Adilabad

News April 11, 2024

ADB: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

ఈనెల 11న రంజాన్ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమాసమైన రంజాన్ నెలరోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాను ప్రార్థించి ఆధ్యాత్మిక జీవనం కొనసాగించారన్నారు. జిల్లాలోని ముస్లిం సోదరులు, సోదరీమణులు అనందోత్సవాలతో, భక్తిశ్రద్ధలతో పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఆ అల్లా దీవెనలు ఎప్పుడూ వారిపై ఉండాలని ఆకాంక్షించారు.

News April 10, 2024

తాండూరు: మద్యానికి బానిసైన భర్త.. భార్య ఆత్మహత్య

image

తాండూరు మండలం మాదారం గ్రామానికి చెందిన గుమాస భారతి (30) హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన భారతికి లక్ష్మణ్ తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని చికెన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మణ్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడుతున్నారు. ఇదే విషయమై భార్యల మధ్య గొడవ జరిగింది. భారతి ఆవేశంతో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

News April 10, 2024

తానూర్‌లో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

image

తానూర్ మండల కేంద్రానికి చెందిన అవదూత్వార్ లచ్చిరాం(59) చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. ఎస్‌ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చిరాం గత కొన్ని రోజులుగా బోదకాలు వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో పాటు తన కాలికి సర్జరీ అయ్యింది. దీంతో ఆ నొప్పులు భరించలేక బుధవారం వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య గంగాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 10, 2024

ASF: 108లో ప్రసవం

image

108లో అంబులెన్స్‌లో ఓ గర్భిణీ ప్రసూతి అయిన ఘటన సిర్పూర్ (U) మండలంలో జరిగింది. 108 EMT ఆత్రం రామేశ్వరి, పైలెట్ దయాకర్ తెలిపిన వివరాలు.. మత్తురతాండకు చెందిన జ్యోతికి పురుటి నొప్పులు రావడంతో కుటంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ రామేశ్వరి సహాయంతో జ్యోతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలింతను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని EMT తెలిపారు.

News April 10, 2024

ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన రైల్వే కానిస్టేబుల్

image

బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన వాసీమ కుటుంబకలహాలతో జీవితంపై విరక్తి చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు మైక్రో స్టేషన్ క్వారీకి వెళ్లింది‌. ఆమె భర్త షబ్బీర్ విషయం తెలుసుకుని జీఆర్పీ కానిస్టేబుల్ ఎండీ రషీద్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్ ఘటనాస్థలికి చేరుకుని కాపాడాడు. ముగ్గురి ప్రాణాలను
కాపాడిన కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు.

News April 10, 2024

కేయూ డిగ్రీ కోర్సుల పరీక్షల టైం టేబుల్

image

KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

News April 10, 2024

ఆదిలాబాద్: నిండు గర్భిణీ మృతి

image

సిరికొండ మండలం పొన్న ఎక్స్ రోడ్‌కు చెందిన పేందుర్ విమల బాయి (25) అనే నిండు గర్భిణీ మృతి చెందింది. బంధువుల వివరాలు.. విమల బాయికి రక్తహీనత, విరేచనాలు ఎక్కువ అవ్వడంతో ఇచ్చోడ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు.. 108లో మెరుగైన వైద్యం కోసం ADB రిమ్స్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News April 10, 2024

ADB: దంపతుల మధ్య గొడవ.. అడ్డొచ్చిన తండ్రిపై కత్తితో దాడి

image

కొడుకు, కోడలు గొడవ పడుతుంటే వారించడానికి వెళ్లిన తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SI రవికుమార్ వివరాల ప్రకారం.. స్థానిక చేపల మార్కెట్ వద్ద నివాసం ఉంటున్న రాజుకు అతడి భార్య మధ్య గొడవ జరిగింది. రాజు తండ్రి రవీందర్ వారిని వారించే ప్రయత్నం చేశాడు. మా మధ్యలోకి ఎందుకు వస్తున్నావంటూ రాజు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో తండ్రిపై దాడి చేశాడు.

News April 10, 2024

నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్

image

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రత దృష్ట్యా, ప్రశాంతత పెంపొందించేందుకు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీసు ఉన్నత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, చేపట్టవద్దని డీజేలు, వాడరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

News April 10, 2024

ADB: రాగల 5రోజులు వర్షాలు !

image

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని.. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రెండ్రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.