Adilabad

News April 10, 2024

ADB: పగలు ఎండ… రాత్రిపూట వర్షం !

image

మంగళవారం ఆదిలాబాద్‌లో భిన్న వాతావరణం కనిపించింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు మేఘావృతమై చల్లటి వాతావరణం కనిపించగా 8 గంటల తర్వాత సూర్యుని ప్రతాపం కనిపించింది. సాయంత్రం 4 గంటల వరకు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 4 గంటల తర్వాతా ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడి చల్లటి గాలులు వీచాయి రాత్రి 8 గంటల తర్వాతా ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

News April 9, 2024

జైనూర్: దగ్గు, దమ్ముతో నిండు గర్భిణీ మృతి !

image

జైనూర్ మండలం లక్ష్మణ్ పటేల్‌గూడకు చెందిన ఆత్రం లక్ష్మి(30) అనే నిండు గర్భిణీ దగ్గు, దమ్ముతో అకస్మాత్తుగా మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాలు.. లక్ష్మీకి దమ్ము, దగ్గు అధికం కావడంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు.. ఆక్సిజన్ ద్వారా 108లో మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఒకేసారి దమ్ము, దగ్గు రావడంతో చనిపోయిందని చెప్పారు.

News April 9, 2024

ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలి: ఎస్పీ సురేశ్

image

లోక్‌సభ ఎన్నిక నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ ఆదేశించారు. బెజ్జూరు పోలీస్ స్టేషన్‌ను నేడు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి పార్టీలు, వ్యక్తులకు అతీతంగా పారదర్శకంగా అమలు చేయాలన్నారు. చెక్ పోస్ట్ విధుల్లో ఉంటే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 9, 2024

MNCL: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం పట్టివేత

image

కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన గుల్ల రాకేష్ అక్రమంగా రేషన్ బియ్యాన్ని వాహనంలో తరలిస్తుండగా మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించి బోలేరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 12.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమైనట్లు పేర్కొన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించి, రాకేష్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 9, 2024

MNCL: ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్‌లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. MNCL జిల్లా కాసిపే మండలానికి చెందిన స్వాతికి గతంలో వివాహమై భర్త మరణించాడు. దీంతో KNR కూల్‌ డ్రింక్స్ కంపెనీలో పనిచేస్తోంది. దూరపు బంధువైన శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పెళ్లికి నిరాకరించడంతో యువతి అతడి ఇంటి ముందు బైఠాయించింది.

News April 9, 2024

మంచిర్యాల: సైబర్ క్రైమ్ ఉచ్చులో విద్యార్థిని

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాలకు చెందిన ఓ విద్యార్థిని సైబర్ క్రైమ్ ఉచ్చులో పడి రూ. 2, 25, 585 నగదు పోగొట్టుకుంది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన వాట్సాప్ కాల్ ఆధారంగా టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు అదనంగా వస్తాయని నమ్మించాడు. లింక్‌ల ఆధారంగా వారం రోజుల పరిధిలో నగదును జమ చేసింది. అయినప్పటికీ ఎలాంటి నగదు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు నిన్న ఫిర్యాదు చేసింది.

News April 9, 2024

జైపూర్: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

జైపూర్ మండలంలో దారుణం జరిగింది. 2వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ వైద్య సురేశ్.. తన ఇంటి ముందు ఉన్న 2వ తరగతి చదువుతున్న చిన్నారికి ఐస్ క్రీం కొనిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 9, 2024

దేవాలయంలో భక్తులపై తేనెటీగల దాడి

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బుగ్గ దేవాలయంలో తేనెటీగలు భక్తులపై దాడి చేశాయి.  సోమవారం దేవాలయంలో హనుమాన్ భక్తులు వంట చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో హనుమాన్ భక్తులు పరుగులు తీశారు. కొంత మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. 

News April 8, 2024

ASF: ఇంట్లో ఉరేసుకుని యువతి సూసైడ్

image

రెబ్బెన మండలం పాసిగాం గ్రామానికి చెందిన రజిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెబ్బెన ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాసిగాం గ్రామానికి చెందిన శంకర్‌తో 2019లో రజితకు వివాహమైంది. పిల్లలు కలగడం లేదని శంకర్ మద్యం సేవించి తరుచూ రజీతను మానసికంగా వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన రజిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News April 8, 2024

మంచిర్యాల: వివాహ వేడుకలో కత్తులతో దాడి

image

చెన్నూరులో ఆదివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి విందులో కత్తి పోట్లు కలకలం రేపాయి. పెళ్లిలో పలువురి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో వారు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.