Adilabad

News April 13, 2024

ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అక్షయ్ మృతి

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బానోత్ అక్షయ్ మృతి చెందారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే ఆయన తీవ్ర గాయాలపాలవ్వగా చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.

News April 13, 2024

నిర్మల్: ఆ గ్రామంలో గుక్కెడు నీళ్లు కరువు

image

నిర్మల్ జిల్లా బైంసా మండలం బాబుల్ గావ్ గ్రామస్తులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్న కలెక్టర్ ఆదేశాలు కూడా
అధికారులు లెక్కచేయడం లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆ గ్రామంలో నీటి సమస్య ఉన్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పక్క గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

News April 13, 2024

ఆదిలాబాద్‌లో త్రిముఖ పోరు..!

image

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 5 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూడు పార్టీల అభ్యర్థులు ఆత్రం సుగుణ, గోడం నగేశ్, ఆత్రం సక్కు గ్రామాలలో పర్యటిస్తూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

News April 13, 2024

ఆదిలాబాద్: మరో మూడు రోజులే..!

image

ఉమ్మడి ADB జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే గత ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ADB లోక్ సభ పరిధిలోని 2111 పోలింగ్ కేంద్రాలలో 16,44,715 మంది ఓటర్లకు చోటు దక్కగా.. పెద్దపల్లి పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లాలో 754 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6,47,646 మంది ఓటర్లకు చోటు లభించింది. అయితే ఈ నెల 15 వరకు ఓటరు నమోదు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

News April 13, 2024

ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్ రాక..!

image

ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుక ఇద్దామని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ నెల 16న కేటీఆర్ ఆదిలాబాద్ వస్తున్నారని, కార్యకర్తలు సకాలంలో హాజరై కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు. బోథ్ నియోజకవర్గంలోని 302 బూతుల నుంచి కార్యకర్తలు కష్టపడి 90 వేల ఓట్ల మెజార్టీ ఇవ్వాలన్నారు.

News April 12, 2024

ఆదిలాబాద్‌కు ఆరంజ్, ఎల్లో అలర్ట్ జారీ

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శుక్రవారం HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్, మంచిర్యాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు సాయంత్రం పూట బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

News April 12, 2024

గాదిగూడలో రూ.4.50 లక్షల గంజాయి పట్టివేత

image

గాదిగూడ మండల పరిధిలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఉమ్మడి నార్నూర్ మండలంలో గత నాలుగు రోజుల్లో దాదాపు 18 కిలోలతో కూడిన సుమారు రూ.4.50 లక్షల గంజాయిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

News April 12, 2024

ట్రాక్టర్‌పై నుంచి పడి డ్రైవ‌ర్‌ మృతి

image

ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ పై నుంచి పడి డ్రైవ‌ర్‌ మృతి చెందిన ఘటన కుంటాల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దాన్ల రాజు (40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తిరిగి ఓల గ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడిపోయాడు. ముఖంపై, తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 12, 2024

రామకృష్ణాపూర్: తండ్రిని చంపిన తనయుడి అరెస్టు

image

రామకృష్ణాపూర్ పట్టణం అల్లూరి సీతారాం నగర్‌కు చెందిన భామండ్లపల్లి రాయమల్లు(56)ని హత్య చేసిన రాకేష్ అనే నేరస్థుడిని అరెస్టు చేసినట్లు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. రాయమల్లు మద్యానికి బానిసై ఎప్పుడు ఇంట్లో వాళ్లతో గొడవ పడుతుండేవాడు. మృతుడి ఫోన్ కొడుకు రాకేష్ వాడుతున్నాడు. సెల్ ఫోన్ విషయంలో తండ్రి, కొడుకు గొడవపడి కొడుకు తండ్రిని రోకలి బండతో తలపై కొట్టగా మృతి చెందాడు.

News April 12, 2024

ఆదిలాబాద్: మురికి కాల్వలో పడి ఒకరి మృతి

image

ఆదిలాబాద్ పట్టణంలో ఓ మురికి కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవన సమీపంలోని శుక్రవారం మురికి కాల్వలో పడి చౌహన్ సంతోష్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతను రోడ్లపై దొరికే సామగ్రిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. అయితే మురికికాలువలో ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఇంకా ఏమైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.