవలం 19.26 శాతం ఓట్లు దక్కాయి. ఏడు సెగ్మెంట్లలో 4 బీజేపీ, రెండు బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ప్రస్తుతం ADBలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారో చూడాలి. దీనిపై మీ కామెంట్

News April 15, 2024

మందమర్రి: అక్రమ వడ్డీ, ఫైనాన్స్‌లపై పోలీసుల దాడులు

image

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అక్రమ వడ్డీ వ్యాపారం, చిట్టీలు, ఫైనాన్స్ నిర్వాహకులపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. ఈ దాడులలో ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీలు నడుపుతున్న స్థానిక విద్యానగర్‌కు చెందిన నస్పూరి వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేసి అతను వద్ద నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

News April 14, 2024

ADB: గోడం నగేశ్ రేపటి పర్యటన వివరాలు

image

ఆదిలాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ సోమవారం పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు కాగజ్‌నగర్‌లోని పటేల్ గార్డెన్‌లో నిర్వహించే బూత్ స్థాయి సమావేశంలో పాల్గొని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఆసిఫాబాద్‌లోని ప్రేమల గార్డెన్‌లో  ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.

News April 14, 2024

జన్నారంలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

జన్నారం మండలంలోని బాదంపల్లి గోదావరి తీరంలో మోటార్ రిపేర్ చేస్తుండగా ఓ యువకుడు మృతి చెందాడు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రాజేశ్ గోదావరి తీరంలో మోటార్ రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాజేశ్ మండలంలో వైండింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News April 14, 2024

రెబ్బెన: కుక్కల దాడిలో జింక మృతి

image

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని గోలేటి గ్రామ శివారులో ఆదివారం కుక్కల దాడిలో జింక దుప్పి మృతి చెందింది. గమనించిన వాహనదారులు గ్రామస్థులకు తెలియజేశారు. అనంతరం గ్రామ ప్రజలు జింక మృతదేహాన్ని పరిశీలించి అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.

News April 14, 2024

KZR: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వ్యాన్

image

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్ లో సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

ఆదిలాబాద్‌లో SUMMER CRICKET

image

క్రికెట్‌ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్‌ మొదలుపెడుతామని HCA ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌‌‌రావు తెలిపారు. ఉచితంగా‌నే ఈ క్యాంప్‌ కొనసాగిస్తామని‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివ‌రాలు:
ఆదిలాబాద్: 94402 07473
మంచిర్యాల: 94400 10696
సిర్పూర్: 94923 33333

News April 14, 2024

ఆదిలాబాద్: చెట్టును ఢీకొని లారీ బోల్తా

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న లారీ అదుపుతప్పి శనివారం రాత్రి సీతాగొంది గ్రామంలోని జాతీయ రహదారి పక్కనే ఓ చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అజ్మీర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన ఈఎంటీ రాజ్ కుమార్, పైలట్ ముజఫర్ ఘటన స్థలానికి చేరుకుని బాధితులను రిమ్స్‌కు తరలించారు.

News April 14, 2024

నిర్మల్: పోలీస్ తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం

image

నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద శనివారం పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ. 13,50,000 నగదు పట్టుబడినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. ఎలాంటి నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ నగదును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

News April 14, 2024

MNCL: ఆర్ఎంపీ, పీఎంపీలు పరిమితి మించి వైద్యం చేయరాదు: DMHO

image

మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలతో డీఎంహెచ్ఓ డాక్టర్ సుబ్బరాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమచికిత్స కేంద్రం అని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి బెడ్స్, శాంపిల్స్ మెడిసిన్ ఉండవద్దన్నారు. పరిమితికి మించి వైద్యం చేయరాదని, ఎలాంటి యాంటిబయాటిక్స్ వాడరాదని సూచించారు. నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.