Adilabad

News April 3, 2024

ASF: ఏనుగు దాడిలో రైతు మృతి

image

ఏనుగు దాడిలో రైతు మృతిచెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన అన్నూరి శంకర్ బుధవారం తన మిరపతోటలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఏనుగు ఒక్కసారిగా మిరప చేనులో దిగింది. అతడిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన గురై పరుగులు తీశారు.

News April 3, 2024

ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ వివరాలు

image

ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 1952వ సంవత్సరంలో ఏర్పడింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ స్థానాన్ని ఎస్టీ రిజర్వ్‌డ్‌గా మార్చారు. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా.. మొదటి సారి సోషలిస్ట్ పార్టి, తరువాత కాంగ్రెస్ 9, టీడీపీ 5, బీఆర్ఎస్2, ప్రస్తుతం బీజేపీ నుంచి సోయం బాపురావు ఎంపీగా గెలుపొందారు.

News April 3, 2024

ADB: కిడ్నీ సమస్యతో ఖాళీ అయిన ఊరు..!

image

ADB జిల్లా భీంపూర్ మండలం గోవింద్‌పూర్‌ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు బావుల నీటినే వినియోగించేవారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత సమస్యతో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో గ్రామస్థులు ఊరిని వదిలి వెళ్లిపోయారు.

News April 3, 2024

నిర్మల్‌లో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

image

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిర్మల్ 43.5 డిగ్రీల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలో 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. జిల్లాలోని బైంసా మండలం వానల్ పాడ్, నర్సాపూర్ మండలంలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

News April 3, 2024

తాండూరు: ‘ప్రేమ పేరుతో భార్యను వేధించాడని చంపేశాడు’

image

తాండూరులోని సుభద్ర కాలనీకి చెందిన అజ్గర్ <<12972348>>హత్యకు గురైన<<>> విషయం తెలిసిందే. అతడి ఫోన్ సిగ్నల్స్ ద్వారా IBలోని ఓ కాలనీకి చెందిన దంపతులతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. మార్చి 31 రాత్రి అజ్గర్‌ను ఇంటికి పిలిచి తలపై రాడ్డుతో కొట్టి గొంతు నులిమి చంపేశారు. తన భార్యను అజ్గర్ ప్రేమ పేరుతో వేధించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఆ ముగ్గురిని ASF సబ్ జైలుకు తరలించారు.

News April 3, 2024

ADB: అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడిపై వేటు

image

అనుమతి లేకుండానే విదేశీ పర్యటనకు వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాద్యాయుడు మహేందర్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ప్రణీత మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్చి నెల 9 నుంచి 14 వరకు స్కూల్ అసిస్టెంట్ మహేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లారని ఆయనపై పీఆర్టీయూ తెలంగాణ యూనియన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతడిపై విచారణ జరిపించి వేటువేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News April 3, 2024

మంచిర్యాల: జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

మంచిర్యాల జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు నిరంతరం తాగునీటి సరఫరాకు అదనపు కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మండల, గ్రామ, వార్డుస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.

News April 2, 2024

మంచిర్యాల: అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం సోమవారం లభించినట్లు CI కుమారస్వామి తెలిపారు. తాండూర్ IB సుభద్ర కాలనీకి చెందిన అజ్గర్ అలీ(33) శనివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అబ్బాపూర్ ఓసీపీ పరిసరాల్లో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఇది హత్యా? లేకా ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు CI వెల్లడించారు.

News April 2, 2024

భైంసాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బైంసా మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా కాండ్లి గ్రామానికి చెందిన గంప గణేశ్(45) భైంసాకు వస్తున్న క్రమంలో టాక్లి గ్రామ శివారులో బైకు అదుపు తప్పి కిందపడినట్లు తెలిపారు. అతడి తల బలంగా రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు.

News April 2, 2024

మంచిర్యాల: ఆల్ టైం రికార్డ్ సాధించిన సింగరేణి

image

సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం సాధించి ఆల్ టైం రికార్డ్ ఆర్థిక సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 70.02 మిలియన్ టన్నులు సాధించడంతోపాటు అదే స్థాయిలో 69.86లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సంస్థ C&MD బలరాం నాయక్ ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన అధికారిని నియమించారన్నారు.