Adilabad

News April 5, 2024

మంచిర్యాలలో ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెండ్

image

మంచిర్యాలలోని కార్మల్ కాన్వెంట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. అయితే మొదటి రోజు విధులకు కారణం లేకుండా గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సదురు ఉపాధ్యాయులను వివరణ కోరగా వారు స్పందించకపోవడంతో డీఈవో యాదయ్య వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

News April 4, 2024

మంచిర్యాల: శాంతిఖని గనిలో ప్రమాదం

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికుల వివరాల ప్రకారం.. గని మెయిన్ రైడింగ్ ఛైర్ లిఫ్ట్ 47L కరువు స్టేషన్ వద్ద నుంచి లెవెల్ ఛైర్ లిఫ్ట్ స్టేషన్ కు వచ్చే చైర్ జామ్ అయింది. ఉదయం షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న జనరల్ మజ్దూర్ శివకుమార్ ఆ ఛైర్ తీసే క్రమంలో కుడిచేతి రెండు వేళ్లు ప్రమాదవశాత్తు చివరి భాగాలు కట్ అయినట్లు కార్మికులు తెలిపారు.

News April 4, 2024

ఇండియా అబ్బాయి.. లండన్ అమ్మాయి.. బెల్లంపల్లిలో పెళ్లి

image

బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన యువకుడు రాజుకు లండన్‌కు చెందిన యువతి డయానకు గురువారం బెల్లంపల్లిలో వివాహమైంది. వ్యాపార రీత్యా రాజు మూడేళ్ల క్రితం లండన్ వెళ్ళాడు. అక్కడే డయానతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరు ఒకటై హిందూ సంప్రదాయం ప్రకారం బెల్లంపల్లిలో జరిగింది.

News April 4, 2024

ASF: ఆ మండలంలో 144 సెక్షన్.. కారణమిదే..!

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేస్తూ తహశీల్దార్N. భూమేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News April 4, 2024

ఆదిలాబాద్: 3.55 లక్షల మందికి జీరో బిల్

image

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో గృహజ్యోతి పతకానికి సంబంధించిన అర్హులకు మొదటి నెల జీరో బిల్లులను జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో 8.14 విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. 3.55 లక్షల మంది 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించినట్లు గుర్తించారు. దీంతో మార్చి నెలలో 3.45 లక్షల మందికి రూ.9.38 కోట్ల రాయితీతో జీరో బిల్లులను అందించారు.

News April 4, 2024

MNCL: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్

image

మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు MNCL CI బన్సీలాల్ తెలిపారు. మార్చి 28న 10th పరీక్షలు రాస్తుండగా బాలిక కనిపించడం లేదని ఆమె తల్లి సంతారు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్(27)అనే వ్యక్తి ఆమెను బలవంతంగా వేములవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి తిరుపతికి తీసుకెళ్తుండగా ఆమె తప్పించుకొని వచ్చినట్లు వెల్లడించారు.

News April 4, 2024

ASF: ఏనుగు దాడిలో మరో రైతు మృతి

image

జిల్లాలో నిన్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుపై ఏనుగు దాడి జరిగింది. కారు పోచన్న అనే రైతు ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలం వద్ద ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News April 4, 2024

ADB: పాఠశాల మౌలిక సదుపాయాల అంచనాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

అమ్మ ఆదర్శ- పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల అంచనాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 4, 5 తేదీల్లో పాఠశాలల్లోని 5రకాల పనులకు సంబంధించి వాటిపనుల అంచనాలను సంబంధిత అధికారుల సమన్వయంతో పూర్తిచేయాలన్నారు.

News April 3, 2024

ఆదిలాబాద్: తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్‌ల నియామకం

image

తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ప్రశాంత్ జీవన్‌పాటిల్ మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు కృష్ణ ఆదిత్యను తాగునీటిని పర్యవేక్షణ ప్రత్యేక అధికారులుగా నియమించారు.

News April 3, 2024

ADB: ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ తలంబ్రాలను అక్కడికి వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ ద్వారా అందజేయడం జరుగుతుందని ఆర్ఏం సులేమాన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. తలంబ్రాల కోసం ఉమ్మడి జిల్లాలోని కార్గోపార్సిల్ కేంద్రాల్లో భక్తులు ఒక ప్యాకెట్‌కు రూ.151 చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.