Adilabad

News March 27, 2024

బోథ్: ఐదేళ్లుగా కడుపులో.. అరుదైన ఆపరేషన్

image

బోథ్‌లోని ఓ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఉట్నూర్ మండలానికి చెందిన ఓ మహిళ గత 5ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ నిర్వహించి మూడు కిలోల కణితిని తొలిగించారు. డా. రవీంద్ర ప్రసాద్, శివ ప్రసాద్, సంతోష్ వైద్య బృందంతో ఆపరేషన్ నిర్వహించి మూడు కేజీల కణతిని తొలిగించినట్లు చెప్పారు. దీంతో వైద్యులు, సిబ్బందికి ఆమె కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

News March 27, 2024

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర ఇలా..

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.6,920గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,250గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేటు ధర రూ.30 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.

News March 27, 2024

బెల్లంపల్లి: రైలు ఢీకొని యువకుడి మృతి

image

బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మహారాష్ట్రకు చెందిన యువకుడు రమేష్ చిన్న నరోటి(24) మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన రమేష్.. నరోటి ఆహారశుద్ధి పరిశ్రమ పనుల్లో కూలీగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

News March 27, 2024

నిర్మల్: పాముకాటుతో యువరైతు మృతి

image

నాటువైద్యం వికటించి రైతు మృతి చెందిన ఘటన దస్తురాబాద్‌ మండలంలో జరిగింది. SI యాసిర్‌ ఆరాఫత్‌ వివరాలు.. గొడిసిర్యాల గొండుగూడకు చెందిన మెస్త్రం భుజంగరావ్‌(23)కు ఈనెల 18న పాముకాటు గురయ్యారు. ఓ నాటు వైద్యుడికి రూ.10వేలు ఇచ్చి వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 25న నిర్మల్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News March 27, 2024

ADB: 10వ తరగతి మూల్యాంకన డబ్బులు విడుదల

image

గత సంవత్సరం ఏప్రిల్, మే నెలలో నిర్వహించిన 10వ తరగతి మూల్యాంకన డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా ఉపాధ్యాయుల ఖాతాలో మంగళవారం జమ చేసినట్లు అధికారులు తెలియజేశారు. 10నెలల తర్వాత ఎట్టకేలకు బకాయిలు చెల్లించడంతో ఉపాధ్యాయులకు ఊరటనిచ్చింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల ఖాతాల్లో రూ.12.85 లక్షల నిధులు జమయ్యాయి.

News March 27, 2024

ADB: విచిత్రమైన ఆవు దూడ.. వీపుపైన కాళ్లు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆవుకు విచిత్రమైన లేగదూడ పుట్టింది. భీంపూర్‌ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన రైతు ప్రమోద్‌కు చెందిన ఆవు లేగదూడకు మంగళవారం జన్మనిచ్చింది. ఆ దూడ ముందు రెండు కాళ్లు సహజంగానే ఉన్నప్పటికీ.. వెనుక ఉండాల్సిన కాళ్లు మాత్రం వీపు పైన ఉన్నాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు తరలి వచ్చారు. అయితే జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జన్మిస్తాయని మండల పశువైద్యాధికారి సుభాష్‌ రాథోడ్‌ తెలిపారు.

News March 27, 2024

కలిసికట్టుగా పని చేస్తే విజయం మనదే: అత్రం సక్కు

image

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే విజయం సాధిస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. ఘనపూర్, ఉట్నూర్ గ్రామంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా పని చేస్తే విజయం తథ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రా జైవంత్ రావు ఉన్నారు.

News March 26, 2024

MNCL: విద్యుత్ షాక్ తగిలి ఒకరి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాలు చూస్తే… మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన సిద్ధం పుల్లయ్య (82) అనే వృద్ధుడు తన ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ షాక్ తగిలి పుల్లయ్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు.

News March 26, 2024

రాష్ట్రంలో ఆదిలాబాద్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు ఠారెత్తిస్తున్నాడు.. ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. తలమడుగు, సాత్నాలలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత మరింతే పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

News March 26, 2024

ఆదిలాబాద్: బస్సు- బైక్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. జైనథ్ మండలం బెల్లూరికి చెందిన అశోక్, బాపురావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జందాపూర్ ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అశోక్ తలకు తీవ్ర గాయాలు కాగా, బాపురావుకు గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహన ఈఎంటీ కిషన్, పైలెట్ వసీంలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.